అన్వేషించండి

Telangana News: గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు

Gaddar News Today: గద్దర్‌పై కేంద్రమంత్రి బండిసంజయ్‌ చేసిన కామెంట్స్ కాక ఇంకా చల్లారక ముందే ఏపీకి చెందిన బీజేపీ నేత మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఉగ్రవాదులతో పోల్చారు.

Telangana News: తెలంగాణ ఉద్యమ నౌక గద్దర్‌ కేంద్రంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల దాడి కొనసాగుతోంది. పద్మ అవార్డుల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కౌంటర్ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు వారి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. గద్దర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

గద్దర్‌ను ఎల్టీటీఈ తీవ్రవాదితో పోల్చారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. దేశానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తికి ఎలా అవార్డు అడుగుతారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ఈ డిమాండ్ చేస్తున్నారని నిలదీశారు. ప్రజల ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్ అంటూ సంచలన వ్యాక్యలు చేశారు. నిషేధిత మావోయిస్టు సంస్థలో పని చేసిన వ్యక్తికి అవార్డు ఇస్తారా అని విస్మయం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎల్టీటీఈకి కూడా పద్మ అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించారు. గద్దర్ కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నందుకు అవార్డు ఇవ్వాలా అని నిలదీశారు. ఇప్పటికి కూడా ఆయనపై కేసులు ఉన్నాయని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు.  

పద్మ పురస్కారాలపై రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా స్పందించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ అవార్డులు రావన్న ఆయన... అందుకు కొన్ని అర్హతలు ఉంటాయని గుర్తు చేశారు. ఏ స్థఆయి లేని గద్దర్‌ లాంటి వ్యక్తులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన ఆయనకు అవార్డు ఇస్తే ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. తమ కార్యకర్తలను చంపిన వ్యక్తులపై పాటలు పాడారని అలాంటి వ్యక్తికి బరాబర్‌ అవార్డు ఇవ్వబోమని స్పష్టం చేశారు. 

Also Read: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు

బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గద్దర్‌ను అవమానిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను జాగృతం చేసిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అంటున్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తిని అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా అని నిలదీస్తున్నారు. నక్సలైట్ భావాజాలం అయితే అవార్డులు ఇవ్వరా అంటు ప్రశ్నిస్తున్నారు. నక్సలైట్‌లకు ఎన్నికల్లో పోటీ చేసే టిక్కెట్‌లు ఇస్తారు కానీ అవార్డులు ఇవ్వారా అని ఫైర్ అయ్యారు. 

2025 సంవత్సరానికి పద్మ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదిత పేర్లు ఇవే. అందెశ్రీ (ప‌ద్మభూష‌ణ్‌), చుక్కా రామ‌య్య (ప‌ద్మభూష‌ణ్‌), గ‌ద్దర్ (ప‌ద్మవిభూష‌ణ్‌), గోర‌టి వెంక‌న్న (ప‌ద్మశ్రీ‌), జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు (ప‌ద్మశ్రీ‌) పేర్లను కేంద్రానికి తెలంగాణ సిఫార్సు చేసింది. ఈసారి దేశవ్యాప్తంగా 139 మందికి కేంద్రం పద్మ పురస్కారాలు అందజేసింది. ఇందులో రెండు తెలంగాణకు వస్తే ఐదు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి.

Also Read: గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
Rajinikanth - Salman Khan: సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
Rajinikanth - Salman Khan: సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
Phone Tapping Case: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వచ్చేనా ?
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వచ్చేనా ?
Revant 10 years CM: పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
YSRCP Dual Role: జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
Padma Bhushan Balakrishna: ‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
Embed widget