అన్వేషించండి

Minister Harish Rao : ప్రధాని ఇచ్చిన హామీలకే దిక్కులేదు, మునుగోడులో బీజేపీ హామీలకు విలువలేదు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : మునుగోడులో రూ. 3 వేల పింఛన్ అంటున్న బీజేపీ నేతలు.. ప్రధాని మోదీతో తెలంగాణ మొత్తం అమలుచేస్తామని చెప్పించాలని మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు.

Minister Harish Rao : బీజేపీ అంటేనే జూటా, జుమ్లా పార్టీ అంటూ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలైందా అంటూ ప్రశ్నించారు. మునుగోడులో గెలిస్తే  రూ.3 వేల పింఛన్ ఇస్తామంటున్న బీజేపీ నేతలు, ఆ హామీని తెలంగాణ అంతటా  అమలు చేస్తామని ప్రధాని మోదీ,  అమిత్‌షాతో చెప్పించాలన్నారు.  లేదంటే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్‌ చేశారు.  తెలంగాణ భవన్‌లో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు బీజేపీపై మండిపడ్డారు.  మద్దతు ధరపై మోదీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రైతు చట్టాలను రద్దు చేసి జాతికి ప్రధాని క్షమాపణ చెప్పి ఏడాది గడుస్తుందని గుర్తుచేశారు. మద్దతు ధరకు చట్టబద్దత తీసుకొస్తామని చెప్పిన ప్రధాని ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు.  ప్రధాని ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే మునుగోడులో బీజేపీ నేతలు ఇచ్చే హామీలు విలువేంటని ప్రశ్నించారు.

మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యకు చెక్ 

ప్రపంచ ఆరోగ్య సంస్థ మునుగోడులో ఫ్లోరైడ్‌ లేని తాగునీటిని సరఫరా చేయకపోతే నో మ్యాన్‌ జోన్‌గా మారుతుందని హెచ్చరించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.  కాంగ్రెస్‌లో మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఫ్లోరైడ్‌ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మిషన్‌ భగీరథతో ఫ్లోరైడ్‌ సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్  కాకతీయకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం ఒక్క పైసా సాయం చేయలేదని ఆరోపించారు. 

8 ఏళ్లుగా కృష్ణా జలాల్లో వాటా తేల్చలేదు 

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ రాష్ట్రానికి  అన్యాయం చేస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని ప్రధాని మోదీ మాట్లాడారన్నారు. నల్గొండకు నీళ్లు ఇవ్వని బీజేపీకు మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదన్నారు.  8 ఏళ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోవడంతో నల్గొండ, మునుగోడుకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కోర్టులో కేసు ఉపసంహరించు వెంటనే వాటా తెలుస్తామని చెప్పారని, కేసు ఉపసంహరించుకుని పది నెలలు అయినా ఇంత వరకూ  కృష్ణా జలాల్లో కేటాయింపులు చేయలేదన్నారు. ఫ్లోరోసిస్‌ను మునుగోడు నుంచి పారదోలింది సీఎం కేసీఆర్‌ కాదా? అంటూ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. సూర్యాపేట, నల్గొండకు మెడికల్‌ కాలేజీలు కేటాయించామన్నారు. దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు ఇస్తే ఒక్క కాలేజీ కూడా తెలంగాణకు ఇచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Also Read : Munugode Bypolls: రాజగోపాల్ రెడ్డికి ఓటు వేస్తే మోరిలో వేసినట్టే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget