అన్వేషించండి

Munugode Bypolls: రాజగోపాల్ రెడ్డికి ఓటు వేస్తే మోరిలో వేసినట్టే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని, బీజేపీకి ఓటు వేశారంటే, అది మోరిలో వేసినట్లేనన్నారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

తన స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ఓటర్లను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. ఒక్కడి ప్రయోజనాల కోసం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి, ఉప ఎన్నికలతో మునుగోడు ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేశారంటే, అది మోరిలో వేసినట్లేనన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం మునుగోడు మండలంలోని గూడపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 

సంక్షేమ పాలనకు నిదర్శనం.. 
పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణను సీఎం కేసీఆర్ విజయమార్గంలో నడిపిస్తున్నారని అన్నారు. దేశంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్‌ నాయకత్వంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు ఇక బారం కాకూడదని పథకాలు, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు రైతు బంధు, వ్యవసాయ బోర్లకు మీటర్లు లేని మోటార్లు కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనం అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు.

అన్ని వర్గాల వారికి పథకాలు 
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిపిస్తున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.3016 పింఛన్లు, వయసు మీద పడిన పెద్దోళ్లతో పాటు ఎయిడ్స్ పేషెంట్స్, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులు, ఇలా ఎంతో మందికి ప్రతినెలా రూ.2016 ఇస్తున్నారని గుర్తుచేశారు. రైతాంగానికి రైతుబంధు, 24 గంటలు ఉచిత కరెంటు పథకాలు తెచ్చి అన్నదాతల కన్నీళ్లు తుడిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం... రాష్ట్రాల్లో అభివృద్ధిని సహించలేక ఉచిత కరెంటు తొలగించి, మీటర్లు పెట్టి ఏటా రూ. 15,000 వసూలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనుక బీజేపీకి ఓటు వేస్తే, మోరిలో వేసినట్టేనని అన్నారు. 

భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం
మునుగోడు ఓటర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టనున్నారని తెలంగాణ పశుసంవర్దక శాఖ, సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధిస్తారని, మునుగోడు ప్రజలకు టీఆర్ఎస్ వెంట ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలోని పలు వార్డులలో పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి తలసాని. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. ఆసరా పింఛన్లు, అన్నదాతలకు 24 గంటల కరెంట్‌, రైతు బంధు, దళితులకు దళిత బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మిషన్‌ భగీరథ, మిషన్ కాకతీయతో ఫ్లోరోసిస్ సమస్యకు చెక్ పెట్టిన ఘనత కేసీఆర్ దేనన్నారు. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేశారని చెప్పార. కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Embed widget