అన్వేషించండి

Munugode Bypolls: రాజగోపాల్ రెడ్డికి ఓటు వేస్తే మోరిలో వేసినట్టే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని, బీజేపీకి ఓటు వేశారంటే, అది మోరిలో వేసినట్లేనన్నారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

తన స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ఓటర్లను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. ఒక్కడి ప్రయోజనాల కోసం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి, ఉప ఎన్నికలతో మునుగోడు ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేశారంటే, అది మోరిలో వేసినట్లేనన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం మునుగోడు మండలంలోని గూడపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 

సంక్షేమ పాలనకు నిదర్శనం.. 
పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణను సీఎం కేసీఆర్ విజయమార్గంలో నడిపిస్తున్నారని అన్నారు. దేశంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్‌ నాయకత్వంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు ఇక బారం కాకూడదని పథకాలు, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు రైతు బంధు, వ్యవసాయ బోర్లకు మీటర్లు లేని మోటార్లు కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనం అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు.

అన్ని వర్గాల వారికి పథకాలు 
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిపిస్తున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.3016 పింఛన్లు, వయసు మీద పడిన పెద్దోళ్లతో పాటు ఎయిడ్స్ పేషెంట్స్, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులు, ఇలా ఎంతో మందికి ప్రతినెలా రూ.2016 ఇస్తున్నారని గుర్తుచేశారు. రైతాంగానికి రైతుబంధు, 24 గంటలు ఉచిత కరెంటు పథకాలు తెచ్చి అన్నదాతల కన్నీళ్లు తుడిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం... రాష్ట్రాల్లో అభివృద్ధిని సహించలేక ఉచిత కరెంటు తొలగించి, మీటర్లు పెట్టి ఏటా రూ. 15,000 వసూలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనుక బీజేపీకి ఓటు వేస్తే, మోరిలో వేసినట్టేనని అన్నారు. 

భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం
మునుగోడు ఓటర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టనున్నారని తెలంగాణ పశుసంవర్దక శాఖ, సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధిస్తారని, మునుగోడు ప్రజలకు టీఆర్ఎస్ వెంట ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలోని పలు వార్డులలో పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి తలసాని. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. ఆసరా పింఛన్లు, అన్నదాతలకు 24 గంటల కరెంట్‌, రైతు బంధు, దళితులకు దళిత బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మిషన్‌ భగీరథ, మిషన్ కాకతీయతో ఫ్లోరోసిస్ సమస్యకు చెక్ పెట్టిన ఘనత కేసీఆర్ దేనన్నారు. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేశారని చెప్పార. కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget