అన్వేషించండి

Munugode Bypolls: రాజగోపాల్ రెడ్డికి ఓటు వేస్తే మోరిలో వేసినట్టే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని, బీజేపీకి ఓటు వేశారంటే, అది మోరిలో వేసినట్లేనన్నారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

తన స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ఓటర్లను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. ఒక్కడి ప్రయోజనాల కోసం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి, ఉప ఎన్నికలతో మునుగోడు ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేశారంటే, అది మోరిలో వేసినట్లేనన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం మునుగోడు మండలంలోని గూడపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 

సంక్షేమ పాలనకు నిదర్శనం.. 
పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణను సీఎం కేసీఆర్ విజయమార్గంలో నడిపిస్తున్నారని అన్నారు. దేశంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్‌ నాయకత్వంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు ఇక బారం కాకూడదని పథకాలు, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు రైతు బంధు, వ్యవసాయ బోర్లకు మీటర్లు లేని మోటార్లు కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనం అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు.

అన్ని వర్గాల వారికి పథకాలు 
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిపిస్తున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.3016 పింఛన్లు, వయసు మీద పడిన పెద్దోళ్లతో పాటు ఎయిడ్స్ పేషెంట్స్, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులు, ఇలా ఎంతో మందికి ప్రతినెలా రూ.2016 ఇస్తున్నారని గుర్తుచేశారు. రైతాంగానికి రైతుబంధు, 24 గంటలు ఉచిత కరెంటు పథకాలు తెచ్చి అన్నదాతల కన్నీళ్లు తుడిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం... రాష్ట్రాల్లో అభివృద్ధిని సహించలేక ఉచిత కరెంటు తొలగించి, మీటర్లు పెట్టి ఏటా రూ. 15,000 వసూలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనుక బీజేపీకి ఓటు వేస్తే, మోరిలో వేసినట్టేనని అన్నారు. 

భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం
మునుగోడు ఓటర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టనున్నారని తెలంగాణ పశుసంవర్దక శాఖ, సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధిస్తారని, మునుగోడు ప్రజలకు టీఆర్ఎస్ వెంట ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలోని పలు వార్డులలో పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి తలసాని. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. ఆసరా పింఛన్లు, అన్నదాతలకు 24 గంటల కరెంట్‌, రైతు బంధు, దళితులకు దళిత బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మిషన్‌ భగీరథ, మిషన్ కాకతీయతో ఫ్లోరోసిస్ సమస్యకు చెక్ పెట్టిన ఘనత కేసీఆర్ దేనన్నారు. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేశారని చెప్పార. కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget