అన్వేషించండి

Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య, రాకపోకలు ఆలస్యం!

Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అమీర్ పేట్-రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Hyderabad Metro Rail : హైదరబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అమీర్‌పేట్‌-రాయదుర్గం మార్గంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రాయదుర్గం-అమీర్‌పేట్‌ ఒకవైపు మార్గంలోనే రైళ్లు నడుపుతున్నారు. ఒకే రూట్‌లో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే రైళ్ల రాకపోకల ఆలస్యానికి సంబంధిత అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఇటీవల తరచూ మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. మెట్రో రైళ్లలో తరచూ టెక్నికల్ ఇష్యూలు రావడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా రైళ్లను నడపాలని కోరుతున్నారు. అలాగే రాకపోకల ఆలస్యంపై రైలు సిబ్బంది ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. సాంకేతిక సమస్యలకు ప్రయాణికులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. 

Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక  సమస్య, రాకపోకలు ఆలస్యం!

(రాయదుర్గం మెట్రోస్టేషన్ లో ప్రయాణికుల రద్దీ) 

నిన్న ఎర్రమంజిల్ వద్ద నిలిచిపోయిన రైలు 

హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. సాంకేతిక సమస్యతో మెట్రో రైలు మరోసారి నిలిచిపోయింది. సోమవారం ఎల్బీ నగర్ వెళ్తోన్న మెట్రో రైలును టెక్నికల్ ప్రాబ్లమ్ తో  నిలిపివేశారు. దీంతో  రైలును ఎర్రమంజిల్ స్టేషన్ లో నిలిపివేసిన సిబ్బంది, ప్రయాణికులను దింపేశారు. ప్రయాణికులను మరో రైలులో గమ్యస్థానాలకు తరలించారు.  ఎల్బీ నగర్ వెళ్తున్న రైలు నిలిచిపోవడంతో వెనుక వస్తున్న రైళ్ల రాకపోకలకు ఆలస్యం అయింది. రైళ్లు ఆలస్యంగా నడవటం, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక సమస్య తలెత్తిన రైలును పాకెట్ ట్రాక్ పై నిలిపి సాంకేతిక సమస్యను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది.  

తరచూ సాంకేతిక సమస్యలు 

సోమవారం ఉదయం ఎర్రమంజిల్‌ స్టేషన్‌లో దాదాపు అరగంట పాటు మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కారిడార్‌-1 మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ రెడ్‌లైన్‌ మార్గంలో సోమవారం ఉదయం 9 గంటలకు మెట్రో రైలు మియాపూర్‌లో ప్రయాణికులతో బయలుదేరింది. 9.15 నిమిషాలకు పంజాగుట్ట స్టేషన్‌ దాటి ఎర్రమంజిల్‌ స్టేషన్ కు చేరింది. కొంత మంది ప్రయాణికులు స్టేషన్‌లో దిగిన తర్వాత లోకో పైలెట్‌ రైలును ముందుకు కదిలించేందుకు ప్రయత్నించినా టెక్నికల్ సమస్యతో రైలు కదలలేదు. దాదాపు అరగంటపాటు శ్రమించినా సిబ్బంది సాంకేతిక సమస్య అంతపట్టని పరిస్థితి నెలకొంది.  దీంతో ప్రయాణికులను రైలు నుంచి దించేశారు. బ్రేకింగ్‌ సిస్టమ్‌లో తలెత్తిన సమస్యతో రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. అధికారులు స్టేషన్‌లో ఆగిపోయిన రైలును వెంటనే ఎర్రమంజిల్‌-పంజాగుట్ట స్టేషన్ల మధ్య పాకెట్‌ ట్రాక్‌కు తరలించారు. అనంతరం మరో రైలులో ప్రయాణికులను పంపించారు.  వేగంగా ఆఫీసులు, ఇతర పనులపై మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్న ప్రయాణికులకు రైళ్ల సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి సహజంగా అధికంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళలో మరింత రద్దీగా ఉంటాయి. ఈ సమయాల్లోనే రైళ్లలో టెక్నికల్ ఇష్యూలు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో అధికారులు స్పందించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులకు కోరుతున్నారు.  
 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP DesamBird Flu in East Godavari Poultry | పెరవలి మండలంలో మృత్యువాత పడుతున్న వేలాది కోళ్లు | ABP DesamPawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP DesamEluru Collector Vetriselvi on Bird Flu | కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చిందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
30 Years PrudhviRaj: 'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
Telangana News: గేదెపై లోనుకు గేటు జప్తు- ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
గేదెపై లోనుకు గేటు జప్తు- ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
Viral news: తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.