అన్వేషించండి

Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం

Telangana News: తెలంగాణలో మరోసారి భూకంపం ఆందోళన కలిగించింది. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

Earthquake In Mahabubnagar: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో (Mahabubnagar) శనివారం మధ్యాహ్నం స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12:15 గంటలకు కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా కొద్ది సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతం, జూరాల ప్రాజెక్టుకు ఎగువ, దిగువ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కాగా, ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ఈ నెల 4న ఉదయం 7:27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

3 రోజుల క్రితం ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైనట్లు హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ - ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో భూకంప తీవ్రత కనిపించింది. భాగ్యనగర పరిధిలో వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాపై భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది. ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ములుగు నుంచి 50 కి.మీ ఈశాన్యం వైపు ఏటూరునాగరం భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5గా ఉందని అధికారులు తెలిపారు. భూకంపాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు మూడో జోన్ కిందకు వస్తాయని.. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పారు.

గడిచిన 50 ఏళ్లలో..

తెలంగాణలో గడిచిన 50 ఏళ్లలో ఈ నెల 4న వచ్చిందే అతిపెద్ద భూకంపం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌కు ౩౦౦ కిలోమీటర్ల దూరంలోని మహరాష్ట్ర లాతూరులో సమీపంలో ఆసాలో 6.2 మాగ్నిట్యూడ్‌తో 1993లో భారీ భూకంపం వచ్చింది.  అప్పట్లో 8 వేల మందికిపైగా చనిపోయారు. గడచిన ౩౦ ఏళ్లలో హైదరాబాద్ సమీపంలో ఇదే అతి పెద్ద భూకంపం. 1993 సెప్టెంబర్ 30న తెల్లవారుజామున 3:55 గంటలకు వచ్చిన భూకంపం చుట్టుపక్కల ప్రాంతాలను వణికించింది. ఇది గత 124 ఏళ్లలో హైదరాబాద్ సమీపంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపం. 2020 ఏప్రిల్‌ 24న ఆసిఫాబాద్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని తర్వాత మహారాష్ట్రకు చెందిన బాస్మత్‌లో  4.6 తీవ్రతతో 2024 మార్చిలో భూకంపం సంభవించింది. కాగా, భూ ప్రకంపనలపై తెలంగాణ విపత్త నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉంటే ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ అతి తక్కువ స్థాయి భూకంపాలు సంభవించే జోన్ 2లో ఉన్నట్లు పేర్కొన్నారు.

Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Babili water Release: బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Samsung A56: భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
Ind Vs NZ Odi Update:  స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
Embed widget