అన్వేషించండి

Telangana: ఒక్క DA ఇచ్చి దీపావళి కానుక అనడం దారుణమే, ఎన్నికల హామీలు నెరవేర్చండి: దేవిప్రసాద్

Telangana Employees | తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అది కూడా బీఆర్ఎస్ ఆమోదించిన డీఏ అని దేవి ప్రసాద్ మండిపడ్డారు.

Devi Prasad Demands for pending DAs to Govt Employees in Telangana | హైదరాబాద్: ఉద్యోగులకు కేవలం ఒక్క విడుత కరువు భత్యం (DA) విడుదల చేస్తామని చెప్పి దీపావళి కానుకగా చిత్రీకరించండం హాస్యాస్పదమని ఉద్యోగసంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ అన్నారు. రెండు జాక్ లతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 3 డీఏలు చెల్లిస్తారని ఉద్యోగులు భావించారు. కానీ తెలంగాణ కేబినెట్ కేవలం ఒక్క డీఏ విడుదల చేయడం ఉద్యోగులను అవమానించడమే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించి అనుమతి కోసం ఎన్నికల కమిషన్ (Election Commission)కు పంపించిన జూలై 22 నుండి రావలిసిన DA ను విడుదల చేసి ఉద్యోగులు సంతృప్తి చెందాలని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నిర్ణయం ఉద్యోగులపట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి ఏమిటో నిరూపించింది. 

పీఆర్సీ జాడ కనుచూపు మేరలో కూడా లేదు

ఎన్నికల మేనిఫెస్టో లో పెండింగ్ లో ఉన్న డీఏలు తక్షణం చెల్లిస్తామని చెప్పి 10 నెలల తర్వాత కేవలం ఒక్క డీఏ విడుదల చేయడం సరికాదని దేవి ప్రసాద్ అన్నారు. మిగత 4 డీఏలు ఎప్పడు చెల్లిస్తారు, 6 నెలల లోపు పీఆర్సీ అమలు చేస్తామని.. మరో ఆరు నెలలు పీఆర్సీ గడువు పొడగించారు. అంటే కనుచూపు మేరలో పీఆర్సీ జాడ కూడా లేదన్నారు. హెల్త్ కార్డ్స్, 317, సీపీఎస్, లాంటి సమస్యల పై సబ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. వివిధ సమస్యలపై ఇప్పటికే 20 సబ్ కమిటీలు ఏర్పాటు చేసినా ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదు. మార్చ్ 24 నుంచి దాదాపు 6 వేల మంది ఉద్యోగులు రిటైరయ్యారు. వారికి రావాల్సిన గ్రాట్యుటీ, ఎన్ క్యాషమెంట్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ చెల్లించకుండా వేధిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఉండే ఆర్థిక బాధల నుండి విముక్తి కలుగుతుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోందన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా, అంగన్వాడీ ఐకేపీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత ఇస్తామని ఎన్నికల హామీలిచ్చారు. 317 జీవో పై అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పుడు స్థానికతతో ముడిపడిన సమస్య అని దాటవేస్తున్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే ధర్నాలు చేయడం, నిరసనలు తెలపడం ప్రజాస్వామిక హక్కు అని ఇటీవల జాక్ తో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఉద్యోగులు పనిభారం తగ్గింపు, అవసరమైన సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని అడిగినందుకు జాక్ తో చర్చల సమయంలోనే 166 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం నోటితో పొగిడి నొసటితో వెక్కిరించమే అన్నారు. 

Also Read: Telangana Cabinet Decisions: పేదలకు శుభవార్త, దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు - ఉద్యోగులకు డీఏ: మంత్రి పొంగులేటి

ఉద్యోగులను సస్పెండ్ చేయంపై ఆగ్రహం

స్పెషల్ పోలీస్ ఉద్యోగుల కుటుంబాలు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు 39 మందిని సిస్పెండ్ చేసి ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రేమను చూపిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి. సస్పెండ్ అయిన ఉద్యోగులను తిరిగి విధులలో తీసుకోవాలి. ఆదాయం పెరిగిందంటారు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా ఉద్యోగులను మోసం చేసే కుట్ర అని ఉద్యోగసంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ పేర్కొన్నారు.
Also Read: Drugs Party: రాజ్ పాకాల జన్వాడ ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ, టెస్టులు చేపించగా పాజిటివ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Most Cheapest Diesel SUVs: దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
Embed widget