అన్వేషించండి

Telangana: ఒక్క DA ఇచ్చి దీపావళి కానుక అనడం దారుణమే, ఎన్నికల హామీలు నెరవేర్చండి: దేవిప్రసాద్

Telangana Employees | తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అది కూడా బీఆర్ఎస్ ఆమోదించిన డీఏ అని దేవి ప్రసాద్ మండిపడ్డారు.

Devi Prasad Demands for pending DAs to Govt Employees in Telangana | హైదరాబాద్: ఉద్యోగులకు కేవలం ఒక్క విడుత కరువు భత్యం (DA) విడుదల చేస్తామని చెప్పి దీపావళి కానుకగా చిత్రీకరించండం హాస్యాస్పదమని ఉద్యోగసంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ అన్నారు. రెండు జాక్ లతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 3 డీఏలు చెల్లిస్తారని ఉద్యోగులు భావించారు. కానీ తెలంగాణ కేబినెట్ కేవలం ఒక్క డీఏ విడుదల చేయడం ఉద్యోగులను అవమానించడమే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించి అనుమతి కోసం ఎన్నికల కమిషన్ (Election Commission)కు పంపించిన జూలై 22 నుండి రావలిసిన DA ను విడుదల చేసి ఉద్యోగులు సంతృప్తి చెందాలని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నిర్ణయం ఉద్యోగులపట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి ఏమిటో నిరూపించింది. 

పీఆర్సీ జాడ కనుచూపు మేరలో కూడా లేదు

ఎన్నికల మేనిఫెస్టో లో పెండింగ్ లో ఉన్న డీఏలు తక్షణం చెల్లిస్తామని చెప్పి 10 నెలల తర్వాత కేవలం ఒక్క డీఏ విడుదల చేయడం సరికాదని దేవి ప్రసాద్ అన్నారు. మిగత 4 డీఏలు ఎప్పడు చెల్లిస్తారు, 6 నెలల లోపు పీఆర్సీ అమలు చేస్తామని.. మరో ఆరు నెలలు పీఆర్సీ గడువు పొడగించారు. అంటే కనుచూపు మేరలో పీఆర్సీ జాడ కూడా లేదన్నారు. హెల్త్ కార్డ్స్, 317, సీపీఎస్, లాంటి సమస్యల పై సబ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. వివిధ సమస్యలపై ఇప్పటికే 20 సబ్ కమిటీలు ఏర్పాటు చేసినా ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదు. మార్చ్ 24 నుంచి దాదాపు 6 వేల మంది ఉద్యోగులు రిటైరయ్యారు. వారికి రావాల్సిన గ్రాట్యుటీ, ఎన్ క్యాషమెంట్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ చెల్లించకుండా వేధిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఉండే ఆర్థిక బాధల నుండి విముక్తి కలుగుతుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోందన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా, అంగన్వాడీ ఐకేపీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత ఇస్తామని ఎన్నికల హామీలిచ్చారు. 317 జీవో పై అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పుడు స్థానికతతో ముడిపడిన సమస్య అని దాటవేస్తున్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే ధర్నాలు చేయడం, నిరసనలు తెలపడం ప్రజాస్వామిక హక్కు అని ఇటీవల జాక్ తో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఉద్యోగులు పనిభారం తగ్గింపు, అవసరమైన సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని అడిగినందుకు జాక్ తో చర్చల సమయంలోనే 166 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం నోటితో పొగిడి నొసటితో వెక్కిరించమే అన్నారు. 

Also Read: Telangana Cabinet Decisions: పేదలకు శుభవార్త, దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు - ఉద్యోగులకు డీఏ: మంత్రి పొంగులేటి

ఉద్యోగులను సస్పెండ్ చేయంపై ఆగ్రహం

స్పెషల్ పోలీస్ ఉద్యోగుల కుటుంబాలు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు 39 మందిని సిస్పెండ్ చేసి ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రేమను చూపిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి. సస్పెండ్ అయిన ఉద్యోగులను తిరిగి విధులలో తీసుకోవాలి. ఆదాయం పెరిగిందంటారు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా ఉద్యోగులను మోసం చేసే కుట్ర అని ఉద్యోగసంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ పేర్కొన్నారు.
Also Read: Drugs Party: రాజ్ పాకాల జన్వాడ ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ, టెస్టులు చేపించగా పాజిటివ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
Breaking News: బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget