అన్వేషించండి

Telangana: తెలంగాణలో పెరిగిన విద్యుత్ వినియోగం, కోట్లు పెట్టి కొంటున్నా కొరతే

Telangana : ఎండ వేడితో తెలంగాణ వ్యాప్తంగా పెరిగిన విద్యుత్ వినియోగం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం వానలు సరిగా పడలేదు. చూస్తుండగానే  వానాకాలం ముగిసిపోయింది. త్వరలో చలికాలం మొదలవుతోంది. అయినా సరే ఎండలు మండిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అసాధారణంగా   విద్యుత్ వినియోగం పెరిగిపోయింది.  నిరంతర విద్యుత్  సరఫరాకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు నా నా ఇబ్బందులు పడుతున్నాయి. ఈమేరకు తెలంగాణ ట్రాన్స్కో, ఎన్టిపిసి కి  అదనపు విద్యుత్ కావాలంటూ విన్నవించుకుంది. తెలంగాణ ఇప్పటికే  భారత ఇంధన ఎక్స్చేంజి నుంచి ఏడు కోట్లకు పైగా యూనిట్లు అందుకుంటున్న  ఫలితం లేకుండా పోవటంతో తమకు అదనంగా మరి కొంత సరఫరా చేయాలని తెలంగాణ ట్రాన్స్కో తాజాగా ఎన్టిపిసి ని కోరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎక్కడ కరెంటు నిల్వలు మిగిలి ఉంటే అది తెలంగాణకే ఇవ్వాలని అడిగింది.

నిజానికి తెలంగాణాలో  కొద్దిరోజుల పాటు కుండపోత వర్షాలు కురవగా తరువాత  ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఎండ మొదలవుతుండటంతో వాతావరణం వేడెక్కుతోంది. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండ వేడి పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ దెబ్బకి విద్యుత్ వినియోగం కూడా ఎక్కువ అయ్యింది.  రాబోయే ఐదు రోజులు కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో ఉండే మాదిరిగా ప్రస్తుతం వాతావరణం ఉంటుందని చెప్పింది.

సాగర్‌ ఆయకట్టుతో పాటు తెలంగాణ లో అనేక చోట్ల రైతులు లోఓల్టేజీ సమస్యతో సతమతమవుతున్నారు. అంతేకాదు కనీసం  10 గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయకట్టులో బోరు బావుల కింద వేసిన పంటలకు ఈ సమయంలోనే అధికంగా పంట పొలాలకు నీటి అవసరం ఏర్పడుతుందాని చెబుతున్నారు. ఈ సమయంలో  విద్యుత్‌ సరఫరా సక్రమంగా చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.   

దేశవ్యాప్త డిమాండు పెరగడంతో ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం ఒక్కో యూనిటు సగటున రూ.7కుపైగా చెల్లించి  కొనుగోలు చేయాల్సిరావడంతో డిస్కంలు కూడా తీవ్ర  ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మొన్న ఆగస్టులో రూ.1,100 కోట్లు, తరువాత సెప్టెంబరులో రూ.650 కోట్లు వెచ్చించి  అదనంగా విద్యుత్కొ నుగోలు చేసిన డిస్కంలు ఈ నెలలో మరోసారి  కొనాల్సి రావడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పూర్తిగా ,  ఎస్టీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తోంది. ఇవే కాకుండా ఎత్తిపోతల పథకాల సరఫరా కలిపి రాయితీల పద్దు కింద నెలకు రూ. 958 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు బడ్జెట్ నుంచి అందజేస్తోంది. ఇక ఈ ఏడాది బారీగా పెరిగిన వినియోగం కారణంగా నెలకు కనీసం మరో రూ. వెయ్యి కోట్లయినా ఇస్తే తప్ప నిరంతర సరఫరా సాధ్యం కాదు అని డిస్కంల వర్గాలు చెబుతున్నాయి. పోనీ అధిక ధరలకు కొనేందుకు సిద్ధమయినా ఎక్స్ఛేంజీలో దొరకని పరిస్థితి ఉందని పేర్కొంటున్నాయి.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget