అన్వేషించండి

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత- బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Delhi Excise Policy: ఢిల్లీ మద్యం విధానంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీ తయారీ భేటీల్లో వాళ్లు కూడా పాల్గొన్నారని అన్నారు.

Delhi Excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. దిల్లీ ప్రభుత్వంలో కీ రోల్‌ పోషించే మనీష్‌ సిసోడియా ఇంట్లో సోదాలు కూడా జరిపింది. ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లోను షేక్ చేస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నేతలు ఇందులో భాగమై ఉన్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. 

ఢిల్లీ మద్య పాలసీ రూపకల్పన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ నేతలు పర్వేశ్ సాహిబ్ సింగ్, మంజీందర్‌ సింగ్‌ సిర్సా బాంబు పేల్చారు. కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తూ సిర్సా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో అమలువుతున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన డీల్ ను సెట్ చేసింది కల్వకుంట్ల కవిత అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్స్ వేదికగా డీల్ జరిగిందన్నారు. తెలంగాణ కేసీఆర్ తరపున ఎమ్మెల్సీ కవిత.. లిక్కర్ మాఫియాకు, ఢిల్లీ గవర్నమెంట్ కు మధ్య డీల్ కుదిర్చారని తెలిపారు. ఇందుకోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల ముడుపులు కూడా అందాయంటూ పొలిటికల్ హీట్ రాజేశారు మాంజీందర్ సింగ్ సిర్సా.

ఒబెరాయ్ హోటల్‌లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెళ్ల కోసం బుక్ చేశాడని ఆరోపించారు సిర్సా. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ హైదరాబాద్‌ మధ్య తిరిగేవారన్నారు. ఈ ఫ్లైట్‌ను తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిందంటూ వివరించారు

ఒబెరాయ్ హోటల్ నుంచే లిక్కర్ పాలసీలో అవినీతి..

ఒబెరాయ్ హోటల్ లో కవిత మీటింగ్ నిర్వహించి చద్దా పరివార్ నుంచి డబ్బులు తీసుకుని పంజాబ్‌లో మద్యం ఫ్యాక్టరీని తిరిగి తెరిపించారని బీజేపీ నేత సిర్సా ప్రధాన ఆరోపణ. లిక్కర్ పాలసీలో అవినీతి ఒబెరాయ్ హోటల్ నుంచి ప్రారంభం అయిందని అన్నారు. మూడు కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ఇచ్చారని విమర్శించారు. కోటిన్నర రూపాయలు క్రెడిట్ రూపంలో అందించే ప్రయత్నం చేశారని మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపణలు చేశారు. 2 శాతం ఉన్న కమిషన్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 12 శాతానికి పెంచారని మరో బాంబు పేల్చారు. 

లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ఎన్1 లైసెన్స్ హోల్డర్స్ వ్యక్తుల ద్వారా కుదిరిని డీల్ లో భాగంగా ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు రూ. 150 కోట్లు ముట్టాయని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ ఆరోపణలు చేశారు. ఈ డబ్బులను తెలంగాణ లిక్కర మాఫియానే ఇచ్చిందన్నారు. దీనికి బదులుగా ముందుగా ఎన్ 1 కమిషన్, లాభాలు తీసుకునేలా డీల్ కుదిరిందని పర్వేస్ అన్నారు. గోవా. పంజాబ్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆమ్‌ఆద్మీ పార్టీకి లిక్కర్ మాఫియా అడ్వాన్స్ చెల్లింపులు చేసిందని ఆరోపించారు. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో, ఢిల్లీలోనూ నూతన ఎక్సైజ్ పాలసీ అమలు మొదలు అయిందని ఆరోపించారు. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తరహా మద్యం విధానాన్ని అక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులు అమలు చేయించారని అన్నారు. లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ అయిన విషయం నిజమా కాదా సిసోడియా చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget