అన్వేషించండి

Vemula Veeresam: 'బీఆర్ఎస్ తప్పులన్నీ బయటపెడతా' - రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం

Telangana Assembly: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులన్నీ తనకు తెలుసని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Congress Mla Vemula Veeresam Comments in Assembly: గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలను తీసేసిందని.. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందని నకిరేకల్ (Nakirekal) ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresam) మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆయన అసెంబ్లీలో ప్రతిపాదించగా.. దీన్ని మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennem Srinivas Reddy) బలపరిచారు. ఈ సందర్భంగా వేముల వీరేశం బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతాం. బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ నాకు తెలుసు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని చూసి బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు.?' అని ఆయన నిలదీశారు.

'అహంకారం వీడండి'

బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా అహంకారం వీడాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన సాగిందని మండిపడ్డారు. 'దళిత బంధు పేరుతో ప్రజలను మభ్యపెట్టారు. నన్ను అవమానించిన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చాను. మీ పాలనలో ప్రజలకు దూరమైన ప్రగతి భవన్ ను.. మా ప్రభుత్వం వచ్చాక గోడలు బద్దలు కొట్టి అందుబాటులోకి తెచ్చాం. ప్రజా సమస్యలు నేరుగా విని పరిష్కరించేలా చర్యలు చేపట్టాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పాలమూరు ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాత ప్రభుత్వమిది. గత ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసింది. ఆత్మ గౌరవం, స్వేచ్ఛ కావాలంటూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు.' అని వేముల పేర్కొన్నారు.

'త్వరలోనే 2 గ్యారెంటీలు'

రాష్ట్రంలో ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశామని.. త్వరలోనే మరో 2 గ్యారెంటీలను అమలు చేసేలా చర్యలు చేపట్టామని వేముల వీరేశం వివరించారు. 'పదేళ్ల అవినీతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అనేక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. సాగునీటి రంగంలో దక్షిణ తెలంగాణపై వివక్ష చూపించారు. నల్గొండ జిల్లాలో పదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. గ్రామాల్లోనూ బోర్లు వేసుకునే పరిస్థితి లేకుండా చేశారు.' అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కారులంటే బీఆర్ఎస్ కు కనీసం గౌరవం లేదని ధ్వజమెత్తారు. ప్రజా గాయకుడు గద్దర్ ను ఘోరంగా అవమానించారని.. గురుకుల పాఠశాలలకు ఎక్కడా సొంత భవనాలు లేవని అన్నారు. ఉద్యోగ నియామకాల్లోనూ ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని.. పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ వర్శిటీలను ధ్వంసం చేసి.. ప్రైవేట్ వర్శిటీలకు అడ్డగోలు అనుమతులను మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కొన్ని నెలల్లోనే పడగొడతామంటూ బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు, తమ మేనిఫెస్టోలో మొత్తం 250 అంశాలు ఉంటే.. బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో అన్నీ మోసపూరిత హామీలే ఉన్నాయని యెన్నెం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

Also Read: Telangana Assembly: ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అడ్డుకున్న పోలీసులు, అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Breaking News: సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget