News
News
వీడియోలు ఆటలు
X

 CM KCR: త్వరలోనే దళితబంధు నిధుల విడుదల.. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం

దళితబంధు పథకం అమలుపైనా రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా... ఆర్థికంగా అభివృద్ధి చేయడమే పథకం లక్ష్యమన్నారు. 

FOLLOW US: 
Share:

దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. పది లక్షల రూపాయలు.. దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహద పడుతుందన్నారు. ప్రకటించిన పద్ధతిలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని.. దానికి సంబంధించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని కేసీఆర్ చెప్పారు.

డిసెంబర్ 28 నుంచి రైతు బంధు

డిసెంబర్ 28 నుంచి.. రైతు బంధు పంపిణీ జరగనుందని.. సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు పది రోజుల్లోనే.. అందరి ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. గతంలో మాదిరిగానే ఎకరం నుంచి మొదలుకుని అందరికీ నగదు జమచేయనున్నారు. యాసంగి సీజన్ పంటల సాగు వేళ రైతు బంధు నగదును పంపిణీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ కానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికూ పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రైతులకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున కోటిన్నర ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. తెలంగాణ రైతులకు పంట సాయం కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకానికి  రూ. 7500 కోట్ల నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబర్ 28 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మెుదట ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలో రైతు బంధు కింద రూ.5 వేలు జమ అవుతాయి. ఆ తర్వాత రెండు ఎకరాలు ఉన్న వారికి, అనంతరం మూడు ఎకరాలు, ఆ తరువాత 5, 10, 15, 20 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్న తెలంగాణ రైతులకు రైతు బంధు నిధులను ఆర్థికశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. గతంలోనూ ఇదే విధంగా రైతు బంధు నగదు విడుదల చేశారు.

వానాకాలం సీజన్‌కు సంబంధించి దాదాపు 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు లభించింది. అంటే దాదాపు రూ.7,360.41 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ చేసింది. తాజాగా మరికొంత మంది అర్హులైన రైతులకు రైతు బంధు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటుండగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూడక తప్పడం లేదు.

Also Read: Cm Kcr: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన

Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!

Also Read: Monkeys Survey: గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి? ఏఈఓలకు లెక్కింపు బాధ్యత

Published at : 18 Dec 2021 08:00 PM (IST) Tags: cm kcr Rythu Bandhu Telangana Farmers Rythu Bandhu Release Date Rythu Bandhu Funds CM KCR On Rythu Bandhu

సంబంధిత కథనాలు

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

2BHK Housing Scheme: మంత్రి హరీష్ రావు నోట - ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు సామెత, అంత కష్టమా!

2BHK Housing Scheme: మంత్రి హరీష్ రావు నోట - ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు సామెత, అంత కష్టమా!

Drone Show Durgam Cheruvu: దుర్గం చెరువుపై ఆకట్టుకున్న డ్రోన్ షో, దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహణ

Drone Show Durgam Cheruvu: దుర్గం చెరువుపై ఆకట్టుకున్న డ్రోన్ షో, దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహణ

టాప్ స్టోరీస్

కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స  తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌

Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్

Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్

Nothing Phone 2: కొత్త ఫోన్‌తో రానున్న నథింగ్ - ఈసారి మరిన్ని స్పెషల్ ఫీచర్లు!

Nothing Phone 2: కొత్త ఫోన్‌తో రానున్న నథింగ్ - ఈసారి మరిన్ని స్పెషల్ ఫీచర్లు!