అన్వేషించండి

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త, 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన

Singareni Employees: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. సంస్థకు ఈ ఆర్థిక ఏడాది వచ్చిన సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 

Singareni Employees: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సింగరేణి కార్మికులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సింగరేణి ఉద్యోగులు తెగ సంబరపడిపోతున్నారు. మొన్నటికి మైన్న 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో వేసిన యాజమాన్యం.. తాజాగా 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు తెలుసుకుని సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా.. ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. సింగరేణి ఉద్యోగులకు 32 శాతం బోనస్ ప్రకటించడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుల పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి‌ నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందంటూ చెప్పుకొచ్చారు. 

ఇటీవలే 11వ వేజ్ బోర్డు బకాయిలు అందజేత

ఇటీవలే సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం జమ చేసింది. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్‌ సీనియారిటీని బట్టి నగదు జమ అయింది. ఒక్కో కార్మికుడికి ఏరియర్స్‌ రూపంలో దాదాపు రూ.3.70 లక్షల వరకు క్రెడిట్‌ అయ్యింది. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు రావడంతో... కార్మికులు  సంతోషానికి అవదులు లేవు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. సింగరేణి చరిత్రలో ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం ఇదే మొదటిసారి అని చెప్పా percent రు సంస్థ ఫైనాన్స్‌, పర్సనల్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌. ముందు  రెండసార్లుగా ఎరియర్స్‌ చెల్లించాలని భావించామన్నారు. అయితే.. సంస్థ సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించాలని ఆదేశించారని చెప్పారు. అందుకే ఒకే  విడతలో మొత్తం డబ్బు కార్మికుల అకౌంట్లలో క్రెడిట్‌ చేశామన్నారు. అంతేకాదు... అనుకున్న సమయం కన్నా ముందే... 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను  విడుదల చేశామన్నారు. కోల్‌ ఇండియాకన్నా ముందే 11వ వేజ్‌బోర్డు సిఫారసులను సింగరేణి సంస్థ అమలు చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. డీబీటీ విధానంలో  39వేల మంది కార్మికుల ఖాతాల్లో రూ.1450 కోట్లను జమచేశామన్నారు సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌ బలరామ్‌. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, CMPFలో జమచేయాల్సిన సొమ్మును  మినహాయించి... మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 

11వ వేజ్‌బోర్డు బకాయిల చెల్లింపేకాదు... సింగరేణి కార్మికులకు మరో గుడ్‌ కూడా చెప్పింది యాజమాన్యం. దసరా పండుగకు ముందే లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్‌  చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను దసరా కన్నా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు  జరుగుతున్నాయన్నారు సింగరేణి డైరెక్టర్‌ బలరామ్‌. దీపావళి బోనస్‌ పీఎల్‌ఆర్‌ను కూడా ముందే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పెద్ద మొత్తంలో ఇచ్చిన ఈ  ఎరియర్స్ సొమ్మును కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని... కుటుంబ భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi: మీ చర్మ సౌందర్యం, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఏంటీ సార్‌? పీఎంను ప్రశ్నించిన క్రికెటర్స్‌; కీలక సూచనలు చేసిన మోదీ!
మీ చర్మ సౌందర్యం, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఏంటీ సార్‌? పీఎంను ప్రశ్నించిన క్రికెటర్స్‌; కీలక సూచనలు చేసిన మోదీ!
Telangana Crime News: చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్
చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ గిరిజన గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు- పవన్‌కు ధన్యవాదాలు చెప్పిన అడవి బిడ్డలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఆ గిరిజన గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు- పవన్‌కు ధన్యవాదాలు చెప్పిన అడవి బిడ్డలు
Advertisement

వీడియోలు

వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: మీ చర్మ సౌందర్యం, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఏంటీ సార్‌? పీఎంను ప్రశ్నించిన క్రికెటర్స్‌; కీలక సూచనలు చేసిన మోదీ!
మీ చర్మ సౌందర్యం, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఏంటీ సార్‌? పీఎంను ప్రశ్నించిన క్రికెటర్స్‌; కీలక సూచనలు చేసిన మోదీ!
Telangana Crime News: చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్
చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ గిరిజన గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు- పవన్‌కు ధన్యవాదాలు చెప్పిన అడవి బిడ్డలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఆ గిరిజన గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు- పవన్‌కు ధన్యవాదాలు చెప్పిన అడవి బిడ్డలు
Allu Arjun : అట్లీ మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ - అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు... రాజమౌళితో కూడా!
అట్లీ మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ - అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు... రాజమౌళితో కూడా!
Rashmika Mandanna : మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే... - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే... - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
PM Modi Met With Women World Cup Champions: ప్రధాన మంత్రి మోదీని కలిసిన మహిళా ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు, జెర్సీలను బహుమతిగా ఇచ్చిన హర్మన్ ప్రీత్-మంధానా
ప్రధాన మంత్రి మోదీని కలిసిన మహిళా ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు, జెర్సీలను బహుమతిగా ఇచ్చిన హర్మన్ ప్రీత్-మంధానా
Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
Embed widget