అన్వేషించండి

Telangana Elections 2023: బీఆర్ఎస్ వ్యూహం - నిన్న నాగం, నేడు విష్ణువర్థన్ రెడ్డి, అసంతృప్తులే టార్గెట్ గా దూకుడు పెంచిన గులాబీ పార్టీ

Telangana Elections 2023: కాంగ్రెస్ అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొగ్గు చూపుతోంది. ఇప్పటికే పొన్నాల బీఆర్ఎస్ లో చేరగా నాగం, విష్ణువర్దన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో దూసుకెళ్తోంది. ఓ వైపు ముమ్మరంగా ప్రచారం చేస్తూనే, మరో వైపు ఇతర పార్టీల అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకునే దానిపై దృష్టి పెట్టారు. తద్వారా ఆ నేతల బ్యాక్ గ్రౌండ్, వారి రాజకీయ అనుభవం, ఆయా నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు తమకు ఎన్నికల్లో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ సహా ఇతర నేతలంతా ప్రచారంలో నిమగ్నమైనప్పటికీ, అసంతృప్తులపై దృష్టి సారిస్తూ వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. 

తాజాగా, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డితో సోమవారం మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆదివారం విష్ణువర్థన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. 

బీఆర్ఎస్ లోకి విష్ణువర్థన్ రెడ్డి?

ఈ క్రమంలో విష్ణువర్థన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండరని, కార్మికులకు, ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని హరీష్ రావు కొనియాడారు. అలాంటి నేత వారసుడికి నేడు కాంగ్రెస్ పార్టీ ఎనలేని అన్యాయం చేసిందని విమర్శించారు. పార్టీలో శ్రమించిన వారికి గుర్తింపు లేకపోవడం వల్లే సీనియర్ నేతలు అసంతృప్తికి గురవతున్నట్లు చెప్పారు. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించారని, త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకొంటారని పేర్కొన్నారు. నాగం జనార్థన్ రెడ్డి, విష్ణులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. 

ఈ పరిస్థితి ఊహించలేదు

కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. కొద్ది రోజులైతే గాంధీ భవన్ నే అమ్మేసే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ లో కేడర్ బాగానే ఉన్నా, నేతలే అమ్ముడు పోతున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మొన్న పొన్నాల, నిన్న నాగం

కాగా, కాంగ్రెస్ నుంచి జనగాం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తనను అవమానించారని, బీసీ నేతలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన్ను మంత్రి కేటీఆర్ కలిసి బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను పొన్నాల దంపతులు కలిసి చర్చించిన అనంతరం జనగామ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. 

పొన్నాల బాటలోనే నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి రాకపోవడంతో సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా వచ్చిన వారికే పార్టీ టికెట్ ఇస్తుందని, కష్టపడి పని చేసిన వారికి మొండిచేయి చూపించిందని నాగం మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ నాగంతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో నాగం జనార్థన్ రెడ్డి త్వరలోనే గులాబీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.

Also Read: తెలంగాణలో అభివృద్ధిపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Construction: ఆదిలాబాద్‌కు మహర్దశ - త్వరలో ఎయిర్‌పోర్ట్, రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక ప్రకటన
ఆదిలాబాద్‌కు మహర్దశ - త్వరలో ఎయిర్‌పోర్ట్, రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక ప్రకటన
ACB Raids: మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
Breaking News: క్వారీల్లో 33 శాతం వాటా వడ్డెరలకు కేటాయింపు: మంత్రి నారా లోకేష్
క్వారీల్లో 33 శాతం వాటా వడ్డెరలకు కేటాయింపు: మంత్రి నారా లోకేష్
CM Revanth Reddy Delhi Tour: హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఫేజ్-2 విస్త‌ర‌ణ‌పై కేంద్రంతో రేవంత్ రెడ్డి చర్చలు సఫలం
హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఫేజ్-2 విస్త‌ర‌ణ‌పై కేంద్రంతో రేవంత్ రెడ్డి చర్చలు సఫలం

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
TMC Leader Humiliated: సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
Vijay Trisha Breakup: విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
Ather 450X vs Honda Activa e:ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
Vaddera Quarry Reservation: ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
Sreemukhi Saree Photos: శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే
అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే
Embed widget