అన్వేషించండి

Telangana Elections 2023: బీఆర్ఎస్ వ్యూహం - నిన్న నాగం, నేడు విష్ణువర్థన్ రెడ్డి, అసంతృప్తులే టార్గెట్ గా దూకుడు పెంచిన గులాబీ పార్టీ

Telangana Elections 2023: కాంగ్రెస్ అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొగ్గు చూపుతోంది. ఇప్పటికే పొన్నాల బీఆర్ఎస్ లో చేరగా నాగం, విష్ణువర్దన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో దూసుకెళ్తోంది. ఓ వైపు ముమ్మరంగా ప్రచారం చేస్తూనే, మరో వైపు ఇతర పార్టీల అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకునే దానిపై దృష్టి పెట్టారు. తద్వారా ఆ నేతల బ్యాక్ గ్రౌండ్, వారి రాజకీయ అనుభవం, ఆయా నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు తమకు ఎన్నికల్లో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ సహా ఇతర నేతలంతా ప్రచారంలో నిమగ్నమైనప్పటికీ, అసంతృప్తులపై దృష్టి సారిస్తూ వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. 

తాజాగా, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డితో సోమవారం మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆదివారం విష్ణువర్థన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. 

బీఆర్ఎస్ లోకి విష్ణువర్థన్ రెడ్డి?

ఈ క్రమంలో విష్ణువర్థన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండరని, కార్మికులకు, ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని హరీష్ రావు కొనియాడారు. అలాంటి నేత వారసుడికి నేడు కాంగ్రెస్ పార్టీ ఎనలేని అన్యాయం చేసిందని విమర్శించారు. పార్టీలో శ్రమించిన వారికి గుర్తింపు లేకపోవడం వల్లే సీనియర్ నేతలు అసంతృప్తికి గురవతున్నట్లు చెప్పారు. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించారని, త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకొంటారని పేర్కొన్నారు. నాగం జనార్థన్ రెడ్డి, విష్ణులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. 

ఈ పరిస్థితి ఊహించలేదు

కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. కొద్ది రోజులైతే గాంధీ భవన్ నే అమ్మేసే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ లో కేడర్ బాగానే ఉన్నా, నేతలే అమ్ముడు పోతున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మొన్న పొన్నాల, నిన్న నాగం

కాగా, కాంగ్రెస్ నుంచి జనగాం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తనను అవమానించారని, బీసీ నేతలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన్ను మంత్రి కేటీఆర్ కలిసి బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను పొన్నాల దంపతులు కలిసి చర్చించిన అనంతరం జనగామ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. 

పొన్నాల బాటలోనే నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి రాకపోవడంతో సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా వచ్చిన వారికే పార్టీ టికెట్ ఇస్తుందని, కష్టపడి పని చేసిన వారికి మొండిచేయి చూపించిందని నాగం మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ నాగంతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో నాగం జనార్థన్ రెడ్డి త్వరలోనే గులాబీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.

Also Read: తెలంగాణలో అభివృద్ధిపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Embed widget