అన్వేషించండి

Bandi Sanjay: 'ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తి కాదు' - అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటామన్న బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ ఆస్తులు జప్తు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీలను చిన్న చూపు చూస్తున్నాయని, జనాభాలో అధిక శాతం ఉన్న వర్గాన్ని అణచి వేయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల ఆ పార్టీల వైఖరి మార్చుకోవాలని, వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహిస్తోందని, ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా తమ పార్టీకి మద్దతిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 50 శాతం బీసీలకు టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

'ఒకరిద్దరు చెప్తే సీఎం కాను'

బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్టానం కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారు. ఎవరో ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తి కానని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ సిద్ధాంతం కోసం పని చేసే చిత్తశుద్ధి గల కార్యకర్తనని అన్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై స్పందించిన ఆయన, సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఎందుకు ఇప్పటివరకూ స్పందించ లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ల కుంగుబాటుపై, జాతీయ డ్యాం సేఫ్టీ బృందం నివేదికను తప్పని ఎలా అంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ కు సవాల్

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. మేడిగడ్డ కుంగుబాటుపై వాస్తవ నివేదిక ఇచ్చిన కేంద్ర బృందంపై అవాకులు చవాకులు పేలుతున్న కేటీఆర్, తన తండ్రి కేసీఆర్ ను తీసుకొస్తే వాస్తవాలు నిరూపిస్తామని అన్నారు. 'డేట్, టైం ఫిక్స్ చెయ్. ఇరిగేషన్ నిపుణులతో కలిసి మేడిగడ్డకు వస్తా. మీ అయ్యను తీసుకురా. మేం వాస్తవాన్ని నిరూపిస్తాం. ప్రజలకు వాస్తవాలు బయటపెడదాం. మీ అయ్యను తీసుకొచ్చే దమ్ముందా.?' అంటూ సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం కోసం పెట్టిన లక్షా 30 వేల కోట్లను కేసీఆర్ కుటుంబం నుంచి వసూలు చేస్తాం. కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ జప్తు చేస్తాం. అని స్పష్టం చేశారు.

'రేవంత్ సీఎం కాలేరు'

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం కానీయొద్దని ముస్లిం పెద్దలంతా కలిసి రాహుల్ గాంధీని కలిశారని, అందుకు ఆయన సైతం అంగీకరించినట్లు తనకు సమాచారం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆ వెంటనే బీసీని సీఎంగా చేస్తామని జాతీయ నాయకత్వం ప్రకటించిందని, బీజేపీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతూ ప్రజలు స్వాగతం పలుకుతున్నారన్నారు.

'ప్రధాని సభను విజయవంతం చేయాలి'

ఈ నెల 7న జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీ హాజరవుతారని, అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపిన ఆయన, తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

Also Read: మేడిగడ్డ వద్ద భయంకరంగా పరిస్థితి, పిల్లర్లకు పగుళ్లు కూడా - కిషన్ రెడ్డి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget