అన్వేషించండి

Kishan Reddy: మేడిగడ్డ వద్ద భయంకరంగా పరిస్థితి, పిల్లర్లకు పగుళ్లు కూడా - కిషన్ రెడ్డి

తెలంగాణలో ఒకే కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోందని కిషన్ రెడ్డి విమర్శించారు.

మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. తాను మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి చూసొచ్చానని, అది కుంగిపోవడమే కాకుండా పిల్లర్లకు కూడా పగుళ్లు వచ్చాయని అన్నారు. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని తెలిపారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని, రూ.1.3 లక్షల కోట్లకు పెంచారని, అయినా కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకా పూర్తి చెయ్యలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పిందే నిజమైందని అన్నారు. తానే సూపర్ ఇంజినీర్ అని సీఎం కేసీఅర్ భావిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం (నవంబరు 5) కిషన్ రెడ్డి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. 

తెలంగాణలో ఒకే కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో అస్సలు లేవని, పదేళ్లుగా ఒక్క టీచర్ పోస్టుని కూడా భర్తీ చేయలేదని అన్నారు. గ్రూప్ - 1 రద్దు కావడం వల్ల 30 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. హామీలు ఇవ్వడం, అమలు చేయకపోవడం, మోసం చేయడం లాంటివి సీఎం కేసీఆర్‌కి మొదటి నుంచి అలావాటేనని కిషన్ రెడ్డి అన్నారు. దళితుడిని  సీఎం చేస్తానన్న కేసీఆర్ చెయ్యలేదని మరోసారి విమర్శించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని అన్నారు. 

కొత్త సెక్రటేరియట్ కు ఎందుకు రారు
వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పి పాత సెక్రటేరియట్‌ను కూల్చేశారని, మరి కొత్తగా కట్టిన సెక్రటేరియట్‌కి సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలుద్దామంటే, మంత్రులకు కూడా వీలు పడడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్య ఆందోళనలను సీఎం కేసీఆర్ అణచి వేయిస్తున్నారని అన్నారు. నియంతృత్వ, రాచరిక, దుర్మార్గపు ఆలోచనలతో బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై తెలంగాణ యువత ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు అమ్ముడు పోయారని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి అసలు సంబంధమే లేదని.. ఎంఐఎంతో అంటకాగే పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్లు కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను వసూల్ చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్నాటక నుండి తెలంగాణకు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయన్నారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

వేగం పెంచిన బీజేపీ
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే అగ్రనేతలతో ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసిన బీజేపీ.. మరో దఫా ప్రచారానికి ప్లాన్‌ చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రప్పించనున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో జరిగే సభలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బీజేపీ, జనసేనతో పోత్తు పెట్టుకుని వారికి 9 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే అమిత్‌ షా తెలంగాణలో కొన్ని సభల్లో పాల్గొన్నారు. ముందు ముందు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ ముఖ్య నాయకులను తెలంగాణకు రప్పించనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Embed widget