అన్వేషించండి

Ask KTR : కేటీఆర్‌ను ప్రశ్నిస్తే ? ఇవిగో సమాధానాలు

ఆస్క్ కేటీఆర్‌లో భాగంగా రెండు గంటల పాటు నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. అన్ని అంశాలూ కవరయ్యేలా నెటిజన్లు ప్రశ్నించారు. కేటీఆర్ ఆసక్తికర సమాధానాలిచ్చారు.

 

Ask KTR :    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్  ట్విట్టర్‌లో నెటిజన్లతో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జాతీయ రాజకీయాల దగ్గర్నుంచి ఏపీలో పోటీ వరకూ అనేక మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

ఉచిత హామీలు కాదు .. పెద్దల రుణాలపై దృష్టి పెట్టాలి !

పేదలకు అందించే ఉచిత పథకాల విషయంలో సరైన దృక్పథం, ప్రాధాన్యతలు ఉంటే మంచిదని, ఈ విషయంలో ప్రధానమంత్రి పేదలకు సహాయం చేయడంమాని కార్పొరేట్ సంస్థలకు సుమారు 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.  ప్రధానమంత్రి  విపక్షాలు ఉన్న ప్రభుత్వాలను కూల్చడం మానేసి, పడిపోతున్న రూపాయి పైన దృష్టి సారించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో  డిపి ) మార్చడం వల్ల ఏమవుతుందని, జిడిపి మారితే దేశానికి మంచి జరుగుతుందన్నారు.  

బీజేపీ నేతలు గోబెల్స్ శిష్యులు ! 
  
బిజెపి నాయకులు నోటితో రెచ్చిపోయి ప్రచారంలో దూసుకుపోతుంటే మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయన్నారు. బిజెపి నేతలు గోబెల్స్ శిష్యులని, అబద్దాలను ప్రచారం చేయడం, ద్వేశం పెంచడంలో సిద్ధహస్తులని కేటీఆర్ అన్నారు. అయితే బిజెపి అబద్ధపు ప్రాపగాండను ఎండగట్టడంతో పాటు అదే సమయంలో తాము చేస్తున్న పనులు అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతామన్నారు.  బిజెపి జాతీయవాదం, మతవాదంతో రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేందుకు ప్రయత్నం చేస్తుందని, ఈ విషయంలో మీరు వెనుక పడ్డారన్న ప్రశ్నకు సమాధానంగా తమది అభివృద్ధి పూర్వక జాతీయవాదమని, దానిపైననే తాము దృష్టి సారించామన్నారు.

మునుగోడు మరో ఉపఎన్నిక మాత్రమే ! 

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి  తనకు తెలిసినంతవరకు మునుగోడు అంశం కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే అని, దాంతో ఏం మారుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వీఆర్ఏలకు సంబంధించిన జీతాలు మరియు పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఐఐటీ బాసర విద్యార్థుల సమస్యలను  తామేందుకు పట్టించుకోమని ప్రశ్నించిన కెటియార్, వాటిపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సాధించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి తోపాటు వైస్ ఛాన్స్లర్, డైరెక్టర్ క్యాంపస్ లో ఉండి విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కేటీఆర్ తెలిపారు.

మాది ప్రజాస్వామ్యప్ర భుత్వం !

 జర్నలిస్ట్ ముసుగులో వాక్ స్వాతంత్రం పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలను హేళనగా మాట్లాడుతున్న వాళ్లపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా వాక్ స్వేచ్చను సమర్థించే ప్రజాసామిక ప్రభుత్వం మాదని అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఈ వాక్  స్వేచ్ఛ ఇతరులను అవహేళన చేసేందుకు, తిట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని దాన్ని ఎవరూ సహించాల్సిన అవసరం లేదన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ఐటీ మంత్రి అవ్వాలన్న ట్వీట్ కు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడంతో సంతృప్తిగా ఉన్నట్లు, పశ్చిమబెంగాల్ విషయంలో మమతా బెనర్జీ తన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తున్నారని కితాబిచ్చారు.
 
దసరా నాటికి సచివాలయంప్రారంభం !

ఈ దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు.  తెలంగాణ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సేవ చేయడం కొనసాగిస్తుందన్నారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా సేవలు కొనసాగిస్తున్న కేసీఆర్ గారు తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి లేదా కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమానంగా తమ పొత్తు తెలంగాణ ప్రజలతో ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలతో పోరాడాలన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేవలం జాతీయ పార్టీలతోనే ఎందుకు అనేక ఇతర పార్టీలు కూడా ఉన్నాయిగా అన్నారు.తన కాలి గాయం నుంచి కోరుకుంటున్నట్లు, త్వరలోనే విధులకు హాజరుకానున్నట్లు కేటీఆర్ తెలిపారు. రెండు గంటల పాటు ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో సమాధానాలు ఇచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget