Big Breaking News Live: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 6న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 6న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
సంచలనం రేపిన యూపీ లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. యూపీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని యూపీకి చెందిన ఇద్దరు లాయర్లు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. ఈ క్రమంలో సీజేఐ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనుంది.
ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడకు 4 లేన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
హైదరాబాద్ (ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్) నుంచి మన్నెగూడకు 4 లేన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.928.41 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
Construction work for 4-Laning of NH-63 from Hyderabad (ORR Appa Junction) to Mannegudda under NH (O) has been approved in the state of Telangana with a budget of Rs. 928.41 Cr. #PragatiKaHighway @kishanreddybjp @TelanganaCMO @BJP4Telangana
— Nitin Gadkari (@nitin_gadkari) October 6, 2021




















