అన్వేషించండి

GO 111 Politics : జీవో 111 రద్దు సాధ్యమేనా ? గత ఏడాది కేబినెట్ నిర్ణయం ఎందుకు అమలు కాలేదు ?

గత ఏడాది రద్దు చేసిన జీవో 111ని మళ్లీ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ?. ఈ జీవో రద్దు సాధ్యమేనా ?

 

GO 111 Politics :   హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న జీవో నెంబర్ 111ను రద్దు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. వెంటనే హైదరాబాద్ చుట్టూ మరో నగరం వెలుస్తుందని ప్రచారం ప్రారంభమయింది. అయితే   గత ఏడాది ఏప్రిల్‌లోజరిగిన కేబినెట్ భేటీలోనూ  జీవో నెంబర్ 111ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నిర్ణయం తీసుకుంటే.. ఇప్పుడు ఎందుకు మళ్లీ రద్దు చేయాల్సి వచ్చింది ? అప్పుడు రద్దు చేయలేకపోతే ఇప్పుడు ఎలా చేస్తారు ? ఇది చాలా మందికి వస్తున్న సందేహం. నిజానికి ఈ జీవో రద్దు సుప్రీంకోర్టు దగ్గర ఉందని నిపుణులు చెబుతున్నారు.  
 
జంట జలాశయాల రక్షణ కోసం జీవో నెంబర్ 111

గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 111ని జారీ చేశారు.  ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. మొత్తం 84 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. అప్పట్లో హైదరాబాద్‌కు గండిపేట , హిమాయత్ సాగర్  జలాలే కీలకం. అందుకే వాటి పరిరక్షణకు జీవో తెచ్చారు.    

జీవో ఎత్తి వేయాలని 84 గ్రామాల ప్రజల సుదీర్ఘ డి్మాండ్ ! 

 కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి  రావడంతో   గండిపేట , హిమాయత్ సాగర్  జంట జలాశయాలపై ఆధారపడడం తగ్గిందని ప్రభుత్వంచెబుతోంది.   అందువల్ల జీవో 111ని ఎత్తివేయాలని ప్రజలు  కోరుతున్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ ఆంక్షల కారణంగా.. ఆ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి జరగడం లేదు. మిగతా ప్రాంతాలతో పోల్చితే భూముల ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. 111 జీవోను రద్దు చేస్తే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. భూముల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది.  జీవో నెంబర్ 111  పరిధిలోని గ్రామాల పాలకవర్గాలు జీవోను రద్దు చేయాలని కోరుతూ.. గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. 

జీవో రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా ?
  
కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాక‌ముందే ఎన్నిక‌ల ప్ర‌చారంలో 111 జీవోని రద్దు చేస్తామని చెబుతూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 2016లో ఐఏఎస్ లు ఎస్పీ సింగ్ ,ఎస్కే జోషి, దాన కిషోర్ ల‌తో ఓ క‌మిటీ ఏర్పాటు చేశారు. కానీ ఏమీ తేల్చలేకపోయారు.  2018 మార్చి 11న‌ ఎన్నికల సందర్భంగా 111 జీవోను ఎత్తేస్తామ‌ని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే.. 1999లోనే పరిశ్రమ ఏర్పాటుకు ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నిస్తే.. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ సుప్రీం కోర్టు వ‌ర‌కు వెళ్లింది. అప్పుడే ప్రికాష‌న‌రీ ప్రిన్సిపుల్ కింద డివిజ‌న్ బెంచ్ చాలా స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చింది. 111 జీవోని ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం తన‌కు అనుకూల‌మైన వారికి మేలు చేసేలా చేయ‌రాద‌ని తెలిపింది.    కేవ‌లం తాగునీటి ఎద్ద‌టి తీరింద‌ని ర‌ద్దు చేసే అవ‌కాశాలు లేవని. ఇంకా చాలా అంశాలు చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

జీవో 111 రద్దయితే  ప్రభుత్వానికీ భారీగా భూములు !

ఈ జీవో పరిధిలో దాదాపు 538 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఈ జీవో తీసేస్తే దాదాపు లక్షా 32 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని ఒక అంచనా.  ఈ భూమిలో ప్రభుత్వానికి చెందినదే 18 వేల ఎకరాలకు పైగా ఉంది. దీంతో హైదరాబాద్ విస్తరణ అవకాశం బాగా పెరుగుతుంది. ఇక ప్రైవేటు భూముల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ కేసీఆర్ రెండు సార్లు కేబినెట్ సమావేశంమలోనేనిర్ణయించారంటేనే.. రద్దు సాధ్యం కాదని అర్థమని.. ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Botsa Anusha Political Entry: రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget