అన్వేషించండి

YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?

YSRCP: వైఎస్ జగన్ బెంగళూరులో ఉంటూ ఏపీపై కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. తాడేపల్లిలో ఇల్లు ఉండగా జగన్ బెంగళూరుకు ఎందుకు మకాం మార్చారు?

YS Jagan Bengaluru:  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే బెంగళూరు పర్యటనలు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఎక్కవగా బెంగళూరులోని తన నివాసంలోనే ఉంటున్నారు.  దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటూ కూటమి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, అక్కడ ఆయనకు అంత కీలకమైన పని ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

వీకెండ్ లో మాత్రమే వెళ్తున్నారన్న వైసీపీ 

 ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకుడు పక్క రాష్ట్రంలో ఉండి రాజకీయం చేయడం ఏంటని, ఇది ప్రజలను బాధ్యతారాహిత్యంగా వదిలేయడమేనని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఈ విమర్శలను వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా తిప్పికొడుతున్నారు. వీకెండ్‌లో బెంగళూరు వెళ్తే తప్పేంటని, అక్కడ జగన్ కి కుటుంబం, వ్యక్తిగత పనులు ఉంటాయని ఆయన సమర్థిస్తున్నారు. జగన్ ఎక్కడ ఉన్నా ఏపీ ప్రజల కోసమే ఆలోచిస్తారని, కుట్రలు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని అంబటి స్పష్టం చేశారు. అయితే, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత నిరంతరం రాష్ట్రం వెలుపల ఉండటం వల్ల క్యాడర్‌లో నైతిక స్థైర్యం తగ్గుతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

అమరావతిలో సర్వ హంగులతో జగన్ నివాసం

నిజానికి, అమరావతిలోని తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డికి సర్వ హంగులతో కూడిన నివాసం,  కార్యాలయం ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచే ఆయన పరిపాలన సాగించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడే ఉండి క్షేత్రస్థాయి రాజకీయాలు నడిపిస్తే పార్టీకి మరింత మైలేజీ వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం, బాధితులను పరామర్శించడం వంటి కార్యక్రమాలు రాజధాని ప్రాంతం నుంచే సులభతరం అవుతాయని, బెంగళూరు పర్యటనలు ఆ దూరాన్ని పెంచుతున్నాయని విశ్లేషిస్తున్నారు. 

పక్క రాష్ట్రంలో ఎక్కువగా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు      

బెంగళూరు నివాసం జగన్‌కు వ్యక్తిగత సౌకర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో  స్థానికత అనేది అత్యంత కీలకమైన అంశం. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తున్నప్పుడు జగన్  హైదరాబాద్‌ వాసి అని ప్రశ్నించిన సందర్భాలను టీడీపీ ఇప్పుడు గుర్తు చేస్తోంది. ఇప్పుడు అదే పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు. ఏపీలో సొంత ఇల్లు, బలమైన కేడర్ ఉన్నప్పుడు ఆయన బెంగళూరుకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనేది సామాన్య ప్రజల్లో కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. 

వైసీపీ పుంజుకోవాలన్నా ఏపీలో ఉండాల్సిందే!

ప్రస్తుత కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉన్నందున వైసీపీ తిరిగి పుంజుకోవాలంటే నాయకత్వం నిరంతరం ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీ వర్గాలుభావిస్తున్నాయి.  బెంగళూరు పర్యటనల వల్ల వచ్చే  గ్యాప్ ను అధికార పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. జగన్ తన రాజకీయ కేంద్రస్థానాన్ని పూర్తిస్థాయిలో ఏపీకే పరిమితం చేస్తే, విమర్శలకు చెక్ పడటమే కాకుండా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది.  రాజకీయాల్లో ప్రజలు చూసే విధానం  అనేది ఫలితాలను శాసిస్తుంది కాబట్టి జగన్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని  పార్టీ నేతలు భావిస్తున్నారు.    

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget