అన్వేషించండి

YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?

YSRCP: వైఎస్ జగన్ బెంగళూరులో ఉంటూ ఏపీపై కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. తాడేపల్లిలో ఇల్లు ఉండగా జగన్ బెంగళూరుకు ఎందుకు మకాం మార్చారు?

YS Jagan Bengaluru:  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే బెంగళూరు పర్యటనలు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఎక్కవగా బెంగళూరులోని తన నివాసంలోనే ఉంటున్నారు.  దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటూ కూటమి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, అక్కడ ఆయనకు అంత కీలకమైన పని ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

వీకెండ్ లో మాత్రమే వెళ్తున్నారన్న వైసీపీ 

 ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకుడు పక్క రాష్ట్రంలో ఉండి రాజకీయం చేయడం ఏంటని, ఇది ప్రజలను బాధ్యతారాహిత్యంగా వదిలేయడమేనని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఈ విమర్శలను వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా తిప్పికొడుతున్నారు. వీకెండ్‌లో బెంగళూరు వెళ్తే తప్పేంటని, అక్కడ జగన్ కి కుటుంబం, వ్యక్తిగత పనులు ఉంటాయని ఆయన సమర్థిస్తున్నారు. జగన్ ఎక్కడ ఉన్నా ఏపీ ప్రజల కోసమే ఆలోచిస్తారని, కుట్రలు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని అంబటి స్పష్టం చేశారు. అయితే, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత నిరంతరం రాష్ట్రం వెలుపల ఉండటం వల్ల క్యాడర్‌లో నైతిక స్థైర్యం తగ్గుతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

అమరావతిలో సర్వ హంగులతో జగన్ నివాసం

నిజానికి, అమరావతిలోని తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డికి సర్వ హంగులతో కూడిన నివాసం,  కార్యాలయం ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచే ఆయన పరిపాలన సాగించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడే ఉండి క్షేత్రస్థాయి రాజకీయాలు నడిపిస్తే పార్టీకి మరింత మైలేజీ వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం, బాధితులను పరామర్శించడం వంటి కార్యక్రమాలు రాజధాని ప్రాంతం నుంచే సులభతరం అవుతాయని, బెంగళూరు పర్యటనలు ఆ దూరాన్ని పెంచుతున్నాయని విశ్లేషిస్తున్నారు. 

పక్క రాష్ట్రంలో ఎక్కువగా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు      

బెంగళూరు నివాసం జగన్‌కు వ్యక్తిగత సౌకర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో  స్థానికత అనేది అత్యంత కీలకమైన అంశం. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తున్నప్పుడు జగన్  హైదరాబాద్‌ వాసి అని ప్రశ్నించిన సందర్భాలను టీడీపీ ఇప్పుడు గుర్తు చేస్తోంది. ఇప్పుడు అదే పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు. ఏపీలో సొంత ఇల్లు, బలమైన కేడర్ ఉన్నప్పుడు ఆయన బెంగళూరుకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనేది సామాన్య ప్రజల్లో కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. 

వైసీపీ పుంజుకోవాలన్నా ఏపీలో ఉండాల్సిందే!

ప్రస్తుత కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉన్నందున వైసీపీ తిరిగి పుంజుకోవాలంటే నాయకత్వం నిరంతరం ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీ వర్గాలుభావిస్తున్నాయి.  బెంగళూరు పర్యటనల వల్ల వచ్చే  గ్యాప్ ను అధికార పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. జగన్ తన రాజకీయ కేంద్రస్థానాన్ని పూర్తిస్థాయిలో ఏపీకే పరిమితం చేస్తే, విమర్శలకు చెక్ పడటమే కాకుండా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది.  రాజకీయాల్లో ప్రజలు చూసే విధానం  అనేది ఫలితాలను శాసిస్తుంది కాబట్టి జగన్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని  పార్టీ నేతలు భావిస్తున్నారు.    

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget