అన్వేషించండి

AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు

Polavaram Project | అమరావతి సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

Andhra pradesh News | అమరావతి: భారతదేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కనుక రాష్ట్రానికి ఇక తిరుగుండదని, పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెట్టి, సుపరిపాలన అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి సానుకూల ఫలితాలను ఇచ్చిందని, ప్రజల్లో మళ్ళీ ఆశలు, విశ్వాసాన్ని నింపగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని దుస్థితి నుంచి, సూపర్ సిక్స్ వంటి భారీ హామీల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా పట్టాలెక్కించామని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేసి ప్రజల ఆశలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాల ఘన విజయాలు
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ధిదారులకు అందిన సహాయాన్ని సీఎం గణాంకాలతో వివరించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేయగా, 'స్త్రీశక్తి' ఉచిత ప్రయాణం కింద మహిళలు 3.5 కోట్ల సార్లు ప్రయాణించారు (రూ.1,114 కోట్ల వ్యయం). అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు, 'దీపం 2.0' కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే ఏడాదిన్నర కాలంలో రూ.50 వేల కోట్ల సామాజిక పెన్షన్లను అందించి సంక్షేమంలో సరికొత్త మైలురాయిని అధిగమించినట్లు వెల్లడించారు.

పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, దీనిని వచ్చే పుష్కరాల లోపు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న 3 వేల టీఎంసీల గోదావరి నీటిని పోలవరం-నల్లమల సాగర్ లింక్ ద్వారా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు తరలించి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, తెలంగాణ కూడా మిగిలిన నీటిని వాడుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వివాదాలు లేకుండా గోదావరి మిగులు జలాలను వినియోగించుకోవడంపై ఫోకస్ చేశామన్నారు. ఇటీవల ట్రయల్ రన్ విజయవంతమైన భోగాపురం ఎయిర్‌పోర్టును కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

పెట్టుబడులు, ఐటీ రంగం
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులలో 25 శాతం ఏపీకే రావడం విశేషమని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ (AI) డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని, అమరావతిలో 'క్వాంటం వ్యాలీ'కి త్వరలో పునాది వేస్తామని వెల్లడించారు. విశాఖ ఉక్కును రూ.12 వేల కోట్ల కేంద్ర సాయంతో కాపాడుకుంటామని, సీఐఐ, ఎస్ఐపీబీ (SIPB) ఒప్పందాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్ కు రూ.1.19 కు తగ్గించడమే భవిష్యత్ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పెంచలేదన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget