అన్వేషించండి

8th Pay commission: 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు ఎప్పుడు? జీతాలు పెరిగేది ఎప్పుడంటే

Central government salary hike | ఎనిమిదవ వేతన సంఘం జీతం ఇంకా రానప్పటికీ, ఉద్యోగుల డబ్బు సురక్షితం అని చెప్పవచ్చు. అమలులోకి రాగానే ప్రభుత్వం వారికి బకాయిలు చెల్లిస్తుంది.

8th Pay commission | జనవరి 2026 మొదలుకాగానే, లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇకపై జీతం పెరుగుతుందని వారు భావించారు.  సోషల్ మీడియాతో పాటు ఉద్యోగుల కార్యాలయాల్లో 7వ వేతన సంఘం ముగిసిన వెంటనే కొత్త వేతనం అమల్లోకి వస్తుందని చర్చలు జరిగాయి. కానీ నెలలు గడిచినా, జీతం మాత్రం పెరగలేదు. పెన్షన్లలో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పుడు అసలు జాప్యం ఎందుకు జరుగుతోంది, కొత్త వేతనం ఎప్పుడు వస్తుంది. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఎంత బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది అనే విషయాలు తెలుసుకోండి.  

8వ వేతన సంఘం గురించి గందరగోళం ఎందుకు 

నిజానికి, ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త వేతన సంఘాన్ని అమలు చేసే సంప్రదాయం భారత్‌లో ఉంది. 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుండి అమలులోకి వచ్చింది. దీని ఆధారంగా జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందని భావించారు. కానీ ఇది కేవలం ఒక అంచనాగా మిగిలింది. వాస్తవానికి, జీతం పెంచడానికి ఎటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ లేదు. 

జీతం ఎందుకు పెరగలేదు

వేతన సంఘం ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. మొదట, ప్రభుత్వం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత, వేతన సంఘం ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేస్తుంది. ఆపై తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం ఆ సిఫార్సులను పరిశీలించి ఆమోదించాలి. ఆ తర్వాతే కొత్త జీతాలు అమల్లోకి వస్తాయి. అందుకే 7వ వేతన సంఘం గడువు ముగిసిన తర్వాత జీతం నేరుగా పెరగలేదు. 

జనవరి 2026లో ఏమి మారింది దు

జనవరి 2026లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగలేదు. పెన్షనర్లకు అంతే మొత్తం వస్తుంది. ప్రభుత్వం ఇప్పటివరకు 8వ వేతన సంఘం గురించి ఎటువంటి తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు పాత జీతాలు, పెన్షన్లు అందుతున్నాయి.

8వ వేతన సంఘం ఎప్పుడు అమలులోకి రావొచ్చు

8వ వేతన సంఘం సిఫార్సులు 2026 రెండవ అర్ధభాగంలో లేదా 2027 ప్రారంభంలో అమలులోకి రానున్నాయి. అయితే, ఆలస్యం జరిగితే కూడా ఉద్యోగులకు నష్టం ఉండదు, ఎందుకంటే కట్-ఆఫ్ తేదీ జనవరి 1, 2026గా పరిగణించనున్నారు. 

బకాయిలు అంటే ఏమిటి.. 

కొత్త జీతం అమలు తేదీ, కట్-ఆఫ్ తేదీ మధ్య ఏర్పడే వ్యత్యాసాన్ని బకాయిలు అంటారు. 8వ వేతన సంఘం తరువాత అమలులోకి వస్తే, ఉద్యోగులకు గత తేదీ నుండి పెరిగిన జీతం మొత్తం ప్రయోజనం లభిస్తుంది. ఎంత ఆలస్యమైతే, అన్ని నెలల బకాయిలు ఒకేసారి ఉద్యోగులకు లభిస్తాయి. 

బకాయిల లెక్కింపు ఎలా ఉంటుంది

ఒక ఉద్యోగి ప్రస్తుత జీతం రూ. 50,000 అని అనుకుంటే.. 8వ వేతన సంఘం తర్వాత ఈ జీతం రూ. 55,000కి పెరుగుతుంది. అంటే, ప్రతి నెలా రూ. 5,000 వ్యత్యాసం ఉంటుంది. వేతన సంఘం మే 2027లో అమలులోకి వస్తే, జనవరి 2026 నుండి ఏప్రిల్ 2027 వరకు మొత్తం 15 నెలల బకాయిలు కేంద్రం చెల్లించనుంది. నెలకు రూ. 5,000 చొప్పున మొత్తం బకాయిలు రూ. 75,000 ఉద్యోగికి ఒకేసారి చెల్లిస్తారు.

పెన్షనర్లకు ఏం ప్రయోజనం 

ఉద్యోగులే కాకుండా, పెన్షనర్లకు కూడా బకాయిలు అందిస్తుంది. పెన్షన్ కొత్త సిఫార్సుల ఆధారంగా లెక్కించనున్నారు. కట్-ఆఫ్ తేదీ నుండి అమలు తేదీ వరకు ఉన్న వ్యత్యాసం వారికి బకాయిల రూపంలో ఇస్తారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 SRH 4th Consecutive Win: స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
AB Venkateswara Rao: అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
Viral Video: అన్నా అని పిలిచినందుకు సెలూన్ సిబ్బందిపై దాడి.. కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ సస్పెన్షన్!
అన్నా అని పిలిచినందుకు సెలూన్ సిబ్బందిపై దాడి.. కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ సస్పెన్షన్!

వీడియోలు

MI Batting Line Up vs CSK IPL 2026 | ముంబై బ్యాటర్ల ఘోర వైఫల్యం
IPL 2026 MI vs CSK Akeal Hosein | వాంఖడేలో అకీల్ హోసెన్ స్పిన్ సునామీ
MI vs CSK Highlights IPL 2026 | ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ విక్టరీ
Sanju Samson Century vs MI IPL 2026 | ఒక సెంచరీతో రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ
RR vs LSG IPL 2026 Highlights | లక్నోకు వరుసగా 4వ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 SRH 4th Consecutive Win: స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
AB Venkateswara Rao: అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
Viral Video: అన్నా అని పిలిచినందుకు సెలూన్ సిబ్బందిపై దాడి.. కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ సస్పెన్షన్!
అన్నా అని పిలిచినందుకు సెలూన్ సిబ్బందిపై దాడి.. కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ సస్పెన్షన్!
Gods and Soldiers Movie: బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
YSRCP MLCs resign: అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
Oosaravelli Special Shows: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... ఊసరవెల్లి స్పెషల్ షోస్
ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... ఊసరవెల్లి స్పెషల్ షోస్
Bengaluru: పరీక్ష రాయాలంటే జంధ్యం తీసేయాల్సిందే - ఇన్విజిలేటర్ల నిర్వాకం - వివాదం కాకుండా ఉంటుందా?
పరీక్ష రాయాలంటే జంధ్యం తీసేయాల్సిందే - ఇన్విజిలేటర్ల నిర్వాకం - వివాదం కాకుండా ఉంటుందా?
Embed widget