అన్వేషించండి

Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

Political Strategy: బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాలంటే ముందుగా ఆ పార్టీ పిల్లర్ల వంటి నేతల్ని సొంత నియోజకవర్గాల్లో బలహీనం చేయాలి. ఈ ప్లాన్ ను రేవంత్ అమలు చేయడం ప్రారంభించారు. కానీ అంత తేలిక కాకపోవచ్చు.

Revanth Political Strategy On BRS : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వ్యూహాత్మకంగా బలహీనం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన మొదటగా ఆ పార్టీ ముఖ్యనేతలను బలహీనం చేయాలనుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కంచుకోటలను బద్దలు కొట్టాలనుకుంటున్నారు.  సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల ఈ మూడు కేవలం నియోజకవర్గాలు మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ కోటలనే లక్ష్యంగా చేసుకుని, గులాబీ దళపతులైన హరీష్ రావు, కేసీఆర్, , కేటీఆర్‌లను రాజకీయంగా బలహీనపరిచేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.  

మూడు నియోజకవర్గాలపై రేవంత్ ప్రత్యేక దృష్టి 

తెలంగాణలో అధికారాన్ని  నిలబెట్టుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల సొంత నియోజకవర్గాల్లో ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.  సిద్ధిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దీనికి స్పష్టమైన సంకేతం. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలో అడుగుపెట్టిన రేవంత్, అక్కడ అభివృద్ధిలో లోపాలను ఎత్తిచూపుతూనే, రాజకీయంగా ఆధిపత్యం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. కేవలం గెలవడమే కాదు, ప్రత్యర్థి నాయకత్వాన్ని స్థానికంగా దెబ్బతీయాలన్నది రేవంత్ మాస్టర్ ప్లాన్.  రేవంత్ రెడ్డి అనుకుంటున్నంత సులభంగా ఈ మూడు నియోజకవర్గాల్లో మార్పు రావడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఆ నియోజకవర్గాల్లో పార్టీ కాదు.. నాయకత్వమే బలం! 

సిద్ధిపేటలో హరీష్ రావుకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, గజ్వేల్‌లో కేసీఆర్ పట్ల ఉన్న సెంటిమెంట్, సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఆ నాయకులను ప్రజలకు దగ్గర చేశాయి. ఈ ముగ్గురూ తమ నియోజకవర్గాల్లో కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా, కుటుంబ సభ్యులుగా స్థిరపడిపోయారు. వారిని ఢీకొనాలంటే కేవలం అధికార బలం సరిపోదు, అంతకు మించిన ప్రజాదరణ ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు ఉండాలి.  ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య  బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం. సిద్ధిపేటలో హరీష్ రావుకు దీటైన నాయకుడు కానీ, సిరిసిల్లలో కేటీఆర్‌ను అడ్డుకోగల చరిష్మా ఉన్న నేత కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. 

కాంగ్రెస్‌కు మాస్ లీడర్ల కొరత 

ద్వితీయ శ్రేణి నాయకత్వం బలపడకుండా, కేవలం పైస్థాయి నుంచి చేసే విమర్శలు ఓట్లుగా మారవు. స్థానిక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, బీఆర్ఎస్ అగ్రనేతల ప్రభావాన్ని తగ్గించగలిగే  మాస్  లీడర్ల అవసరం కాంగ్రెస్‌కు   ఉంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. గతంలో ఇంద్రుడిలా వెలిగిన ఎందరో అగ్రనేతలు తమ సొంత గడ్డపైనే ఓటమి పాలైన చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి వ్యూహం ప్రకారం.. ప్రభుత్వ పథకాలను ఈ నియోజకవర్గాల్లో సమర్థవంతంగా అమలు చేస్తూ, బీఆర్ఎస్ కేడర్‌ను ఆకర్షించడం ద్వారా ఆ కోటలను బీటలు వారేలా చేయవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి పనుల్లో వివక్ష చూపుతున్నారనే ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం రేవంత్ ముందన్న సవాలు. 

రేవంత్ రాజకీయాన్ని తక్కువ అంచనా వేయలేం! 

రేవంత్ రెడ్డి సంకల్పం గట్టిగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వాన్ని మర్చిపోయేలా చేసే స్థాయి ఉన్న నేతలు స్థానికంగా ఎదిగితేనే కాంగ్రెస్‌కు అక్కడ భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయగలిగితే, అది తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద మలుపు అవుతుంది. ఇప్పటికే అక్కడ బలమైన నేతల్ని గుర్తించి ప్రోత్సహించే వ్యూహాన్ని రేవంత్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఇచ్చే అభ్యర్థుల్ని రెడీ చేసుకున్నా అది బీఆర్ఎస్ పార్టీ వ్యూహాల్లో కీలకమైన మార్పులు తెస్తుంది. మరి రేవంత్ రాజకీయం ఈ సారి ఆయన వ్యూహాలకు తగ్గట్లుగా సాగుతుందా?  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Advertisement

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget