అన్వేషించండి

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం Madhu Ridge Park Apartment స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడం లేదని, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉందని భవిష్యత్తులోనూ వారికి నష్టమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Madhu Ridge Park Apartment | హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో అత్యంత వివాదాస్పదమైన మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలంపై అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం తీసుకోకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఆ అపార్ట్‌మెంట్ స్థలాన్ని ప్రభుత్వం అడగలేదని ఆయన తేల్చి చెప్పారు. మూసీ బఫర్ జోన్ వల్లే అపార్ట్‌మెంట్ వాసులకు నష్టం వాటిల్లుతుందని, భూమి ఇస్తే కనుక వారికి పరిహారం చెల్లించి ప్రత్యామ్నాయం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన 98 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, అది తమకు సరిపోతుందని ఆయన వివరించారు. 2005-06లో అపార్ట్‌మెంట్ వాసులు దాన్ని చిన్న నాలాగా చూపించి పర్మిషన్ తీసుకున్నారు. 2012, 2016లో పరిశీలిస్తే 50 మీటర్లలో బఫర్ జోన్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అపార్ట్ మెంట్ సగం వరకు బఫర్ జోన్లో ఉందని క్లారిటీ ఇచ్చారు. 

బఫర్ జోన్ సమస్యపై హెచ్చరిక.. పరిహారం చెల్లింపుపై ప్రకటన
అపార్ట్‌మెంట్ వాసులకు ఉన్న అసలు సమస్య బఫర్ జోన్ మార్పు వల్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో ఉండటం వల్ల భవిష్యత్తులో యజమానులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బఫర్ జోన్ నిబంధనల కారణంగా ఆ అపార్ట్‌మెంట్‌ను భవిష్యత్తులో ఎవరూ కొనలేరని, అమ్మలేరని, అది దేనికీ పనికిరాకుండా పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ కు సంబంధించిన స్థలాన్ని అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఇస్తే కనుక వారికి నష్ట పరిహారం ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించేందుకు ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కొనుగోలుదారుల జాగ్రత్త
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులోనూ ప్రయోజనం ఉండదని, దాని వల్ల కొనుగోలుదారులే నష్టపోతారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం స్థలం అడుగుతోందన్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ, కేవలం నిబంధనల పరంగా ఉన్న చట్టపరమైన చిక్కుల గురించే తాము ప్రస్తావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మా ఇండ్లే మాకు కావాలి.. పరిహారం వద్దు: మధు పార్క్ రిడ్జ్ నివాసితులు 
రంగారెడ్డి జిల్లాలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసితులు ఇటీవల ప్రధాన రహదారి పక్కన శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని, తమకు ఎలాంటి పరిహారం వద్దని చెప్పారు. ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమ ఇండ్లను కూలగొడితే చూస్తూ కూర్చునేది లేదన్నారు. 

ప్రభుత్వంపై అపార్ట్మెంట్ వాసుల ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి తమ ఇళ్లకు జీరో వ్యాల్యూ అని ప్రకటించడంపై మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు బఫర్ జోన్ అని సాకులు చెప్పి పనికిరాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లు వస్తే వాటి కింద పడుకుంటాం తప్ప కష్టపడి కట్టుకున్న ఇళ్లను వదులుకోం.. అవసరమైతే చావడానికైనా సిద్ధమని ఇటీవల తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget