అన్వేషించండి

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం Madhu Ridge Park Apartment స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడం లేదని, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉందని భవిష్యత్తులోనూ వారికి నష్టమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Madhu Ridge Park Apartment | హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో అత్యంత వివాదాస్పదమైన మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలంపై అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం తీసుకోకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఆ అపార్ట్‌మెంట్ స్థలాన్ని ప్రభుత్వం అడగలేదని ఆయన తేల్చి చెప్పారు. మూసీ బఫర్ జోన్ వల్లే అపార్ట్‌మెంట్ వాసులకు నష్టం వాటిల్లుతుందని, భూమి ఇస్తే కనుక వారికి పరిహారం చెల్లించి ప్రత్యామ్నాయం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన 98 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, అది తమకు సరిపోతుందని ఆయన వివరించారు. 2005-06లో అపార్ట్‌మెంట్ వాసులు దాన్ని చిన్న నాలాగా చూపించి పర్మిషన్ తీసుకున్నారు. 2012, 2016లో పరిశీలిస్తే 50 మీటర్లలో బఫర్ జోన్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అపార్ట్ మెంట్ సగం వరకు బఫర్ జోన్లో ఉందని క్లారిటీ ఇచ్చారు. 

బఫర్ జోన్ సమస్యపై హెచ్చరిక.. పరిహారం చెల్లింపుపై ప్రకటన
అపార్ట్‌మెంట్ వాసులకు ఉన్న అసలు సమస్య బఫర్ జోన్ మార్పు వల్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో ఉండటం వల్ల భవిష్యత్తులో యజమానులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బఫర్ జోన్ నిబంధనల కారణంగా ఆ అపార్ట్‌మెంట్‌ను భవిష్యత్తులో ఎవరూ కొనలేరని, అమ్మలేరని, అది దేనికీ పనికిరాకుండా పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ కు సంబంధించిన స్థలాన్ని అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఇస్తే కనుక వారికి నష్ట పరిహారం ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించేందుకు ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కొనుగోలుదారుల జాగ్రత్త
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులోనూ ప్రయోజనం ఉండదని, దాని వల్ల కొనుగోలుదారులే నష్టపోతారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం స్థలం అడుగుతోందన్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ, కేవలం నిబంధనల పరంగా ఉన్న చట్టపరమైన చిక్కుల గురించే తాము ప్రస్తావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మా ఇండ్లే మాకు కావాలి.. పరిహారం వద్దు: మధు పార్క్ రిడ్జ్ నివాసితులు 
రంగారెడ్డి జిల్లాలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసితులు ఇటీవల ప్రధాన రహదారి పక్కన శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని, తమకు ఎలాంటి పరిహారం వద్దని చెప్పారు. ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమ ఇండ్లను కూలగొడితే చూస్తూ కూర్చునేది లేదన్నారు. 

ప్రభుత్వంపై అపార్ట్మెంట్ వాసుల ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి తమ ఇళ్లకు జీరో వ్యాల్యూ అని ప్రకటించడంపై మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు బఫర్ జోన్ అని సాకులు చెప్పి పనికిరాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లు వస్తే వాటి కింద పడుకుంటాం తప్ప కష్టపడి కట్టుకున్న ఇళ్లను వదులుకోం.. అవసరమైతే చావడానికైనా సిద్ధమని ఇటీవల తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Upasana Peddi Premiere: 'పెద్ది' ప్రీమియర్‌లో ఉపాసన... పేపర్లు ఎగరేసిన రామ్ చరణ్ భార్య
'పెద్ది' ప్రీమియర్‌లో ఉపాసన... పేపర్లు ఎగరేసిన రామ్ చరణ్ భార్య
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget