CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం Madhu Ridge Park Apartment స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడం లేదని, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉందని భవిష్యత్తులోనూ వారికి నష్టమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Madhu Ridge Park Apartment | హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో అత్యంత వివాదాస్పదమైన మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ స్థలంపై అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ స్థలం తీసుకోకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఆ అపార్ట్మెంట్ స్థలాన్ని ప్రభుత్వం అడగలేదని ఆయన తేల్చి చెప్పారు. మూసీ బఫర్ జోన్ వల్లే అపార్ట్మెంట్ వాసులకు నష్టం వాటిల్లుతుందని, భూమి ఇస్తే కనుక వారికి పరిహారం చెల్లించి ప్రత్యామ్నాయం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన 98 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, అది తమకు సరిపోతుందని ఆయన వివరించారు. 2005-06లో అపార్ట్మెంట్ వాసులు దాన్ని చిన్న నాలాగా చూపించి పర్మిషన్ తీసుకున్నారు. 2012, 2016లో పరిశీలిస్తే 50 మీటర్లలో బఫర్ జోన్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అపార్ట్ మెంట్ సగం వరకు బఫర్ జోన్లో ఉందని క్లారిటీ ఇచ్చారు.
బఫర్ జోన్ సమస్యపై హెచ్చరిక.. పరిహారం చెల్లింపుపై ప్రకటన
అపార్ట్మెంట్ వాసులకు ఉన్న అసలు సమస్య బఫర్ జోన్ మార్పు వల్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉండటం వల్ల భవిష్యత్తులో యజమానులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బఫర్ జోన్ నిబంధనల కారణంగా ఆ అపార్ట్మెంట్ను భవిష్యత్తులో ఎవరూ కొనలేరని, అమ్మలేరని, అది దేనికీ పనికిరాకుండా పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ మధు రిడ్జ్ అపార్ట్మెంట్ కు సంబంధించిన స్థలాన్ని అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఇస్తే కనుక వారికి నష్ట పరిహారం ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించేందుకు ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ ఎందుకూ పనికిరాదు, ఎవరూ కొనరు
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2026
మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ స్థలం తీసుకోకపోయినా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదు
మీ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉంది, భవిష్యత్తులో మీ అపార్ట్మెంట్ ఎవరూ కొనలేరు, అమ్మలేరు, ఎందుకూ పనికిరాదు, మీరే… https://t.co/4gfGIkkoU1 pic.twitter.com/NX0VwAlQ6W
కొనుగోలుదారుల జాగ్రత్త
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులోనూ ప్రయోజనం ఉండదని, దాని వల్ల కొనుగోలుదారులే నష్టపోతారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం స్థలం అడుగుతోందన్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ, కేవలం నిబంధనల పరంగా ఉన్న చట్టపరమైన చిక్కుల గురించే తాము ప్రస్తావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మా ఇండ్లే మాకు కావాలి.. పరిహారం వద్దు: మధు పార్క్ రిడ్జ్ నివాసితులు
రంగారెడ్డి జిల్లాలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులు ఇటీవల ప్రధాన రహదారి పక్కన శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని, తమకు ఎలాంటి పరిహారం వద్దని చెప్పారు. ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమ ఇండ్లను కూలగొడితే చూస్తూ కూర్చునేది లేదన్నారు.
ప్రభుత్వంపై అపార్ట్మెంట్ వాసుల ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి తమ ఇళ్లకు జీరో వ్యాల్యూ అని ప్రకటించడంపై మధు రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు బఫర్ జోన్ అని సాకులు చెప్పి పనికిరాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లు వస్తే వాటి కింద పడుకుంటాం తప్ప కష్టపడి కట్టుకున్న ఇళ్లను వదులుకోం.. అవసరమైతే చావడానికైనా సిద్ధమని ఇటీవల తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















