అన్వేషించండి

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!

Hyderabad Latest News: హైదరాబాద్‌ మెట్రో ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గత దశాబ్ద కాలంలో విస్తరణ జరగకపోవడంతో అది తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

Hyderabad Latest News: హైదరాబాద్‌ శరవేగంగా విస్తరిస్తోంది. పెరిగిన జనాభా, ఆదాయ మార్గాల మెరుగుదలతో ప్రతి ఇంట్లో కార్ల సంఖ్య పెరగడం నగరంలో ట్రాఫిక్ సమస్యను జటిలం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు, ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్తరమైన వ్యూహాన్ని ప్రకటించింది. కేవలం రోడ్ల విస్తరణకే కాకుండా ఎలివేటెడ్‌ కారిడార్లు, మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ సుందరీకరణ వంటి ప్రణాళికలతో నగర రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన రోడ్డు మ్యాప్‌ను శాసన మండలి వేదికగా వివరించారు. 

ట్రాఫిక్ నియంత్రణకు బిగ్ ప్లాన్

హైదరాబాద్ నగర అభివృద్ధిని ప్రభుత్వం మూడు కీలక విభాగాలుగా వర్గీకరించింది. అవే క్యూర్, ప్యూర్, రేర్, 783 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌ను క్యూర్‌గా పరిగణిస్తున్నారు. ఇక్కడ సర్వీస్‌ సెక్టార్‌పై దృష్టి సారించనున్నారు. ప్యూర్ విభాగంలో ఇండస్ట్రియల్‌ సెక్టార్, రేర్‌ విభాగంలో అగ్రికల్చరల్‌ సెక్టార్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకి తరలించి, నగరాన్ని నివాసయోగ్యంగా మార్చాలని నిర్ణయించారు. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, మేడ్చెల్ కార్పొరేషన్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. 

నలువైపులా ఎలివేటెడ్ కారిడార్లు- సిగ్నల్ లేని ప్రయాణం

నగరం నడిబొడ్డు నుంచి శివార్ల వరకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ నరం నుంచి విముక్తి కలిగించడానికి నాలుగు ప్రధాన జంక్షన్ల వద్ద ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గౌలిగూడ జంక్షన్, చాదర్ ఘాట్ జంక్షన్, నాగోల్‌, అంబర్‌పేట జంక్షన్‌లో ఈ కారిడార్‌లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుల వల్ల భూసేకరణ భారం తక్కువగా ఉండటమే కాకుండా వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగకుండా నేరుగా నగరం వెలుపలకి చేరుకోవచ్చు. 

ముఖ్యంగా మూసీ రిజువెనేషన్ ప్రాజెక్టులో భాగంగా హిమాయత్ సాగర్ జంక్షన్ నుంచి మూసీ నది వెంట గౌరవెల్లి వరకు సుమారు 43 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గంలో గౌలిగూడ, చాదర్ ఘాట్, అంబర్‌పేట, నాగోల్ జంక్షన్‌ వద్ద ట్రంపెట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చేస్తారు. నల్గొండ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిగా మారిన నల్గొండ చౌరస్తా జంక్షన్‌ వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇది జూన్ లేదా జులై నాటికి అందుబాటులోకి వస్తుంది. 

మెట్రో రైలు రెండో దశ 

హైదరాబాద్‌ మెట్రో ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గత దశాబ్ద కాలంలో విస్తరణ జరగకపోవడంతో అది తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం 24వేల కోట్లతో మెట్రో రెండో దశను 76 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రతిపాదించింది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా చేసుకొని, విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం చేనున్నారు. నాగోల్, ఎల్బీనగర్‌ ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయగుట్ట, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో లైన్‌ పొడిగిస్తారు. 

పాతబస్తీ ప్రజల చిరకాల కోరిక మేరకు గౌలిగూడ వద్ద ఆగిపోయిన మెట్రో పనులను పునరుద్ధరించి ఫలక్‌నుమా, చాంద్రాయగుట్ట జంక్షన్‌ కనెక్ట్ చేయనున్నారు అలాగే ఐటీ ఉద్యోగుల కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌, నియోపోలిస్‌ వరకు, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం నుంచి చందానగర్ వరకు మెట్రోను విస్తరించనున్నారు. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Advertisement

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget