Modi Cabinet Reshuffle 2026: మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ - ఏపీకి దక్కబోయే కొత్త మంత్రులు వీరేనా?
AP Ministers in Modi Cabinet: ప్రధాని మోదీ కేబినెట్ను పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఏపీలో కొత్తగా ఎవరికి చాన్స్ దక్కుతుందన్నది సస్పెన్స్ గా మారింది.

Modi 3.0 Cabinet Expansion Updates: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-3 సర్కార్ మూడవ ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ , కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నందున ఈ మార్పులు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏపీకి అదనపు గుర్తింపు దక్కనుందా?
మోదీ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, పాలనలో వేగం పెంచడానికి మరియు, మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ పునర్వ్యవస్థీకరణను ఒక అవకాశంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కీలక బాధ్యతల్లో ఉన్నారు. కొత్తగా పలువురి పేర్లు తెరపైకివస్తున్నాయి. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరిని ఈసారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం బలంగా సాగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు , 33% మహిళా కోటా అమలు దిశగా అడుగులు వేస్తున్న మోదీ ప్రభుత్వం, అనుభవజ్ఞురాలైన పురందేశ్వరికి కేబినెట్ ర్యాంకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. టీడీపీకి మరో సహాయ మంత్రి పదవి లేదా ఒక కేబినెట్ ర్యాంకు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే సీనియర్ ఎంపీలకు ఈసారి ఛాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు.
రాజకీయ వ్యూహం - ఏపీ ప్రాధాన్యత
చంద్రబాబు నాయుడు తన పరిపాలనా దక్షతతో ఏపీని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో ఏపీకి ఎంత ఎక్కువ మంది మంత్రులు ఉంటే, రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడం అంత సులభం అవుతుంది. బీజేపీ కూడా వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో తన బలాన్ని పెంచుకోవడానికి టీడీపీని సంతృప్తి పరచడంతో పాటు, తన సొంత నేతలకు ఎలివేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
పని తీరు బాలేని మంత్రుల తొలగింపు
కొందరు ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా వారిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు ఉన్న మంత్రుల పనితీరుపై ప్రధాని సంతృప్తిగా ఉన్నారని, కానీ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అదనపు ప్రాతినిధ్యం ఇచ్చే దిశగా మోదీ ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారంలో జరిగే ఈ మార్పులు ఏపీ రాజకీయ సమీకరణాలను మార్చబోతున్నాయి. ఎవరెవరికి కొత్తగా చాన్సులు వస్తాయో.. ఎవరికి ప్రమోషన్ దక్కుతుందో చూడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















