అన్వేషించండి

KCR : రాజకీయమా ? నిరసనా ? మోడీ పర్యటనలో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదు ?

ప్రధాని పర్యటనలో కేసీఆర్ అసలు పాల్గొనలేదు. అయితే ఇది నిరసన వ్యక్తం చేయడమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాదు రాజకీయ కోణం ఉందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకూ ఏదీ నిజం ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా కాలం తర్వాత తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆయనది అధికారిక కార్యక్రమం. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరించారు. అటు కేసీఆర్‌కు స్వాగతం పలకడానికే కాదు ఇటు కార్యక్రమాల్లోనూ కేసీఆర్ పాల్గొనలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఇది ఓ రకమైన నిరసన అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం రాజకీయమని అంటున్నారు. సీఎంవో వర్గాలు మాత్రం కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని మీడియాకు సమాచారం ఇచ్చాయి. ఇంతకూ ఏది నిజం ?

శుక్రవారమే తలసానికి ప్రోటోకాల్ బాధ్యతలు.. అయినా కేసీఆర్ వెళ్తారని ప్రచారం !

తెలంగాణకు వస్తున్న ప్రధానిని స్వాగతించేందుకు , వీడ్కోలు పలికేందుకు ప్రోటోకాల్  అవకాశాన్ని మంత్రి తలసానికి ఇస్తూ శుక్రవారం సీఎంవో ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడే కేసీఆర్ వెళ్లడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. కేసీఆర్ స్వయంగా మోడీని రిసీవ్ చేసుకుంటారని.. పర్యటన మొత్తం ఆయనతోనే ఉంటారని మీడియాకు అనధికారిక సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం వరకూ అలాగే అనుకున్నారు. కానీ మోడీ హైదరాబాద్‌లో అడుగు పెట్టే ముంద కేసీఆర్‌కు జ్వరమని స్వాగతానికి వెళ్లడం లేదన్నారు. అయితే సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగే రామానుజ విగ్రహావిష్కరణకు వెళ్తారని సమాచారం ఇచ్చారు. చివరికి ఆ కార్యక్రమానికీ హాజరు కాలేదు. అంటే తెలంగాణకు వచ్చిన ప్రధానికి సీఎం కేసీఆర్ ఎదురుపడకూడదని డిసైడయ్యారన్నమాట.

నిరసన తెలియచెప్పారా ?

ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనకపోవడం వల్ల కేసీఆర్ తన నిరసనను తెలియచెప్పారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అందుకే కేసీఆర్ దూరంగా ఉన్నారని అంటున్నారు. బడ్జెట్ పెట్టిన రోజునప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన నాయకత్వం దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. ఆ ప్రెస్‌మీట్‌లో రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు బీజేపీ ఉద్యమం ప్రారంభించింది. ఈ సమయంలో మోడీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం బాగుండదని కేసీఆర్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. 

ప్రాంతీయ పార్టీల నేతల్లో సందేహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారా? 

గతంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులు కొద్ది మంది తప్ప ఎక్కువ మంది మోడీ రాష్ట్రాల పర్యటనలకు వస్తే స్వాగతం పలికేవారు కాదు.  కానీ కేసీఆర్‌ అలా కొట్టరని అనుకున్నారు. ఎందుకంటే సమతామూర్తి విగ్రహావిష్కరణ విషయంలో కేసీఆర్‌కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అయితే మోడీ పర్యటనలో పాల్గొంటే.. బీజేపీ, కేసీఆర్ ఒకటేనన్న ప్రచారం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిసారించారు. ప్రాంతీయ పార్టీలతో భేటీ నిర్వహిస్తుననారు. గత అనుభవాలతో కేసీఆర్‌ ఎక్కువగా బీజేపీకి దగ్గరే అని నమ్ముతున్నారు. ఇలాంటి నమ్మకాన్ని కేసీఆర్ దూరం చేుకోవాల్సి ఉంది. అందుకే ఆయన ప్రధానిపై అలా విరుచుకుపడుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. అందుకే టూర్‌కుడుమ్మా కొట్టారన్న అంచనాలు ఉన్నాయి. 

కేసీఆర్ పాల్గొనడం మోడీకి ఇష్టం లేదన్న సంకేతాలు వచ్చాయని ఆగిపోయారా ?

అదే సమయంలో ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉన్నారని.. కేసీఆర్‌తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అయిష్టత చూపారన్నప్రచారం ఉంది.  ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రగతి భవన్‌కు సమాచారం వచ్చిందని చెబుతున్నారు. అందుకే స్వాగతం పలకడానికి కూడా సిద్ధమై ఆగిపోయారని అంటున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ ప్రధాని మోడీతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటే ఓ రకమైన చర్చ జరిగేది.. పాల్గొనలేదు కాబట్టి మరో రకమైన చర్చ జరుగుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

PM Narendra Modi BJP Meeting: ప్రధాని మోదీతో భేటీ అరుదైన ఘట్టం - బీజేపీ నూతన పదాధికారులకు నరేంద్ర మోదీ మార్గనిర్దేశం!
ప్రధాని మోదీతో భేటీ అరుదైన ఘట్టం - బీజేపీ నూతన పదాధికారులకు నరేంద్ర మోదీ మార్గనిర్దేశం!
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget