అన్వేషించండి

YSRCP PK Team : "ఐ ప్యాక్" ఓకే అంటేనే వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ - క్యాడర్ వద్దన్నా చాన్స్ ! జగన్ నమ్మకమేంటి ?

వైఎస్ఆర్‌సీపీలో ఐ ప్యాక్ హవా నడుస్తోంది. ఆ సంస్థ ఇచ్చే నివేదికలు బాగుంటే క్యాడర్ ఓకే చెప్పకపోయినా జగన్ టిక్కెట్ ఖరారు చేస్తున్నారు.


YSRCP PK Team :   వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కింద టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో 71 మంది టెక్కలి నేతలు పాల్గొన్నారు. వారిలో 40 మంది వచ్చే ఎన్నికల్లో టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ వద్దని నేరుగా సీఎం జగన్‌కు  చెప్పారు. కానీ  ఆయన మాత్రం వారి అభ్యంతరాలను పట్టించుకోలేదు. అభ్యర్థిగా దువ్వాడను ఖరారు చేశారు. అందరూ కలిసి గెలిపించుకుని రావాల్సిందేనని ఆదేశించారు. దీంతో టెక్కలి క్యాడర్ ఆశ్చర్యపోయింది. దీనికి కారణం.. అక్కడ క్యాడర్ అభిప్రాయాలు ఎలా ఉన్నా.. అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ఉండాల్సిందేనని ఐ ప్యాక్ టీం నివేదిక ఇవ్వడమే కారణం. ఒక్క  టెక్కలి విషయంలోనే కాదు..  నియోజకవర్గాల్లో పార్టీ నేతల అసంతృప్తి ఉందని భావిస్తున్న ఇతర నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను జగన్ ఇలా ఖరారు చేయడానికి పీకే టీం నివేదికల్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.  

ప్రశాంత్ కిషోర్ టీంపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్న జగన్ 

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా పని చేశారు. సోషల్ మీడియా స్ట్రాటజీలు ఉపయోగించారు. సామాజిక సమీకరణాలు చూశారు. ఇలా అన్నీ పకడ్బందీగా ఉండటం.. వారు చేసిన సర్వేలన్నీ పక్కాగా ఉండటంతో జగన్ నమ్మకాన్ని పొందారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయం చేసుకుంటూ బీహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు కానీ.. ఏపీలో ఐ ప్యాక్ టీం మాత్రం పని చేస్తోంది. పీకేకు సన్నిహితుడైన రిషి రాజ్ నేతృత్వంలో ఏపీలో  పీకే టీం పని చేస్తోంది. ఇటీవల తెలంగాణలో పీకే టీం పని ఆపేసింది. ఆ సిబ్బంది అంతా  ఏపీకి వచ్చారు. దీంతో నియోజకవర్గాల్లో పరిస్థితులను వారు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ జగన్‌కు నివేదికలు ఇస్తున్నారు. 

అభ్యర్థుల ఎంపికపై పీకే టీం రిపోర్టే ఫైనల్ 

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కూడా పూర్తిగా ఐ ప్యాక్ టీం ఆలోచన. ఆ టీం కనుసన్నల్లోనే ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు.. ఇంచార్జులు ఎలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనేది ప్రతీ రోజూ నివేదికలు పంపుతున్నారు. ప్రతీ నెలా సమీక్ష పెట్టి జగన్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసేది ఈ ఐ ప్యాక్ టీం ఇచ్చే నివేదికలను బట్టే. అవన్నీ ఖచ్చితంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు ఎవరెవరు గడప గడపకూ వెళ్లడంతో లేదో.. తెలిసిపోతోంది.  ఈ కార్యక్రమంపై ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థఇతుల్లోనూ చేయాలని ఆదేశిస్తున్నారు. దీనికి కారణం ....ఇలా ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మేలు చెప్పడం ద్వారా.. ప్రభుత్వమే మన దగ్గరకు వచ్చిందని ప్రజలు భావిస్తారని పీకే టీం ఎక్స్ ప్లెయిన్ చేయడమేనని అంటున్నారు. 

ఎక్కువగా ఆధారపడుతున్నారని పార్టీ నేతల్లో అసంతృప్తి 

నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పీకే టీం నివేదికలపై ఆధారపడి ఉంటుందని జగన్ పదే పదే చెబుతున్నారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రకారం ఎమ్మెల్యేలు కూడా ...  ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. అయితే పలువురిలో మాత్రం తమ కంటే ప్రశాంత్ కిశోర్ బృందాన్నే జగన్ ఎక్కువగా నమ్ముతున్నారన్న అసంతృప్తికి గురవుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ ఏ మాత్రం మొహమాటానికి పోవడం లేదని.. సర్వేల విషయంలో పీకే టీం ఇచ్చేవాటికే కాకుండా  మరో రెండు స్వతంత్ర సంస్థలతోనూ సర్వేలు చేయిస్తున్నారని చెబుతున్నారు. 

వైఎస్ఆర్‌సీపీలో పీకే ప్రభావం ఎక్కువగా ఉందని 2019 ఎన్నికల ముందూ ప్రచారం జరిగింది.  ఇప్పుడూ అలాంటి పరిస్థితే వైఎస్ఆర్‌సీపీలో ఉంది. కానీ ఏదైనా విజయం కోసమేనని.. ఐ ప్యాక్ పనితీరుపై జగన్ సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Manifestos of Tamil parties: ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
IPL 2026: ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
Embed widget