అన్వేషించండి

New Alliance In Andhra : లెఫ్ట్ పార్టీలు కూడా టీడీపీకి దగ్గరవుతున్నాయా ? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారంతో కొత్త స్నేహం షురూ !

ఏపీలో వామపక్షాలు, టీడీపీ మధ్య రాజకీయ సహకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారంద్వితీయ ప్రాధాన్య ఓట్లపై చర్చలుఈ సహకారం సాధారణ ఎన్నికలకూ వారథి అవుతుందా ?


New Alliance In Andhra :  ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త పొత్తులకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించుకోవాలని లెఫ్ట్ పార్టీలు, టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్‌సీపీని ఓడింటి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు  తెలుగుదేశం, వామపక్షాలు కలిసి  పని చేయాలని నిర్ణయించకున్నాయి.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారంపై ఈ పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది.  మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఈ నెల 23న పోలింగ్‌ జరుగనుంది. ఇందులో టీడీపీ మూడు పట్టభద్ర స్థానాలకు బరిలోకి దిగింది. ఉపాధ్యాయ స్థానాలకు మాత్రం పోటీ చేయడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు పీడీఎఫ్‌ కూటమిగా ఏర్పడి పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానాలన్నింటిలోనూ పోటీ చేస్తున్నాయి. 

ఓట్ల లెక్కింపు కీలకం - అందుకే పరస్పర సహకారం!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. సాదారణ ఎన్నికల్లోలా మెజార్టీ చూడరు. యాభై శాతం ఓట్లు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇందుకోసం భిన్నమైన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్య ఓట్లు ఉంటాయి. ఓటరు తనకు బాగా నచ్చిన వారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి మిగిలిన వారికి రెండో ప్రాధాన్య ఓటు.. మూడో ప్రాధాన్య ఓటు వేయవచ్చు. ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్య ఓట్ల ద్వారా ఏ అభ్యర్థీ గెలవకపోతే రెండో ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత మూడో ప్రాధాన్య ఓట్లు కూడా లెక్కిస్తారు. అన్నీ కలిపి ఎవరికి ఎక్కువ వస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్య ఓట్లు చాలినన్ని ఎవరికీ రాకపోతేనే మిగిలిన రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. అందుకే రెండో ప్రాధాన్య ఓట్లు కూడా కీలకంగా మారాయి. 

రెండో ప్రాధాన్య ఓట్ల కోసం పరస్పర సహకారం ! 

వైఎస్ఆర్‌సీపీపీ మొత్తం పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడా గెలవకుండా చేసేందుకు పరస్పరం సహకరించుకోవడానికి టీడీపీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పట్టభద్ర స్థానాల్లో రెండో ప్రాధాన్య ఓట్లు పరస్పరం వేసుకుందామని, దీనికి బదులుగా ఉపాధ్యాయ స్థానాల్లో తమకు మద్దతివ్వాలని వామపక్షాలు టీడీపీని కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి టీడీపీ ప్రతినిధులు కూడా అంగీకరించినట్లుగా తెలు్సతోంది.  పట్టభద్ర స్థానాల్లో వామపక్షాలు మొదటి ప్రాధాన్య ఓటును తమ వారికి వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును టీడీపీకి వేస్తాయి. అలాగే టీడీపీ కూడా మొదటి ప్రాధాన్య ఓటును తనకు వేసుకుని రెండో ప్రాధాన్య ఓటును వామపక్షాల అభ్యర్థులకు వేస్తుంది. దీనికి బదులుగా ఉపాధ్యాయ స్థానాల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులను టీడీపీ బలపరచాలని ఆ పార్టీలు కోరాయి. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా తమ మద్దతు టీడీపీ అభ్యర్థులకు ఉంటుందని.. ఏ క్షణమైనా ఈ అంశంపై రెండు పార్టీలు ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

ఈ పొత్తుల సహకారం సక్సెస్ అయితే సాధారణ ఎన్నికలకూ ! 

వామపక్ష పార్టీలు కొంత కాలంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నాయి. అయితే ఎప్పుడూ పొత్తుల ప్రస్తావన రాలేదు. కలసి పని చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. స్థానిక ఎన్నికల్లోనూ ఎవరికి వారు పోటీ చేశారు. ఇప్పుడు వామపక్షాలు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు సిద్ధం కావడంతో...  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి సహకారం.. కలిసి వస్తే.. తదుపరి సాధారణ ఎన్నికల్లో ఇలాంటి సహకారంపై చర్చించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే..  మహాకూటమి తరహాలో టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీల కూటమి ఏర్పడే అవకాశం ఉంటుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JC Prabhakar Reddy Tadipatri Politics: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ
తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget