అన్వేషించండి

CM Jagan: 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్ర - సీఎం జగన్ కీలక నిర్ణయం, ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం వరకూ ప్రచారం

Andhra News: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు.

CM Jagan Bus Yatra: దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఎన్నికల సందడి మొదలైంది. ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ (CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మేమంతా సిద్ధం' (Memantha Siddam) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 26న లేదా 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కానున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ స్థానాల పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా ప్రతి రోజూ ఒక జిల్లాలో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు. ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూ.. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర, సభలపై పూర్తి వివరాలను మంగళవారం వెల్లడిస్తామని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి.

‘వైనాట్ 175’

‘వైనాట్ 175’ ఇదే నినాదంతో సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇటీవల 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేశారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన జగన్.. ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించేలా అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని సీట్లు కేటాయించారు. పార్లమెంటరీ స్థానాల్లోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తాము చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించి.. వారి సూచనలు, సలహాలు తెలుసుకోనున్నారు. అన్ని వర్గాల ప్రజలతోనూ మమేకం కానున్నారు. ఇప్పటికే రీజియన్ల వారీగా 'సిద్ధం' సభలను నిర్వహించారు. ఇప్పుడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రతో ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ పథకాలు, జరిగిన మంచిని వివరించనున్నారు. ప్రతి రోజూ ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం బహిరంగ సభ ఉండనున్నట్లు సమాచారం. కొన్ని నెలల ముందు నుంచే ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్రలతో మంత్రులు, నేతలు ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు సీఎం జగనే నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఓ వైపు సిద్ధం సభలతో ఫుల్ జోష్ లో ఉన్న వైసీపీ శ్రేణులకు.. సీఎం జగన్ బస్సు యాత్ర రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పాదయాత్రతో జగన్ ప్రజలకు చేరువయ్యారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈసారి కూడా ఎక్కువగా ప్రజల్లోనే ఉంటూ భారీ విజయం అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు కీలక సూచనలు ఇచ్చారు. పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు.

Also Read: North Andhra News: ఉత్తరాంధ్రను ఊపేస్తున్న రాజకీయ సమీకరణాలు-కీలక నియోజకవర్గాలపైనే అందరి చూపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget