అన్వేషించండి

Chandrababu on Nominated Posts: పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్‌ పోస్టులు- త్వరలోనే భర్తీ చేస్తామన్న చంద్రబాబు

AP Cm Chandrababu: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.

Chandrababu Says Nominated Posts Will Be Filled Soon: రాష్ట్రంలోని నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఎన్‌టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భగా తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్‌ స్థాయి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వారికే నామినేటెడ్ పోస్టులు 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామన్నారు. నేతలు, కార్యకర్తలు సాధికారిత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయన్నారు. అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజుల్లోనే తెరిపిస్తామని స్పష్టం చేశారు. కూటమి విజయం వెనుక కార్యకర్తలు, నాయకులు కష్టం, కృషి ఎంతో ఉందన్నారు. 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈ ఎన్నికల్లో గెలిచామన్న చంద్రబాబు.. ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితమిస్తున్నట్టు పేర్కొన్నారు. కూటమి విజయం సాధారణమైనది కాదని, గాలివాటంగా వచ్చిన గెలుపు కాదన్నారు. కూటమికి 93 శాతం స్ర్టైక్‌ రేట్‌, 57 శాతం ఓట్‌షేర్‌తో విజయాన్ని అందించారన్నారు. ఉమ్మడి ఎనిమిది జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేసిందని, ఈ విజయం వెనుక నేతలు, కార్యకర్తలు నిలబడిన తీరు, ఐదేళ్లు పడిన కష్టం ఉందన్నారు.

90 వేలకు పైగా మెజార్టీలు సాధించాం 
గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేలకుపైగా మెజారిటీలు వచ్చాయని, పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ రూరల్‌, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్‌, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకుపైగా మెజారిటీ వచ్చిందన్నారు. కూటమి విజయంలో మూడు పార్టీలు పాత్ర కీలకంగా పని చేసిందన్న చంద్రబాబు.. ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తలు రుణం తప్పకుండా తీర్చుకుంటానన్నారు. ఐదేళ్లపాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దని సూచించారు. ఎమ్మెల్యేలు, నేతలు కింది స్థాయి కార్యకర్తలను విస్మరించవద్దని సూచించారు. బాధ్యతగా, చిత్తశుద్ధితో పని చేసే ప్రజలు మళ్లీ ఆదరిస్తారన్న చంద్రబాబు.. ఆ దిశగా పని చేయాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నామన్న చంద్రబాబు.. సూపర్‌-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రకటించామని, వీటిని అమలు చేస్తామన్నారు. 2047 నాటికి దేశం ఉన్నత స్థాయిలో ఉండాలని, అందులో తెలుగువాళ్లు నెంబర్‌-1 ఉండాలని ఆకాంక్షించారు. 

కార్యకర్తల సంక్షేమ నిధితో సాయం 
కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులను పరిష్కరిస్తేనే వారిలో మనోబలం పెరుగుతుందని, గతంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించామని, ఇక ముందు కూడా ఆదుకుంటామన్నారు. ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామని, పాజిటివ్‌ గవర్నెన్స్‌ను తీసుకురానున్నట్టు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారని, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామన్నారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు. ఇదే ఫలితాలు 2029లో వస్తాయని జోస్యం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళతామన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget