అన్వేషించండి

Revant Reddy : సింగరేణిలో రాఫెల్ కంటే పెద్ద స్కాం - రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు !

సింగరేణిలో రూ. యాభై వేల కోట్ల స్కాం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విచారణ జరిపించాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్, కేంద్రం తోడు దొంగలని ఆరోపించారు.


సింగరేణిలో రాఫెల్ స్కాం కంటే పెద్ద కుంభకోణం జరుగుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  సింగరేణి సంస్థ లో 51 శాతం రాష్ట్ర వాటా, 49 శాతం కేంద్రం వాటా వుందని.. సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అమ్మడానికి ముందుకొస్తే.. రాష్ట్ర సర్కార్ అడ్డుకోడానికి ముందుకు రాలేదని విమర్శించారు. సింగరేణి  25 ఏళ్ళు లీజ్ ఇవ్వడానికి కేసీఆర్ తన అధికారాన్ని వినియోగించి ప్రైవేట్ పరం చేసే కుట్ర చేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఏడేళ్లుగా ఐఏఎస్ శ్రీధర్ సింగరేణి ఛైర్మెన్, సీఎండీ గా కొనసాగుతున్నారని ఆయన ఆధ్వర్యంలోనే వల కోట్ల రూపాయల అవినీతికి జరుగుతుందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, ఐఏఎస్ శ్రీధర్ కలసి అక్రమాలకు పాల్పడుతున్నారని..ఎంతో మంది ఐఏఎస్ లున్నా నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్‌ను కొనసాగించడాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  శ్రీధర్ పై ఎన్నో ఆరోపణలు వచ్చిన కేసీఆర్ తొలగించలేదు..కోల్ ఇండియా కూడా వద్దని చెప్పిన కేసీఆర్ వినలేదన్నారు రేవంత్ రెడ్డి. 

సింగరేణిలో రూ. 50వేల కోట్ల స్కాం ! 

ఒరిస్సా లోని నైని కోల్ మైన్ 25 ఏళ్లు ప్రైవేట్ సంస్థకు లీజ్ ఇచ్చారని .. దీని ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చుని.. కోల్ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరి వ్యక్తులకు లబ్ది చేకూరే పని చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టెండర్ ఎవరికీ రాకుండా చేసే కుట్ర చేశారన్నారు. రాఫెల్ కుంభకోణం కంటే ఇది పెద్దదని.. రాఫెల్ రూ. 35 వేల కోట్ల స్కాం అయితే .. ఇది రూ. 50 వేల కోట్ల కుంభకోణమని రేవంత్ విమర్శించారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి దీనిపై కేంద్రానికి ప్రధానికి, హోమ్ , విజిలెన్స్ , కోల్ మినిస్టర్, కోల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేశామన్నారు. 

సింగరేణి బొగ్గును అదానీ పరం చేసే కుట్ర ! 

ఇంత పెద్ద టెండర్ ని ఎవరికీ దక్కకుండా  టేలర్ మేడ్ కండిషన్ పై ముగ్గురి టెండర్లు వేసేలా చేశారన ిఆరోపించారు. కేంద్ర మైనింగ్ మినిస్టర్ ప్రహ్లద్ జోషి కూడా ఏమి చేయలేమని..పీఎంవో కార్యాలయం చూస్తుందని చెప్పారని..సెంట్రల్ విజిలెన్సు కమిషన్ కు రిఫర్ చేయండి అన్నా.. ప్రహల్లాద్ చేతులెత్తేశారని రేవంత్ ఆరోపించారు. టెండర్ బాక్స్ ఓపెన్ చేస్తే.. ఇద్దరి ముగ్గురికే లాభం చేకూరుతుందన్నారు.  ఐఏఎస్ అధికారి శ్రీధర్ కు ఫోన్ చేసి తప్పు చేస్తున్నావ్ అని చెప్పినా.. ఆయన నిస్సహాయకత వ్యక్తం చేశారని విమర్శించారు.  ఆదానికి టెండర్ దక్కితే.. ఆయన ఎవరికైనా ఆర్ధిక పెట్టుబడి దారికి అవకాశం కల్పించవచ్చు..  అదానీ మోడీ మనిషి ఐతే.. ప్రతిమ శ్రీనివాస్ కేసీఆర్ బినామీ రూపంలో నైని సంస్థల్లోకి ఎంట్రీ కాబోతున్నారని రేవంత్ జోస్యం చెప్పారు. 

సింగరేణి సీఎండీపై ఎందుకు విచారణ జరిపించరు ? 

సౌర విద్యుత్ కొనాలని మోడీ అంటుండు అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు నైని కోల్ మైన్ ఎట్లా ఆదానికి కట్టబెడుతున్నావని రేవంత్ ప్రశ్నించారు. మొత్తం భూగర్భ గనులను కేసీఆర్ కుటుంబం దోచుకునే పని చేస్తుందని ఆరోపించారు.  మోడీ, అమిత్ షా ఎందుకు కేసీఆర్ అవినీతిపై విచారణకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్ లో డిజిపి పై చర్య తీసుకున్న కేంద్రం.. శ్రీధర్ పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదు.. శ్రీధర్ పై తీవ్ర ఆర్ధిక ఆరోపణలు వున్నా ఎందుకు బిజెపి నాయకులు మాట్లాడ్డం లేదుని ప్రశ్నించారు.  మొన్నటి వరకు మోడీ కేసీఆర్ కలిసి దోచుకుంటే.. ఇవ్వాలా విడిపోయి దోచుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. పారదర్శకంగా టెండర్లు పిలవడానికి కేంద్రం ముందుకొస్తుందా లేదా అని నిలదీశారు. 

బీజేపీ మిత్రపక్షాలను కేసీఆర్ ఎందుకు కలవరు ? 

సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ .. బిజెపి ని ఎదురు లేని శక్తిగా మారడానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలను కలుస్తున్నారు కేసీఆరని రేవంత్ విశఅలేషించారు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై, ఇరిగేషన్ ప్రాజెక్టుల పై  మాట్లాడుకున్నాం అని శరద్ పవర్, సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎంపీ సుప్రియ సూలే.. ట్వీట్ చేశారని.. కానీ కేసీఆర్ అండ్ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. వేరే రకంగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.  ఇప్పటి వరకు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. కేసీఆర్.. జగన్, కేజ్రీవాల్, ఇతర నేతలను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. 

జగ్గారెడ్డి, వీహెచ్‌కు అండగా ఉంటాం !

పార్టీలోని అంతర్గత సమస్యలపై రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. జగ్గారెడ్డి, వీహెచ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం విషయంలో వారికి అండగా ఉంటామన్నారు. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తమ పార్టీలోని వివాదం కుటుంబసభ్యుల మధ్య పంచాయతీ లాంటిదని సమసిపోతుందన్నారు. గతంలో వారిపై సోషల్ మడియా పోస్టులు పెట్టిన వారు కౌశిక్ రెడ్డి అనుచరులని తేలిందన్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Telangana New Governor : గవర్నర్ మార్పు వెనుక బీజేపీ పెద్దల పక్కా వ్యూహం - ఇక రాజ్‌భవన్ వర్సెస్ ప్రజాభవన్ తప్పదా ?
గవర్నర్ మార్పు వెనుక బీజేపీ పెద్దల పక్కా వ్యూహం - ఇక రాజ్‌భవన్ వర్సెస్ ప్రజాభవన్ తప్పదా ?
TDP problem Kolikapudi: అదేపనిగా కెలికేస్తున్న కొలికపూడి - చర్యలు తీసుకోలేకపోతున్న టీడీపీ హైకమాండ్- సమస్య పరిష్కారం ఎలా?
అదేపనిగా కెలికేస్తున్న కొలికపూడి - చర్యలు తీసుకోలేకపోతున్న టీడీపీ హైకమాండ్- సమస్య పరిష్కారం ఎలా?
New Governor of Telangana: కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget