అన్వేషించండి

AP CM Jagan : కాబోయే మాజీలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్- ఇక వాళ్లకు 700 రోజులు అదే పని

రాజీనామా చేసిన మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇకపై పార్టీకి పూర్తి స్థాయి సేవలు అందించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి భేటీ చాలా ఆసక్తిగా సాగినట్టు తెలుస్తోంది. ఆఖరి సమావేశానికి మంత్రులు తమ రాజీనామా లేఖలతో వచ్చారు. వాళ్లందరికీ స్పెషల్‌ లంచ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంతా సరదాగా గడిపారు. 

చాలా బాగా పని చేశారు

మంత్రి మండలి భేటీ ప్రారంభమైన తర్వాత జగన్ మాట్లాడుతూ నేతలకు హితబోధ చేశారు. మాజీలు అవుతున్నామనే భావన వద్దని సూచించారు. సుమారు వెయ్యి రోజులు అంతా కలిసి పని చేశామని మంచి పేరు తెచ్చుకున్నరని కితాబిచ్చారు జగన్. 

జిల్లా బోర్డులు ఏర్పాటు

ప్రోటోకాల్ లేదన్న అసంతృప్తి వద్దన్న సీఎం.. అవసరమైతే జిల్లా డెవలప్‌మెంట్‌ బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ప్రోటోకాల్ సమస్యే ఉత్పన్నం కాదన్నారు. మంత్రిపదవులు పోవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. వారితో సీఎం జగన్‌ మాట్లాడి భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

టార్గెట్ చంద్రబాబు

ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్లను పార్టీ కోసం వాడుకుంటామన్నారు సీఎం జగన్. పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మరోసారి పార్టీని గెలిపించే బాధ్యత వాళ్లకు అప్పగించారు. చంద్రబాబును మళ్లీ ఓడించాలని మాజీలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. మరోసారి చంద్రబాబు ఓడిపోతే ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉండదని అభిప్రాయపడ్డారు. మిగిలిన 700 రోజులు పార్టీ కోసం పని చేయాలని సూచించారు జగన్. 

ఆ నలుగురు ఏం చర్చించారు

మంత్రివర్గం భేటీ తర్వాత బొత్స ఛాంబర్‌లో నలుగురు మంత్రులు  స్పెషల్‌గా భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశానికి తానేటి వనిత, కన్నబాబు, అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. వాళ్లు ఏం చర్చించారు అనేది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్ కు లేఖలు అందజేశారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ చివరి సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ సమావేశంలో మిల్లెట్‌ మిషన్‌ పాలసీ, డిగ్రీ కళాశాలల్లో 574 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ వంటి తదితర ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చివరి కేబినెట్‌ భేటీలో కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదించింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి కేబినెట్ అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది. విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ తో సహా కేబినెట్‌ మంత్రులు అభినందించారు. మంత్రుల్లో ఐదు, ఆరుగురికి తిరిగి అవకాశం లభించే అవకాశం ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు.

ఈ రాత్రికే రాజీనామాలు ఆమోదం 

మంత్రులు రాజీనామా లేఖలను కాసేపట్లో జీఏడీ అధికారుల ద్వారా గవర్నర్ కార్యాలయానికి పంపనున్నారు. ఈ రాత్రికే రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. కేబినెట్ చివరి సమావేశం కావడంతో కీలక అంశాలను ఆమోదించారు. 

రాజీనామా చేసిన మంత్రులు వీళ్లే

  1. కొడాలి నాని
  2. పేర్ని నాని
  3. ఆళ్ల నాని
  4. పుష్పశ్రీవాణి
  5. నారాయణ స్వామి
  6. సీదిరి అప్పలరాజు
  7. బొత్స సత్యనారాయణ
  8. ధర్మాన కృష్ణదాస్
  9. అవంతి శ్రీనివాస్‌
  10. కన్నబాబు
  11. వెల్లంపల్లి శ్రీనివాస్
  12. తానేటి వనిత
  13. మేకతోటి సుచరిత
  14. చెల్లుబోయిన గోపాల కృష్ణ
  15. రంగనాథ్ రాజు 
  16. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  17. ఆదిమూలపు సురేష్
  18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి 
  19. అనిల్‌ కుమార్ యాదవ్
  20. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 
  21. గుమ్మనూరు జయరాం
  22. అంజాద్‌ బాషా షేక్‌
  23. విశ్వరూప్‌ పినిపే
  24. శంకర్‌ నారాయణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
iphone 17e Price: పాత ఐఫోన్ ధరకే ఆపిల్ ఐఫోన్ 17e తో సంచలనం! సరికొత్త ప్రో మోడల్ ఫీచర్లు ఇవే
పాత ఐఫోన్ ధరకే ఆపిల్ ఐఫోన్ 17e తో సంచలనం! సరికొత్త ప్రో మోడల్ ఫీచర్లు ఇవే
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
Embed widget