By: ABP Desam | Updated at : 07 Apr 2022 06:16 PM (IST)
మాజీ మంత్రులకు జగన్ టార్గెట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి భేటీ చాలా ఆసక్తిగా సాగినట్టు తెలుస్తోంది. ఆఖరి సమావేశానికి మంత్రులు తమ రాజీనామా లేఖలతో వచ్చారు. వాళ్లందరికీ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంతా సరదాగా గడిపారు.
చాలా బాగా పని చేశారు
మంత్రి మండలి భేటీ ప్రారంభమైన తర్వాత జగన్ మాట్లాడుతూ నేతలకు హితబోధ చేశారు. మాజీలు అవుతున్నామనే భావన వద్దని సూచించారు. సుమారు వెయ్యి రోజులు అంతా కలిసి పని చేశామని మంచి పేరు తెచ్చుకున్నరని కితాబిచ్చారు జగన్.
జిల్లా బోర్డులు ఏర్పాటు
ప్రోటోకాల్ లేదన్న అసంతృప్తి వద్దన్న సీఎం.. అవసరమైతే జిల్లా డెవలప్మెంట్ బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ప్రోటోకాల్ సమస్యే ఉత్పన్నం కాదన్నారు. మంత్రిపదవులు పోవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. వారితో సీఎం జగన్ మాట్లాడి భవిష్యత్లో మంచి అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టార్గెట్ చంద్రబాబు
ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్లను పార్టీ కోసం వాడుకుంటామన్నారు సీఎం జగన్. పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మరోసారి పార్టీని గెలిపించే బాధ్యత వాళ్లకు అప్పగించారు. చంద్రబాబును మళ్లీ ఓడించాలని మాజీలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. మరోసారి చంద్రబాబు ఓడిపోతే ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉండదని అభిప్రాయపడ్డారు. మిగిలిన 700 రోజులు పార్టీ కోసం పని చేయాలని సూచించారు జగన్.
ఆ నలుగురు ఏం చర్చించారు
మంత్రివర్గం భేటీ తర్వాత బొత్స ఛాంబర్లో నలుగురు మంత్రులు స్పెషల్గా భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశానికి తానేటి వనిత, కన్నబాబు, అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. వాళ్లు ఏం చర్చించారు అనేది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్ కు లేఖలు అందజేశారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ చివరి సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఈ సమావేశంలో మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కళాశాలల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి తదితర ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చివరి కేబినెట్ భేటీలో కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదించింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్కి కేబినెట్ అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది. విజయ్కుమార్ను సీఎం జగన్ తో సహా కేబినెట్ మంత్రులు అభినందించారు. మంత్రుల్లో ఐదు, ఆరుగురికి తిరిగి అవకాశం లభించే అవకాశం ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు.
ఈ రాత్రికే రాజీనామాలు ఆమోదం
మంత్రులు రాజీనామా లేఖలను కాసేపట్లో జీఏడీ అధికారుల ద్వారా గవర్నర్ కార్యాలయానికి పంపనున్నారు. ఈ రాత్రికే రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. కేబినెట్ చివరి సమావేశం కావడంతో కీలక అంశాలను ఆమోదించారు.
రాజీనామా చేసిన మంత్రులు వీళ్లే
Chandrababu case : రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ - చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా
Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
Telangana Elections 2023 : కామారెడ్డి రైతుల భూములు కాపాడటానికే కేసీఆర్పై పోటీ - గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి
KCR Election Campaign: హైదరాబాద్ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం- నేడు గజ్వేల్లో ఫైనల్ మీటింగ్
Telangana Elections 2023 : బీఆర్ఎస్కు గండంగా మారిన మార్పు మౌత్ టాక్ - కౌంటర్లు ఫలితాలను ఇస్తున్నాయా ?
Koushik Reddy: గెలిస్తే విజయ్ యాత్రతో వస్తా లేకుంటే శవయాత్రకు రండీ- బీఆర్ఎస్ అభ్యర్థి ఎమోషనల్ స్పీచ్
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్
Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?
/body>