అన్వేషించండి

Bharat jodo Yatra : మనందరం భారత్‌ను ఏకం చేద్దాం - పాదయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ పిలుపు

కన్యాకుమారి నుంచి భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. మనమందరం కలిసి భారత్‌ను ఏకం చేద్దామని పిలుపునిచ్చారు.

Bharat jodo Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఎంలు  పాల్గొన్నారు.  మధ్యాహ్నం 3.05 గంటలకు తీరువల్లూర్ మెమోరియల్ ను, 3.25గంటలకు కామరాజ్ మెమోరియల్‌ను రాహుల్ సందర్శించారు. సాయంత్రం 4.10గంటలకు మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో  రాహుల్ గాంధీకి తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ జాతీయ జెండాను అందించారు. దాంతో  రాహుల్ పాదయాత్ర అధికారికంగా ప్రారంభమయింది.

యాత్ర ప్రారంభించిన తర్వాత  మహాత్మా గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు జరిగే మార్చ్ లో రాహుల్ పాల్గొన్నారు. తర్వాత ప్రసంగించారు. ‘మనమందరం భారత్ ను ఏకం చేద్దాం’ అనే నినాదంతో భారత్ జోడో యాత్ర ముందుకు సాగుతుందని రాహుల్ తెలిపారు.   ఈ యాత్రలో భాగంగా  ప్రతీ రోజూ ఉదయం 7 గంటల నుంచి రాహుల్ గాంధీ నడకను మొదలుపెట్టనున్నారు. రోజుకు సగటున 25 కిలోమీటర్లు రాహుల్ నడవనున్నారు. ప్రతిరోజూ రెండు విడతల్లో యాత్ర జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో 4 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 117 మంది నేతలు రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. 

 
కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను కదలించేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 150 రోజుల (5 నెలలు)  పాటు 3,570 కిలోమీటర్ల మేర.. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొనే వారిలో రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ కురవృద్ధుడు విజేంద్ర సింగ్ మహల్వాట్ కీలక పాత్ర పోషించ నున్నారు. వీరిలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అజమ్ జోంబ్లా, బెమ్ బాయ్ లాంటి యంగెస్ట్‌ లీడర్స్ కూడా ఉన్నారు. కన్హయ్యా కుమార్, పవన్ ఖేరా కూడా యాత్రలో పాల్గొననున్నారు.  

భారత్ జోడో యాత్ర రూట్‌ మ్యాప్ ఆధారంగా చూస్తే..మొత్తం 20 కీలక ప్రాంతాల మీదుగా సాగనుంది. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయ్‌చూర్, వికారాబాద్, నాందేడ్, జలగావ్, ఇండోర్, కోటా, దౌసా, అల్వార్, బులంద్‌షర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్ము, శ్రీనగర్ వరకూ సాగుతుంది. ఏపీ, తెలంగాణలోనూ రాహుల్ పాదయాత్ర సాగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Who is Abhinandan Singh: రంజీ కూడా ఆడలేదు, నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం.. ఎవరీ అభినందన్ సింగ్
రంజీ కూడా ఆడలేదు, నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం.. ఎవరీ అభినందన్ సింగ్
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
IPL 2026 RCB vs SRH: ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !
ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RCB VS SRH Highlights: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Embed widget