అన్వేషించండి

Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు

Maharastra Elections: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. నాందేడ్ ప్రాంతంలో మూడు సభల్లో పాల్గొననున్నట్లుగా అక్కడి ఎన్నికల ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

Pawan Kalyan will campaign in Nanded for two days: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సందర్భంగా  భారతీయ జనతా పార్టీ తరపున ఎన్డీఏ నేతలు రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర వెళ్తున్నారు. శని, ఆదివారాల్లో పవన్ కల్యాణ్ నాందేడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 

మహారాష్ట్రలో తెలుగు వారు ఉన్న పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం సాగనుంది. నాందెడ్‌లో తెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అందుకే వీరిని ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ నాందేడ్ ప్రాంతంలో మొత్తం మూడు బహిరంగసభల్లో పాల్గొంటారు. ఇతర ప్రాంతాల్లోనూ వారి పర్యటన ఉంటుంది.  

Also Read: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?

పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి సత్యకుమార్ కూడా ఈ ప్రచారంలో పాల్గొంటారు. నాందేడ్‌కు బీజేపీ తరపున ఎన్నికల ఇంచార్జ్‌గా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పవన ప్రచారం అంశాన్ని సోషల్ మీడియాలో ధృవీకరించారు. 

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గత నెల రోజులుగా నాందేడ్‌లోనే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ ముఖ్య నేతలు అంతా ఇప్పటికే ఒక విడత నాందేడ్‌లో ప్రచారం పూర్తి చేశారు. ప్రచార గడువు పద్దెనిమిదో తేదీన సాయంత్రం ముగియనుంది. సమయం ముగియడంతో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించడానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. 

Also Read:   ఫైనల్ స్టేజ్‌కు మహారాష్ట్ర ఎన్నికల వార్ - తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ బలగం !

పవన్ కల్యాణ్, సత్యకుమార్ నాందేడ్ ప్రాంతంలో మూడు సభల్లో పాల్గొంటారు. ఇతర ప్రాంతాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తారు. పవన్, సత్యకుమార్  ప్రచారం వల్ల బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగుపడి అభ్యర్థుల మెజార్టీలు భారీగా పెరుగుతాయని ఎన్నికల ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.  నాందేడ్ ప్రాంత అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ కూటమి చేసిన కృషి ఇక్కడి ప్రజలు మరోసారి బీజేపీ కూటమిని ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.  నాందేడ్ ఎన్నికల ఇంచార్జిగా బీజేపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించిన తర్వాత నెల రోజులుగా అక్కడ ప్రచారాన్ని సమన్వయం చేసుకుంటున్నానని బీజేపీ విజయం ఎలాంటి డౌట్ లేదని ఆయన అంటున్నారు.                        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Delhi Tour: ప్రధాని మోదీ ఏడు సూత్రాలు ఒక జాతీయ మిషన్ .. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రధాని మోదీ ఏడు సూత్రాలు ఒక జాతీయ మిషన్ .. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Maleesha Kharwa Success Story: ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
Vijay Family: పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా  దూరం పెట్టారా...?
పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా  దూరం పెట్టారా...?
AIADMK Leadership Crisis 2026: తమిళనాట సంచలనం - అన్నాడీఎంకేలో చీలిక - పళనిస్వామికి 17.. వేలుమణికి 30 !
తమిళనాట సంచలనం - అన్నాడీఎంకేలో చీలిక - పళనిస్వామికి 17.. వేలుమణికి 30

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget