అన్వేషించండి

Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు

Maharastra Elections: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. నాందేడ్ ప్రాంతంలో మూడు సభల్లో పాల్గొననున్నట్లుగా అక్కడి ఎన్నికల ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

Pawan Kalyan will campaign in Nanded for two days: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సందర్భంగా  భారతీయ జనతా పార్టీ తరపున ఎన్డీఏ నేతలు రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర వెళ్తున్నారు. శని, ఆదివారాల్లో పవన్ కల్యాణ్ నాందేడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 

మహారాష్ట్రలో తెలుగు వారు ఉన్న పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం సాగనుంది. నాందెడ్‌లో తెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అందుకే వీరిని ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ నాందేడ్ ప్రాంతంలో మొత్తం మూడు బహిరంగసభల్లో పాల్గొంటారు. ఇతర ప్రాంతాల్లోనూ వారి పర్యటన ఉంటుంది.  

Also Read: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?

పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి సత్యకుమార్ కూడా ఈ ప్రచారంలో పాల్గొంటారు. నాందేడ్‌కు బీజేపీ తరపున ఎన్నికల ఇంచార్జ్‌గా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పవన ప్రచారం అంశాన్ని సోషల్ మీడియాలో ధృవీకరించారు. 

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గత నెల రోజులుగా నాందేడ్‌లోనే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ ముఖ్య నేతలు అంతా ఇప్పటికే ఒక విడత నాందేడ్‌లో ప్రచారం పూర్తి చేశారు. ప్రచార గడువు పద్దెనిమిదో తేదీన సాయంత్రం ముగియనుంది. సమయం ముగియడంతో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించడానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. 

Also Read:   ఫైనల్ స్టేజ్‌కు మహారాష్ట్ర ఎన్నికల వార్ - తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ బలగం !

పవన్ కల్యాణ్, సత్యకుమార్ నాందేడ్ ప్రాంతంలో మూడు సభల్లో పాల్గొంటారు. ఇతర ప్రాంతాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తారు. పవన్, సత్యకుమార్  ప్రచారం వల్ల బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగుపడి అభ్యర్థుల మెజార్టీలు భారీగా పెరుగుతాయని ఎన్నికల ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.  నాందేడ్ ప్రాంత అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ కూటమి చేసిన కృషి ఇక్కడి ప్రజలు మరోసారి బీజేపీ కూటమిని ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.  నాందేడ్ ఎన్నికల ఇంచార్జిగా బీజేపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించిన తర్వాత నెల రోజులుగా అక్కడ ప్రచారాన్ని సమన్వయం చేసుకుంటున్నానని బీజేపీ విజయం ఎలాంటి డౌట్ లేదని ఆయన అంటున్నారు.                        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget