అన్వేషించండి

Modi Absent : లోక్‌సభకు ఒక్క రోజే హాజరైన ప్రధాని మోడీ.. ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు

లోక్‌సభకు ప్రధాని మోడీ ఒక్కరోజే హాజరయ్యారని..తర్వాత ఎప్పటికప్పుడు డుమ్మా కొడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు పోస్టర్లు ప్రదర్శించారు. తేదీల వారీగా ఆయన హాజరైన...హాజరు కాని తేదీలను ప్రదర్శించారు.

 

భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైరయ్యారు. సభకు ఎక్కువగా హాజరు కావడం లేదని.. వారు మారకపోతే.. తాము మార్చేస్తామని ఆయన సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎంపీలందరూ కంగారు పడ్డారు. అది వేరే విషయం.... మరి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభకు  హాజరవుతున్నారా..?.  ఈ డౌట్ బీజేపీ ఎంపీలకు రాదు.. వచ్చినా మనసులోనే పెట్టుకోవాలి. బయటకు చెప్పకూడదు. అలా చెబితే తర్వాత ఏం జరుగుతుందో వారికి తెలుసు. అయితే డౌట్ కాంగ్రెస్ ఎంపీలకు వస్తే వాళ్లకు అడ్డేం ఉండదు. సమాధానం వెదుక్కోవచ్చు. అలా వెదుక్కున్నారు కూడా. దాన్నే బయట పెట్టారు. 

Also Read: లోక్‌సభ ముందుకు ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లు. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఒక్క రోజు అంటే ఒక్కరోజు.. అదీ కూడా ప్రారంభం రోజున మాత్రమే లోక్‌సభకు  హాజరయ్యారు. తర్వాత పార్లమెంట్ కి రాలేదని.. కాంగ్రెస్ ఎంపీలు బయట పెట్టారు. ఎంపీలు మాణిగం ఠాగూర్, విజయ్ వసంత్ పోస్టర్లు తయారు చేసి పార్లమెంట్‌లో  ప్రదర్శించారు. నవంబర్ 29న మాత్రమే మోడీ హాజరయ్యారని..తర్వాత ఒక్క సారి కూడా లోక్‌సభకు హాజరు కాలేదని.. వారు పోస్టర్లు వేసి ప్రదర్శించారు. విశేషం ఏమిటంటే ఈ మధ్యలో ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు కానీ లోక్‌సభకు హాజరు కాలేదు. 

Also Read: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ

ప్రధానమంత్రి ఇటీవలి కాలంలో  చాలా బిజీగా ఉంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆయా రాష్ట్రాల్లో అభివృద్ది కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. పలు మార్లు ఉత్తరప్రదేశ్ పర్యటనకు కూడా వెళ్లివచ్చారు.  అయితే లోక్‌సభకు మాత్రం హాజరు కాలేదు. లోక్‌సభలో జీరో అవర్ తప్ప  మొదట్లో పెద్దగా చర్చలు జరగలేదు. టీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో వాయిదాలు పడ్డాయి. తర్వాత టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!

లోక్‌సభకు  ఎంపీలు ఖచ్చితంగా హాజరు కావాలని బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. పార్లమెంట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని చెబుతూ ఉంటారు. అయితే స్వయంగా సభా నాయకుడు అయిన ప్రధానమంత్రే లోక్‌సభకు రాకపోవడం కాంగ్రెస్ నేతలకు అస్త్రంగా మారింది. దాన్నే మాణిగం ఠాగూర్, విజయ్ వసంత్ హైలెట్ చేశారు.  

Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget