Opium: ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ
Opium Trade In India: ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్లో ఓపియం ప్రస్తావన ఉంది. అది ఇండియాకు ఎలా వచ్చింది? ఒకప్పుడు రక్తాలు పారించిన ఓపియంను ప్రస్తుతం ఎలా వాడుతున్నారు? అనేది తెలుసుకోండి.

- ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ లో నల్ల మందు (ఓపియం) ప్రాముఖ్యత చూపించారు.
- ఓపియం సాగు వెయ్యేళ్ల క్రితం భారతదేశంలో అరబ్బుల ద్వారా మొదలైంది.
- బ్రిటిషర్లు ఓపియం వ్యాపారాన్ని ఆధునీకరించి, చైనాపై యుద్ధాలు చేశారు.
- స్వాతంత్ర్యం తర్వాత ఓపియం వాడకం వైద్య అవసరాలకు మాత్రమే పరిమితమైంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన 'డ్రాగన్' గ్లింప్స్ చూశారా? అందులో ప్రశాంత్ నీల్ టేకింగ్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ & డైలాగ్ టాప్ క్లాస్ అంటున్నారు ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్. సినిమాలో కోర్ పాయింట్ డ్రగ్స్ అని అర్థం అవుతోంది. 'ఓపియమ్' (నల్ల మందు ) గురించి బ్రిటీషర్స్ ఇండియాను ఆక్రమించుకున్నారని గ్లింప్స్ (Dragon Glimpse)లో చూపించారు. దాంతో ఆ నల్ల మందు... మత్తు మందుకు చరిత్ర ఉందని అర్థం అవుతోంది. అసలు ఓపియం (Opium) అంటే ఏమిటి? దాని కోసం బ్రిటిషర్లు ఎందుకు అంత పట్టు పట్టారు? అనేది తెలుసుకోండి.
వెయ్యేళ్ల క్రితమే ఇండియాలో ఓపియం తయారీ
Opium Trade History In India: ఓపియం అనేది ఒక మొక్క నుండి తయారవుతుంది. పదో శతాబ్దంలో ఆ మొక్క (మత్తు మందు) ఇండియాలో ఎంటర్ అయింది. అప్పట్లో అరబ్ వర్తకుల ద్వారా జరిగే వ్యాపారాల నుంచి ఈ పంట ఇండియాలోకి వచ్చినట్టు ప్రాచీన గ్రంథం 'ధన్వంతరి నిఘంటువు' చెబుతోంది. మన దేశంలో దీని సాగుకు అనువైన వాతావరణం ఉండటంతో ఓపియంలోని అనేక వెరైటీలను పండించడం మొదలు పెట్టారు. పదిహేనవ శతాబ్దంలో మొఘలుల పాలన మొదలైన తర్వాత ఓపియం సాగును వాళ్ళు తార స్థాయికి తీసుకెళ్లారు. రాజ్యంలోని కీలక ప్రాంతాల్లో సైనిక సంరక్షణ మధ్యలో వీటిని పెంచడం మొదలుపెట్టి వ్యాపారం చేసేవారు. దీనిపై విధించే టాక్సులు సామ్రాజ్యానికి చాలా రాబడి తెచ్చేవి. 18వ శతాబ్దంలో బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఆధునిక పద్ధతుల్లో ఓపియం వ్యాపారాన్ని మరింత విస్తరించారు.
యూరోపియన్ దేశాలకు ఇండియా నుంచి నల్ల మందు ఎగుమతి అయ్యేది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1757లో పూర్తిగా నల్ల మందు వ్యాపారాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో రైతులు దీని పండించాలనేది కూడా కంపెనీయే డిసైడ్ చేసేది. ఇక్కడ పండించిన నల్ల మందును చైనాలోకి స్మగుల్ చేయడానికి ప్రయత్నించేది. దాంతో చైనా, బ్రిటిష్ ఇండియా మధ్య 1839 - 42 కాలంలో రెండు యుద్ధాలు జరిగాయి. వాటిని ఓపియం వార్స్ (నల్ల మందు యుద్దాలు Opium Wars) అంటారు. బ్రిటిష్ ఇండియా మొత్తం ఆదాయంలో 15 శాతం నల్ల మందు వ్యాపారం నుంచి వచ్చేదని అప్పటి అకౌంట్స్ చెబుతున్నాయి.
స్వాతంత్రం తర్వాత నల్లమందుపై నిషేధం...
కేవలం మెడికల్ అవసరాలకు మాత్రమే వాడకం
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నల్లమందు పంటపై నిషేధం విధించింది. అయితే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ సంరక్షణలో ఈ పంటను పండిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఓపియాన్ని ఫార్మాసూటికల్ రంగంలో వాడుతున్నారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందులు దీని నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ద్వారా చట్టబద్ధంగా ఓపియంను తయారు చేసే ఏకైక దేశం ఇండియా మాత్రమే. సహజ సిద్ధంగా పండించే ఓపియంను ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ వద్ద కల గవర్నమెంట్ ఓపియం అండ్ ఆల్కలాయిడ్ వర్క్స్ ప్రాసెసింగ్ యూనిట్... అలానే మధ్య ప్రదేశ్ లోని నీముచ్ ప్లాంట్లలో అత్యంత సంరక్షణ మధ్య ప్రాసెస్ చేస్తారు. మార్ఫిన్, దగ్గుమందు లాంటి సిరప్ తయారీకి ఓపియంను వినియోగిస్తారు.
ఒకప్పుడు చరిత్రలో రక్తాలు పారించిన ఓపియం ప్రస్తుతం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి పరిమితమైంది. ఈ పాత కథను తిరిగి తెరపైకి తనదైన తీసుకొస్తున్నారు ప్రశాంత్ నీల్. అది ఈ రోజు విడుదలైన గ్లింప్స్తో స్పష్టమైంది. సినిమా విడుదలైన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
ట్రెండింగ్ వార్తలు




















