అన్వేషించండి

Tourism Package : కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ యాత్ర పేరుతో IRCTC ప్రత్యేక ప్యాకేజీ.. ఖర్చు, పూర్తి వివరాలివే

IRCTC Tour : ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పథకంపై ఓ ప్యాకేజీ అందిస్తోంది. వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ చూసేందుకు వీలు కలిపిస్తుంది. దీని గురించిన పూర్తి డిటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Bharat Gaurav Kashi Darshana IRCTC Package : భారతీయ రైల్వేలకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పథకం కింద ఓ ప్రత్యేక తీర్థయాత్రను ప్రారంభించింది. 'కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శనం(Karnataka Bharat Gaurav Kashi Darshana)' పేరుతో ఈ ప్యాకేజీని ప్రారంభించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సబ్సీడి కూడా అందిస్తుంది. అయితే ఇది కేవలం కర్ణాటక వాసులకేనా? ఎవరైనా వెళ్లొచ్చా? ప్యాకేజ్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కర్ణాటక ప్రభుత్వం.. IRCTC లిమిటెడ్‌తో కలిసి 09 రోజుల ట్రావెల్​లో భాగంగా వారణాసి, గయా, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ పవిత్ర స్థలాలను కవర్ చేస్తుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా.. “కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన” పేరుతో ఈ తీర్థయాత్రను అందిస్తున్నారు. 

తీర్థయాత్ర ప్రారంభ తేదీ.. 

కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన తీర్థయాత్ర ఆగస్టు 11వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 8 రాత్రుళ్లు, 9 రోజులు ట్రావెల్. ఈ ప్యాకేజ్ ద్వారా ప్రతి వ్యక్తికి 22,500 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ కర్ణాటక ప్రభుత్వం టూర్​ ధరపై 7,500 సబ్సీడి కల్పించింది. అయితే మీరు కర్ణాటక వాసులు కాకున్నా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా పూర్తి ప్యాకేజీ అంటే 22,500 చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. 

ప్యాకేజ్​లో కవర్ చేసే ప్రదేశాలు ఇవే.. 

బెంగళూరు నుంచి వారణాసి.. అక్కడి నుంచి అయోధ్య, తర్వాత గయా, అనంతరం ప్రయాగ్​రాజ్ అటునుంచి బెంగళూరు. ఇలా రూట్​ మ్యాప్ ఉంటుంది. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తే.. అక్కడ తులసి మానస దేవాలయం, సంకట్ మోచన అందించే హనుమాన్ దేవాలయం, కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఆరతిని చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే పవిత్ర స్నానం, గంగా హారతి అనేవి అక్కడ నీటి స్థాయి, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అనంతరం అయోధ్యకి తీసుకునివెళ్తారు. అక్కడ రామజన్మభూమి ఆలయాన్ని చూడవచ్చు. తర్వాత గయ.. అక్కడ విష్ణుపాద ఆలయం, మహాబోధి ఆలయం చూడొచ్చు. చివరిగా ప్రయాగ్​రాజ్ చేరుకుని హనుమాన్ ఆలయం, గంగానదిలో పవిత్ర స్నానం చేయవచ్చు. ఇది కూడా నీటిమట్టంపై ఆధారపడి ఉంటుంది. 

ప్యాకేజ్ బెనిఫిట్స్

ఈ ప్యాకేజ్​లో భాగంగా భోజనం, టీలు, హోటల్స్, స్టేయింగ్ ఇవన్నీ కవర్ అవుతాయి. 3AC క్లాస్​లో రైల్వే ప్రయాణం ఉంటుంది. నాన్ ఏసీ గదుల్లో హోటల్స్​లో స్టేయింగ్ ఇస్తారు. బ్రేక్​ఫాస్ట్, భోజనం, డిన్నర్ అన్ని అందిస్తారు. శాఖాహారం మాత్రమే ఉంటుంది. నాన్​-ఏసీ బస్సులలో సందర్శనా స్థలాలకు తీసుకెళ్తారు. ప్రయాణీకులకు ప్రయాణ బీమా కూడా ఉంటుంది.

అదనపు ఖర్చులు

బోటింగ్ వంటివి చేయాలనుకుంటే ఇవి ప్యాకేజ్​లో కవర్ అవ్వవు. అలాగే ముందుగానే మెనూ ఫిక్స్ చేసేస్తారు కాబట్టి మీరు ఆర్డర్ చేసే సౌలభ్యం ఉండకపోవచ్చు. రూమ్ సర్వీసింగ్​కు ఛార్జ్ చేస్తారు. దర్శన ఖర్చు, ప్రవేశం, స్థానిక గౌడ్స్​ కావాలనుకున్నా అది ప్యాకేజ్​లో కవర్ అవ్వదు. కాబట్టి మీ సౌలభ్యం కోసం ఏమైనా సేవలు తీసుకుంటే వాటికి మీరు ఎక్స్​ట్రా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. 

మరిన్ని డిటైల్స్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SZKBG37 ఈ పేజ్ని సందర్శించవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karnataka Politics: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. రేపు సాయంత్రం సీఎల్పీ మీటింగ్
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. రేపు సాయంత్రం సీఎల్పీ మీటింగ్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Japan bans Indian mangoes: భారతీయ మామిడిపై జపాన్ బ్యాన్ - 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సీన్.. ఎగుమతిదారుల్లో ఆందోళన!
భారతీయ మామిడిపై జపాన్ బ్యాన్ - 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సీన్.. ఎగుమతిదారుల్లో ఆందోళన!
Siddaramaiah resigns Karnataka CM 2026: కర్ణాటకలో ముగిసిన సిద్ధరామయ్య శకం - సీఎం పదవికి రాజీనామా సమర్పణ.. డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్!
కర్ణాటకలో ముగిసిన సిద్ధరామయ్య శకం - సీఎం పదవికి రాజీనామా సమర్పణ.. డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
Embed widget