అన్వేషించండి

Tourism Package : కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ యాత్ర పేరుతో IRCTC ప్రత్యేక ప్యాకేజీ.. ఖర్చు, పూర్తి వివరాలివే

IRCTC Tour : ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పథకంపై ఓ ప్యాకేజీ అందిస్తోంది. వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ చూసేందుకు వీలు కలిపిస్తుంది. దీని గురించిన పూర్తి డిటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Bharat Gaurav Kashi Darshana IRCTC Package : భారతీయ రైల్వేలకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పథకం కింద ఓ ప్రత్యేక తీర్థయాత్రను ప్రారంభించింది. 'కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శనం(Karnataka Bharat Gaurav Kashi Darshana)' పేరుతో ఈ ప్యాకేజీని ప్రారంభించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సబ్సీడి కూడా అందిస్తుంది. అయితే ఇది కేవలం కర్ణాటక వాసులకేనా? ఎవరైనా వెళ్లొచ్చా? ప్యాకేజ్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కర్ణాటక ప్రభుత్వం.. IRCTC లిమిటెడ్‌తో కలిసి 09 రోజుల ట్రావెల్​లో భాగంగా వారణాసి, గయా, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ పవిత్ర స్థలాలను కవర్ చేస్తుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా.. “కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన” పేరుతో ఈ తీర్థయాత్రను అందిస్తున్నారు. 

తీర్థయాత్ర ప్రారంభ తేదీ.. 

కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన తీర్థయాత్ర ఆగస్టు 11వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 8 రాత్రుళ్లు, 9 రోజులు ట్రావెల్. ఈ ప్యాకేజ్ ద్వారా ప్రతి వ్యక్తికి 22,500 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ కర్ణాటక ప్రభుత్వం టూర్​ ధరపై 7,500 సబ్సీడి కల్పించింది. అయితే మీరు కర్ణాటక వాసులు కాకున్నా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా పూర్తి ప్యాకేజీ అంటే 22,500 చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. 

ప్యాకేజ్​లో కవర్ చేసే ప్రదేశాలు ఇవే.. 

బెంగళూరు నుంచి వారణాసి.. అక్కడి నుంచి అయోధ్య, తర్వాత గయా, అనంతరం ప్రయాగ్​రాజ్ అటునుంచి బెంగళూరు. ఇలా రూట్​ మ్యాప్ ఉంటుంది. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తే.. అక్కడ తులసి మానస దేవాలయం, సంకట్ మోచన అందించే హనుమాన్ దేవాలయం, కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఆరతిని చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే పవిత్ర స్నానం, గంగా హారతి అనేవి అక్కడ నీటి స్థాయి, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అనంతరం అయోధ్యకి తీసుకునివెళ్తారు. అక్కడ రామజన్మభూమి ఆలయాన్ని చూడవచ్చు. తర్వాత గయ.. అక్కడ విష్ణుపాద ఆలయం, మహాబోధి ఆలయం చూడొచ్చు. చివరిగా ప్రయాగ్​రాజ్ చేరుకుని హనుమాన్ ఆలయం, గంగానదిలో పవిత్ర స్నానం చేయవచ్చు. ఇది కూడా నీటిమట్టంపై ఆధారపడి ఉంటుంది. 

ప్యాకేజ్ బెనిఫిట్స్

ఈ ప్యాకేజ్​లో భాగంగా భోజనం, టీలు, హోటల్స్, స్టేయింగ్ ఇవన్నీ కవర్ అవుతాయి. 3AC క్లాస్​లో రైల్వే ప్రయాణం ఉంటుంది. నాన్ ఏసీ గదుల్లో హోటల్స్​లో స్టేయింగ్ ఇస్తారు. బ్రేక్​ఫాస్ట్, భోజనం, డిన్నర్ అన్ని అందిస్తారు. శాఖాహారం మాత్రమే ఉంటుంది. నాన్​-ఏసీ బస్సులలో సందర్శనా స్థలాలకు తీసుకెళ్తారు. ప్రయాణీకులకు ప్రయాణ బీమా కూడా ఉంటుంది.

అదనపు ఖర్చులు

బోటింగ్ వంటివి చేయాలనుకుంటే ఇవి ప్యాకేజ్​లో కవర్ అవ్వవు. అలాగే ముందుగానే మెనూ ఫిక్స్ చేసేస్తారు కాబట్టి మీరు ఆర్డర్ చేసే సౌలభ్యం ఉండకపోవచ్చు. రూమ్ సర్వీసింగ్​కు ఛార్జ్ చేస్తారు. దర్శన ఖర్చు, ప్రవేశం, స్థానిక గౌడ్స్​ కావాలనుకున్నా అది ప్యాకేజ్​లో కవర్ అవ్వదు. కాబట్టి మీ సౌలభ్యం కోసం ఏమైనా సేవలు తీసుకుంటే వాటికి మీరు ఎక్స్​ట్రా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. 

మరిన్ని డిటైల్స్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SZKBG37 ఈ పేజ్ని సందర్శించవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget