అన్వేషించండి

Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే

Train Ticket Fare Hike | రైల్వే సబర్బన్ సేవలు, సీజన్ టిక్కెట్ల ధరలలో మార్పు లేదు. 215 కిమీ వరకు సెకండ్ క్లాస్ సాధారణ టిక్కెట్ ధరలో పెరుగుదల లేదు.

Indian Railway Fare Hike | భారతదేశంలో నేటి నుంచి రైల్వే టికెట్ల ధరల పెంపు అమలులోకి వస్తుంది. ఇటీవల రైల్వేశాఖ సుదూర ప్రయాణాలపై టికెట్ ఛార్జీలు పెంచడం తెలిసిందే. ఈ సవరించిన రైళ్ల ఛార్జీలు ఈరోజు (శుక్రవారం) అంటే డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని కోసం రైల్వే డిసెంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రయాణికుల సౌకర్యం, నిర్వహణకు ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యత లక్ష్యంతో ప్రయాణీకుల ఛార్జీలలో హేతుబద్ధీకరణను ప్రకటించినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో, పెరిగిన ఛార్జీలు ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్లకు కూడా వర్తిస్తాయా? డిసెంబర్ 26కు ముందు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు ప్రయాణ సమయంలో అదనంగా డబ్బు చెల్లించాలా అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వివరాలు తెలుసుకోండి. 

పెరిగిన ఛార్జీలు ఎప్పటి నుండి అమలులోకి వస్తాయి?

రైల్వేశాఖ సమాచారం ప్రకారం, ఇటీవల సవరించిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చేశాయి. ఇది ఈ తేదీ నుంచి బుక్ చేసుకున్న టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు డిసెంబర్ 26కు ముందు టిక్కెట్ బుక్ చేసుకున్నట్లయితే, ఆ తర్వాత తేదీలలో ప్రయాణించాల్సి వచ్చినా, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ కేటగిరీలలో ఛార్జీలు పెరగలేదు

సీజన్ టిక్కెట్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు చేయలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా, సెకండ్ క్లాస్ సాధారణంలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి సైతం ఎటువంటి ఛార్జీల పెరుగుదల లేదు.

దూరం ఆధారంగా అదనపు ఛార్జీలు

నాన్-ఏసీ సాధారణ రైళ్లలో పెరిగిన ఛార్జీలు దూరం ఆధారంగా వర్తిస్తాయి. ఉదాహరణకు, మీరు 216 కిమీ నుండి 750 కిమీ ప్రయాణానికి ₹5 పెరిగింది. 751 కిమీ నుండి 1250 కిమీ ప్రయాణానికి 10 రూపాయలు అదనంగా చెల్లించాలి. అదేవిధంగా, 1251 కిలోమీటర్ల నుంచి 1750 కిమీ ప్రయాణానికి 15 రూపాయలు, 1751 కిమీ నుండి 2250 కిమీ వరకు టిక్కెట్‌కు 20 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్ క్లాస్, జనరల్, ఫస్ట్ క్లాస్ ప్రయాణాలలో కిలోమీటరుకు 1 పైసా చొప్పున ఛార్జీలు పెరిగాయి.

రైళ్ల ప్రకారం ఛార్జీలు ఎంత పెరిగాయి?

రైల్వే ప్రకారం, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ,యు ఏసీ రెండూ (స్లీపర్, ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, ఏసీ 2-టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్) కిలోమీటరుకు 2 పైసలు ఛార్జీలు పెరిగాయి. ఉదాహరణకు, 500 కిమీ నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ ప్రయాణానికి ప్రయాణికులు సుమారు ₹10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన ఛార్జీలు రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, అంత్యోదయ, గతిమాన్, అమృత్ భారత్, గరీబ్ రథ్, యువ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ తో సహా ఇతర ప్రధాన రైళ్లకు సమానంగా వర్తిస్తాయి.

రైల్వే తెలిపిన సమాచారం 

అంతేకాకుండా రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ సర్ ఛార్జీలు, ఇతర సహాయక ఛార్జీలలో ఎటువంటి మార్పు చేయలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. జీఎస్టీ రేట్లు, ఛార్జీల రౌండ్-ఆఫ్ నియమాలు కూడా యథాతథంగా ఉంటాయి. నేటి (డిసెంబర్ 26) నుంచి స్టేషన్లలో ప్రదర్శించే ఛార్జీల జాబితా కూడా కొత్త ఛార్జీల ప్రకారం మాడిఫై చేయనున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget