అన్వేషించండి

Train Ticket News: 2027 నాటికి వెయిటింగ్ లిస్ట్ ఉండదట,రద్దీని తట్టుకునేందుకు రైల్వే కొత్త ప్లాన్

Confirmed Rail Tickets: 2027 నాటికి ప్రతీ ప్యాసింజర్‌కి టికెట్‌ కన్‌ఫమ్‌ అయ్యేలా రైల్వే ప్లాన్ చేస్తోంది.

Confirmed Rail Tickets: 


2027 నాటికి చాలా మార్పులు.. 

రైల్వే వ్యవస్థలో (Indian Railways News) ఎన్నో మార్పులు చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. అయినా డిమాండ్‌కి, అందుబాటులో ఉన్న రైళ్లకు పొంతన కుదరడం లేదు. పండగ వేళల్లో రైళ్లు తీవ్రమైన రద్దీతో నిండిపోతున్నాయి. ఇటీవల దీపావళి పండగకి రైళ్లు (Rush in Trains) కిటకిటలాడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టికెట్‌లు బుక్ చేసుకున్నప్పటికీ చాలా వరకూ కన్‌ఫమ్‌ (Confirmed Rail Tickets) కాలేదు. ఫలితంగా...ఇలా రైళ్లలోనూ ఫుట్‌బోర్డింగ్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు చాలా మంది. బిహార్‌లో ఓ 40 ఏళ్ల వ్యక్తి రైలు ఎక్కుతూ కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరింత సంచలనమైంది. ఈ సమస్యపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2027 నాటికి రైళ్ల సంఖ్య భారీగా పెంచాలని యోచిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ అనేదే లేకుండా అందరికీ టికెట్‌లు కన్‌ఫమ్ అయ్యేలా రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఏటా రైల్వే ట్రాక్‌లను విస్తరిస్తూ పోవాలని ప్లాన్ చేసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...ఏటా 4-5 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లను ఏర్పాటు చేయనుంది. 

నెట్‌వర్క్ విస్తరణ..

ప్రస్తుతానికి రోజూ దేశవ్యాప్తంగా 10,748 రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. ఈ సంఖ్యని 13 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే మూడు నాలుగేళ్లలో కనీసం 3 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఏటా రైళ్లలో 800 కోట్ల మంది ప్యాసింజర్స్ ప్రయాణిస్తున్నారు. ఈ కెపాసిటీని 1000 కోట్లకు పెంచాలనేదే రైల్వే లక్ష్యం. రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు ట్రావెలింగ్ టైమ్‌నీ తగ్గించాలని రైల్వే భావిస్తోంది. అందుకే ఎక్కువ సంఖ్యలో ట్రాక్‌లు ఏర్పాటు చేయాలనుకుంటోంది. రైళ్ల వేగాన్నీ పెంచనుంది. స్పీడ్‌ పెంచాలన్నా, తగ్గించాలన్నా ఎక్కువ సమయం తీసుకోకుండా రైళ్లను డిజైన్ చేయనుంది. రైళ్ల వేగం పెంచడం ద్వారా ఢిల్లీ నుంచి కోల్‌కత్తా మధ్య ట్రావెలింగ్ టైమ్‌ని కనీసం 2 గంటల 20 నిముషాల మేర తగ్గించవచ్చని అంచనా. ఇందుకో Push Pull టెక్నాలజీని విస్తృతంగా వినియోగించనుంది. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీతో 225 రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుత రైళ్లతో పోల్చుకుంటే వందేభారత్ (Vande Bharat Trains) పుష్‌పుల్ కెపాసిటీ ఎక్కువ. 

కశ్మీర్‌లోనూ త్వరలోనే వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains in Kashmir) అందుబాటులోకి రానున్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదే విషయం వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా జమ్ము -శ్రీనగర్‌ లైన్‌లో వందేభారత్‌ ట్రైన్‌ సర్వీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ సెమీ హై స్పీడ్‌ ట్రైన్స్‌ని నడిపే యోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆ రాష్ట్రానికి రైల్వే లైన్‌ కన్‌ఫమ్ కాగానే వెంటనే ఈ ట్రైన్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 75 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకి ప్రత్యామ్నాయంగా వందేభారత్ స్లీపర్ ట్రైన్స్‌నీ అందుబాటులోకి తీసుకురానుంది. 

Also Read: వాళ్లను బయటకు తీయాలంటే మరో 2-3 రోజులు పడుతుండొచ్చు - ఉత్తరాఖండ్ ఘటనపై కేంద్రమంత్రి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
IPL 2025 KKR VS PBKS Result Update:  చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP DesamMS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
IPL 2025 KKR VS PBKS Result Update:  చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Vizag Flight Issue:విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇంత కష్టమా? గంటా అసంతృప్తి!
విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇంత కష్టమా? గంటా అసంతృప్తి!
Amarnath Yatra 2025 : అమర్​నాథ్ యాత్ర ప్రారంభ తేదీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే.. ఆ సర్టిఫికెట్ లేకుంటే యాత్రకు అనుమతి ఉండదట, డిటైల్స్ ఇవే
అమర్​నాథ్ యాత్ర ప్రారంభ తేదీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే.. ఆ సర్టిఫికెట్ లేకుంటే యాత్రకు అనుమతి ఉండదట, డిటైల్స్ ఇవే
CLP Meeting:  ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Embed widget