అన్వేషించండి

Elon Musk: సారీ చెప్పిన ఎలాన్ మస్క్! ట్విట్టర్‌తో పెట్టుకుంటే అంతే మరి!

Elon Musk: అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. సారీ చెప్పడం మీరెప్పుడైనా విన్నారా? అయితే చూడండి.

Elon Musk: ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తొలుత ట్విట్టర్ ఉన్నతాధికారులు, ఉద్యోగులతో తలనొప్పులు పడిన మస్క్..  ఇప్పుడు ఆ సంస్థ పనితీరుతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎలాన్ మస్క్.. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.

ఇదీ జరిగింది

చాలా దేశాల్లో ట్విట్టర్ సైట్‌ పని తీరు నిదానించింది. ఈ  సూపర్‌ స్లో పరిణామంపై ఎలాన్ మస్క్ ఆదివారం స్పందించారు. క్షమాపణలు కూడా చెప్పారు.  

" అనేక దేశాల్లో ట్విట్టర్ చాలా నెమ్మదిగా పని చేస్తున్నందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను.               "
-    ఎలాన్ మస్క్, ట్విట్టర్ ఓనర్

మస్క్ మామ

శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీసులో ఇటీవల ఉద్యోగులతో మస్క్ సమావేశమైనట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

మరింత ఆదాయాన్ని ఆర్జించడంలో విఫలమైతే ట్విట్టర్ దివాలా తీసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది కష్టపడి పనిచేయాలి. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను కూడా వదులుకునేందుకు సిద్ధపడాలి.                                 "
-         ఎలాన్ మస్క్

బ్లూ టిక్ ఛార్జీలు

ట్విట్టర్‌లో బ్లూటిక్‌కు మస్క్ ఇప్పటికే ఛార్జీలు ప్రకటించారు. అమెరికా, యూకే సహా కొన్ని దేశాల్లో ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. తాజాగా భారత్‌లోనూ ఈ ఛార్జీలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బ్లూటిక్‌ ఛార్జీలపై కొందరు యూజర్లకు సందేశాలు వచ్చాయట. భారత్‌లో ఈ సబ్‌స్క్రిషన్‌కు నెలకు రూ.719 కట్టాలట.

అయితే ప్రస్తుతానికి ఐఓఎస్‌ (ఐఫోన్‌) యూజర్లకు మాత్రమే ఈ మెసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్‌షాట్లు తీసి ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే బ్లూటిక్‌ వస్తుంది. 

ఉద్యోగులకు షాక్

ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత మస్క్.. లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నారు. చాలా మందిని తొలగించారు. ఇప్పుడు ఉద్యోగులకు మరో ఝలక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈవో స్థాయిలో తొలిసారి ఉద్యోగులకు మెయిల్ పంపారు. "కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి" అని మెయిల్ చేశారు మస్క్.

అంతే కాదు. ఎంప్లాయిస్ అందరూ కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్లకు మినహాయింపునిస్తానని స్పష్టం చేశారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని కూడా పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. Bloomberg రిపోర్ట్ ప్రకారం...ఇప్పటికే ఎలన్ మస్క్ అందరి ఉద్యోగులకు "వర్క్ ఫ్రమ్ హోమ్‌ను" తొలగిస్తున్నట్టు మెయిల్ పంపారు.

వారానికి కనీసం 40 గంటల పాటు పని చేయాలని ఆదేశించారు. ట్విట్టర్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దాచాల్సిన పని లేదని అది అందరికీ తెలిసిన విషయమేనని మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు కూర్చుని నింపాదిగా మాట్లాడుకోవాల్సిన సమయం కాదని, కేవలం యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూతోనే ట్విట్టర్ నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే...ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని తేల్చి చెప్పారు.

Also Read: Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget