![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్ వెయిటింగ్!
గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం అయోధ్య రెడీ అయింది. ఈరోజు సాయంత్రం 12 లక్షల దీపాలతో అయోధ్య మెరిసిపోనుంది.
![Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్ వెయిటింగ్! Deepotsav Celebration in Ayodhya Set To Create World Record By Lighting 12 Lakh Diyas Today Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్ వెయిటింగ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/03/fbc60bc313cf091e022864061b1b63df_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దీపోత్సవం కోసం అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. ఆలయాలు, మార్కెట్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఇలా అన్నింటిని దీపావళి వేళ అంగరంగ వైభవంగా తయారు చేస్తున్నారు. చోటీ దివాళీ సందర్భంగా ఈ రోజు అయోధ్యను దీపాలతో అలంకరించనున్నారు. అయితే ఈసారి 12 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాలని యోగి సర్కార్ భావిస్తోంది.
अवधपुरी प्रभु आवत जानी। भई सकल सोभा कइ खानी।। pic.twitter.com/lAhdkCwsAb
— Yogi Adityanath (@myogiadityanath) November 2, 2021
కనులపండువగా..
ఈ 12 లక్షల దీపాలలో 9 లక్షలు సరయు నది తీరాన ఉన్న రామ్ కీ పైడీ ఘాట్లో వెలిగించనున్నారు. మిగిలిన 3 లక్షల దీపాలు అయోధ్యలోని వివిధ మఠాల్లో వెలిగిస్తారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం కూడా విచ్చేసింది.
అయితే ఇవన్నీ కనీసం 5 నిమిషాల పాటు వెలగాలి.. అప్పుడే ప్రపంచ రికార్డ్ నెలకొల్పుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు యోగి ఆదిత్యనాథ్ అయోధ్య చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ఆయన రామ్ కీ పైడీ ఘాట్లో సరయు హారతి ఇస్తారు. అనంతరం 6 గంటల నుంచి దీపోత్సవం జరగనుంది.
ఐదు దీపాలు..
ఈ కార్యక్రమాన్ని చూసేందుకు అయోధ్య ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం ప్రారంభమైన ఈ దీపోత్సవ కార్యక్రమం ఐదురోజుల పాటు సాగనుంది. ఈరోజు కార్యక్రమంలో అయోధ్యలోని ప్రతి గ్రామం నుంచి ఓ ఐదు దీపాలు ఇక్కడ వెలిగిస్తారు.
భారీ భద్రత..
ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యోగి సర్కార్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని ప్రతి గల్లీలో పోలీసులు కాపు కాస్తున్నారు. ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని 2017 నుంచి చేస్తున్నారు. 2017లో 51 వేల దీపాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)