అన్వేషించండి

Revanth Reddy: చర్చలకు రెడీ - అమరావతికి హైదరాబాద్ సహకారమూ అవసరమే - చంద్రబాబుకు రేవంత్ పిలుపు

CM Revanth Reddy: సమస్యలపై చర్చలకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రాలతో పంచాయతీల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు.

CM Revanth Reddy calls Chandrababu for discussions on issues:  తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, జల వివాదాలు మరియు అంతరాష్ట్ర కనెక్టివిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలొద్దు.. పరిష్కారాలే కావాలి ! 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై ముఖ్యమంత్రి సూటిగా స్పందించారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధిని చూడటం మానుకోవాలి. మాకు పొరుగు రాష్ట్రాలతో పంచాయితీలు పెట్టుకోవడం కంటే సమస్యల పరిష్కారమే ముఖ్యం అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన తెలంగాణ ప్రాజెక్టులకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుపడవద్దని కోరారు. మీకు పంచాయితీలు కావాలా? నీళ్లు కావాలా? అని ఎవరైనా అడిగితే.. నాకు, నా తెలంగాణకు నీళ్లు మాత్రమే కావాలని చెబుతాను  అని ఆయన పేర్కొన్నారు.  వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతామని స్పష్టం చేశారు.   కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వ సహకరించాలని కోరారు. 

పోర్టు లేని రాష్ట్రం తెలంగాణనే.. అందుకే మచిలీపట్నం  నుంచి హైవే    

దేశంలో పోర్టు లేని ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేస్తూ, సముద్ర మార్గంతో అనుసంధానం కావాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి వివరించారు.  తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ సహకారం తప్పనిసరి. అందుకే, మచిలీపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని మేము కేంద్రాన్ని కోరాము అని వెల్లడించారు. ఈ కనెక్టివిటీ రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.                   

అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారమూ అవసరమే                             

నగరాభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు నిర్మించడం మాత్రమే కాదని, ఆ పరిశ్రమలను నడిపించే సమర్థవంతమైన సిబ్బంది కూడా అవసరమని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో అటువంటి నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, అందుకే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి కూడా హైదరాబాద్ సహకారం అవసరమన్నారు.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
Automatic Climate Control: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget