అన్వేషించండి

Revanth Reddy: చర్చలకు రెడీ - అమరావతికి హైదరాబాద్ సహకారమూ అవసరమే - చంద్రబాబుకు రేవంత్ పిలుపు

CM Revanth Reddy: సమస్యలపై చర్చలకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రాలతో పంచాయతీల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు.

CM Revanth Reddy calls Chandrababu for discussions on issues:  తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, జల వివాదాలు మరియు అంతరాష్ట్ర కనెక్టివిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలొద్దు.. పరిష్కారాలే కావాలి ! 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై ముఖ్యమంత్రి సూటిగా స్పందించారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధిని చూడటం మానుకోవాలి. మాకు పొరుగు రాష్ట్రాలతో పంచాయితీలు పెట్టుకోవడం కంటే సమస్యల పరిష్కారమే ముఖ్యం అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన తెలంగాణ ప్రాజెక్టులకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుపడవద్దని కోరారు. మీకు పంచాయితీలు కావాలా? నీళ్లు కావాలా? అని ఎవరైనా అడిగితే.. నాకు, నా తెలంగాణకు నీళ్లు మాత్రమే కావాలని చెబుతాను  అని ఆయన పేర్కొన్నారు.  వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతామని స్పష్టం చేశారు.   కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వ సహకరించాలని కోరారు. 

పోర్టు లేని రాష్ట్రం తెలంగాణనే.. అందుకే మచిలీపట్నం  నుంచి హైవే    

దేశంలో పోర్టు లేని ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేస్తూ, సముద్ర మార్గంతో అనుసంధానం కావాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి వివరించారు.  తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ సహకారం తప్పనిసరి. అందుకే, మచిలీపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని మేము కేంద్రాన్ని కోరాము అని వెల్లడించారు. ఈ కనెక్టివిటీ రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.                   

అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారమూ అవసరమే                             

నగరాభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు నిర్మించడం మాత్రమే కాదని, ఆ పరిశ్రమలను నడిపించే సమర్థవంతమైన సిబ్బంది కూడా అవసరమని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో అటువంటి నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, అందుకే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి కూడా హైదరాబాద్ సహకారం అవసరమన్నారు.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Israel-Iran War: ఒకే దాడిలో 48 మంది ఇరాన్ నేతలు మృతి, కొత్త నాయకత్వంతో చర్చలకు రెడీ: డొనాల్డ్ ట్రంప్
ఒకే దాడిలో 48 మంది ఇరాన్ నేతలు మృతి, కొత్త నాయకత్వంతో చర్చలకు రెడీ: డొనాల్డ్ ట్రంప్
Ind vs WI Highlights: సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
Israel Strike on Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ మృతి.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ మృతి.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు
Advertisement

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget