అన్వేషించండి

Land Survey In AP: ఏపీలో భూసర్వేపై అధికారులకు టార్గెట్- అక్టోబర్‌కు పూర్తి చేయాలన్న మంత్రుల కమిటీ

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి గ్రామకంఠం భూముల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తున్నామని పేర్కొన్నారు మంత్రులు.

రాష్ట్రంలో అక్టోబర్ నాటికి కనీసం రెండువేల గ్రామాల్లో సమగ్ర భూసర్వే పూర్తి అవ్వాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని మంత్రుల కమిటీ ఆదేశించింది. సచివాలయంలో మంగళవారం జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పథకం ప్రగతిపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం పాల్గొన్నారు.

సమగ్ర భూసర్వేకు సంబంధించిన వివరాలను మంత్రుల కమిటీకి వివరించారు అధికారులు. దీనిపై మంత్రులు స్పందిస్తూ ముఖ్యమంత్రి  జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం వల్ల భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం ఉండదన్నారు. క్షేత్రస్థాయిలో భూ వివరాలు అత్యంత పారదర్శకంగా రికార్డు చేస్తామన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చురుగ్గా కొనసాగుతోందని, అదే క్రమంలో అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని సూచించారు.

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా జరుగుతున్న సర్వేను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు మంత్రులు. ప్రతి జిల్లాలోనూ అర్భన్ ప్రాంతాల్లో సర్వేను ప్రారంభించేందుకు కనీసం రెండు రోవర్లు, డ్రోన్లను కేటాయిస్తామని తెలిపారు. గ్రామకంఠాలకు సంబంధించిన సమస్యను కూడా ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలించిందని, అర్హులైన వారికి యాజమాన్య హక్కు పత్రాలను జారీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి గ్రామకంఠం భూముల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తున్నామని పేర్కొన్నారు మంత్రులు.  సీఎం జగన్ రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు. దీని కోసం చేపట్టాల్సిన చర్యలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వే సందర్భంగా క్షుణ్ణంగా పరిశీలించకపోతే వివాదాస్పద భూములు, అటవీభూములకు కూడా పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని, వీటి విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. దొంగ సర్టిఫికేట్లతో పెద్ద ఎత్తున అటవీభూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని, ఈ భూముల సర్వే సందర్భంగా రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించాలని అన్నారు. భూసర్వేను వేగవంతం చేసేందుకు రోవర్లు, డ్రోన్లను అదనంగా సమకూర్చుకోవాలని సూచించారు. 

అధికారులు మాట్లాడుతూ ఇప్పటి వరకు 1977 గ్రామాల్లో ఓఆర్ఆర్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. దీనిలో భాగంగా మ్యాప్‌ను ఫీల్డ్ స్థాయిలో పరిశీలించే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ 1170 గ్రామాల్లో పూర్తి చేశామని వివరించారు. 864 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేశామని అన్నారు. దాదాపు 775 గ్రామాలకు సర్వే పూర్తయ్యిందని ఇచ్చే 13నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. అక్టోబర్ నాటికి 2వేల గ్రామాల్లో నోటిఫికేషన్ పూర్తి చేయాలనేది లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 51 గ్రామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల నియామకం జరిగిందని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nervous father: తండ్రి కళ్లలో ప్రపంచం - పసిపాపను తొలిసారి అందుకున్న వేళ.. నెటిజన్లను కదిలిస్తున్న దృశ్యం!
తండ్రి కళ్లలో ప్రపంచం - పసిపాపను తొలిసారి అందుకున్న వేళ.. నెటిజన్లను కదిలిస్తున్న దృశ్యం!
IITian sells chai in LA: లేఆఫ్స్‌లో జాబ్ పోయిందని ఫీల్ కాలేదు - లాస్ ఏజెంల్స్‌లో మసాలా చాయ్‌తో ఎదిగిపోయాడు !
లేఆఫ్స్‌లో జాబ్ పోయిందని ఫీల్ కాలేదు - లాస్ ఏజెంల్స్‌లో మసాలా చాయ్‌తో ఎదిగిపోయాడు !
Ishan Kishan Family Tragedy: విషాదాన్ని అధిగమించి టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్
విషాదాన్ని అధిగమించి టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్
TVK Vijay CBI Case: టీవీకే విజయ్‌కు సీబీఐ పిలుపు - పది రోజుల గడువు కోరిన దళపతి - ఒత్తిడి ప్రారంభమయిందా?
టీవీకే విజయ్‌కు సీబీఐ పిలుపు - పది రోజుల గడువు కోరిన దళపతి - ఒత్తిడి ప్రారంభమయిందా?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget