అన్వేషించండి

Instagram: ఇన్ స్టాలో ఫుడ్ ఫోటోలు షేర్ చేసే వారికి ఓ హెచ్చరిక... బరువు పెరుగుతారు జాగ్రత్త

బరువు పెరగడానికి ఎన్నో కారణాలు. అందులో ఇప్పుడు ఓ వింతైన కారణం చేరింది.

మిలీనియల్స్ మనసుదోచిన సోషల్ మాధ్యమం ఇన్ స్టాగ్రామ్. అందులో రోజూ లక్షల ఫోటోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో కొంతమంది తాము వండిన లేక తినే ఆహారపదార్థాలను అందంగా ఫోటో తీసి పోస్టు చేస్తుంటారు. ఇలా చేయడం ఆనవాయితీగా మార్చుకున్నవారూ ఉన్నారు. అలాంటి వారిని ఓ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆ పరిశోధన ప్రకారం ఇన్ స్టాగ్రామ్ లో ఫుడ్ ఫోటోలను షేర్ చేసే, అలాగే ఫుడ్ గురించి తన అనుభవాలను పంచుకునే వ్యక్తులు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. వీరిలో ఆకలి, తినాలన్న కోరిక పెరిగిపోయి అధికంగా ఆహారాన్ని తినేస్తారు. దాని వల్ల బరువు పెరిగే అవకాశం అధికమవుతుంది. ప్రపంచంలో దాదాపు 70 శాతం మిలీనియల్స్ తినడానికి ముందు క్రమం తప్పకుండా ఫుడ్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసుకుంటున్నట్టు తాజా సర్వే తేల్చింది. 

అమెరికాకు చెందిన జార్జియా సదరన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఎవరైతే ఫుడ్ ఫోటోలు తీసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తారో, వారు రెండు రెట్లు అధికంగా తినే అవకాశం ఉన్నట్టు బయటపడింది. ఈ స్టడీ తాలూకు వివరాలు ‘అపెటైట్’అనే జర్నల్ లో ప్రచురించారు. ఇందుకోసం 145 మంది విద్యార్థులను తీసుకుని వారిని రెండు గ్రూపులుగా విడదీశారు. ఇద్దరికీ ఆహారాన్ని ప్లేట్లలో అందించారు. వారిలో సగం మందిని ఫోటోలు తీసి ఇన్ స్టాలో పోస్టు చేయమన్నారు. అలాగే ఆహారం గురించి రాయమన్నారు. రేటింగ్ కూడా ఇవ్వమన్నారు. 

ఇక రెండో గ్రూపులోని వ్యక్తులను నేరుగా ఆహారాన్ని తినమన్నారు. వీరు ఇచ్చిన ఆహారాన్ని తిని చాలని చెప్పారు. కానీ ఇన్ స్టా కోసం ఫోటోలు తీసిన గ్రూపులోని విద్యార్థులు మాత్రం ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ, ఇంకా కావాలని రెండో సారి కూడా తిన్నారు. దీన్ని బట్టి ఇన్ స్టాలో ఫుడ్ ఫోటోలను పంచుకునే వారు అవసరం కన్నా ఎక్కువ తినే అవకాశం ఉందని తేల్చారు.  పాత అధ్యయనాలలో మాత్రం ఇలా ఫుడ్ ఫోటోలు తీసే వారిలో మెదడు వాసన, రుచి ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తేలింది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి

Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు

Also read: ఇలాంటి ఆహారపదార్థాలు తింటున్నారా... అయితే మతిమరుపు వచ్చే ఛాన్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఏకంగా 31 మంది మావోయిస్టులు మృతి- కొనసాగుతోన్న ఆపరేషన్
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఏకంగా 31 మంది మావోయిస్టులు మృతి- కొనసాగుతోన్న ఆపరేషన్
Chiranjeevi: మెగాస్టార్ కాదు... చిరంజీవి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
మెగాస్టార్ కాదు... చిరంజీవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
Mars Exploration: మార్స్‌పై ఆ గుర్తులేంటి...?  ఏలియన్స్ ఉన్నారనడానికి సంకేతమా.. ? దాని సంగతేంటో చూడాలంటున్న Elon Musk
మార్స్‌పై ఆ గుర్తులేంటి...? ఏలియన్స్ ఉన్నారనడానికి సంకేతమా.. ? దాని సంగతేంటో చూడాలంటున్న Elon Musk
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Gandhi with Nagaland Students | మనం మైండ్ సెట్స్ ను ఇక్కడే ఆపేస్తున్నారు | ABP DesamAAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP DesamArvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP DesamDelhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఏకంగా 31 మంది మావోయిస్టులు మృతి- కొనసాగుతోన్న ఆపరేషన్
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఏకంగా 31 మంది మావోయిస్టులు మృతి- కొనసాగుతోన్న ఆపరేషన్
Chiranjeevi: మెగాస్టార్ కాదు... చిరంజీవి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
మెగాస్టార్ కాదు... చిరంజీవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
Mars Exploration: మార్స్‌పై ఆ గుర్తులేంటి...?  ఏలియన్స్ ఉన్నారనడానికి సంకేతమా.. ? దాని సంగతేంటో చూడాలంటున్న Elon Musk
మార్స్‌పై ఆ గుర్తులేంటి...? ఏలియన్స్ ఉన్నారనడానికి సంకేతమా.. ? దాని సంగతేంటో చూడాలంటున్న Elon Musk
Aadhaar Cost: ఆధార్ కోసం 1.3 బిలియన్ డాలర్ల ఖర్చు దండగ - హాట్ మెయిల్ కో ఫౌండర్ సబీర్ భాటియా వివరణ ఇదీ
ఆధార్ కోసం 1.3 బిలియన్ డాలర్ల ఖర్చు దండగ - హాట్ మెయిల్ కో ఫౌండర్ సబీర్ భాటియా వివరణ ఇదీ
Thandel Box Office Collection Day 2: బాక్సాఫీస్ వద్ద దంచి కొడుతోన్న 'తండేల్' - రెండో రోజు కూడా కలెక్షన్ల జోరు, ఫుల్ జోష్‌లో మూవీ టీం
బాక్సాఫీస్ వద్ద దంచి కొడుతోన్న 'తండేల్' - రెండో రోజు కూడా కలెక్షన్ల జోరు, ఫుల్ జోష్‌లో మూవీ టీం
First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Cuttack Odi Toss Update: భారత్ బౌలింగ్.. జట్టులోకి కోహ్లీ..  వరుణ్ డెబ్యూ.. సిరీస్ పై టీమిండియా కన్ను, ఒత్తిడిలో బట్లర్ సేన
భారత్ బౌలింగ్.. జట్టులోకి కోహ్లీ రీ ఎంట్రీ.. వరుణ్ డెబ్యూ.. సిరీస్ పై టీమిండియా కన్ను, ఒత్తిడిలో బట్లర్ సేన
Embed widget