అన్వేషించండి

అరటి పండ్లను రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యమో తెలుసా?

అరటిపండ్లు ఆరోగ్యకరమైనవే, కానీ అతిగా తింటే మాత్రం కొన్ని సమస్యలు తప్పవు

అందరికీ అందుబాటులో ఉండేవి, అన్ని సీజన్లలో దొరికే పండ్లు అరటి పండ్లే. పిల్లలకు, పెద్దలకు బాగా నచ్చేవి కూడా ఇవే. రోజుకో మీడియం సైజు అరటి పండు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ అతిగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు రాకమానవు. కొంతమంది పండ్లు ఎదురుగా కనిపిస్తే చాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి... ఇలా మూడు పూటలా సమయం చూసుకోకుండా తినేస్తుంటారు. ఇలా ఒక్క నాలుగు రోజులు తింటే చాలు ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతుంది. అరటి పండ్లు అధికంగా తినేవారిలో మలబద్ధకం సమస్య వస్తుంది. అలాగే మైగ్రేన్ వంటి తలనొప్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇక మైగ్రేన్ ఉన్న వారు అరటిపండ్లను రోజుకు ఒకటికి మించి తినకపోవడమే మంచిది. అలాగే మధుమేహం ఉన్న వారు కూడా అరటిం పండ్లకు దూరంగా ఉండాలి. రెండు రోజులకో అరటిపండు తింటే ఫర్వలేదు కానీ, రోజూ తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ పండులో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇదే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేస్తుంది. అలాగే అరటి పండ్లు అధికంగా తినడం వల్ల బాగా బరువు పెరుగుతారు. అది కూడా త్వరగా. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల పొటాషియం శరీరంలో అవసరానికి మించి పేరుకుపోతుంది. దీని వల్ల హైపర్కెల్మియా వచ్చే అవకాశం ఉంది. ఇదొక అనారోగ్య సమస్య. 

అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. అరటి పండ్లు అధికంగా తిన్నాక పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు. అలాగే దంతక్షయం కూడా కలుగుతుంది. అది కాకుండా అధికంగా ఈ పండ్లను తినడం వల్ల నిద్ర వచ్చేస్తుంది, ఉదయం పూట కూడా నిద్ర మత్తులో ఉంటారు. 

ఎన్ని  తినాలి?
ఏ ఆరోగ్య సమస్య లేని వారు రోజుకు రెండు పండ్లు తింటే చాలు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి తింటే మేలు జరుగుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తినకపోవడమే మంచిది. అలాగే అరటి పండు తిన్నాక గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది. జలుబు వంటివి రావు. పిల్లలకైతే కచ్చితంగా ఇలాగే తినిపించాలి. 

తింటే మంచిదే
అరటి పండు రోజుకు ఒకటి తినడం వల్ల చాల మేలు జరుగుతుంది. పెద్ద అరటిపండు కాకుండా మీడియం సైజుది తింటే చాలు. దీనిలో ఉండే పొటాషియం గుండెపై ఒత్తిడి పడకుండా చూస్తుంది. ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన పొటాషియంలో 9 శాతం అరటిపండు తీర్చేస్తుంది. ఈ పండులో లెక్టిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. లెక్టిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఫ్రీరాడికల్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి కణాలను చంపేసి క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. అతిసారంతో బాధపడేవారు అరటిపండు తింటే మంచిది. ఎందుకంటే దీనిలో నీరు, పొటాషియం ఉంటుంది కాబట్టి వారి ప్రాణాలకు రక్షణగా ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి కూడా ఈ పండు చాలా మేలు చేస్తుంది. 

Also read: మనుషులను వేటాడే చివరి గిరిజన తెగ, ఆ తెగ నాయకుడికి అరవై మంది భార్యలు

Also read: మగవారు మధ్యలోనే ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి ముఖ్య కారణాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget