అన్వేషించండి

Diabetes: డయాబెటిస్‌కు కొత్త చికిత్స - సెల్ థెరపీతో మధుమేహానికి చెక్ పెట్టిన చైనా పరిశోధకులు, ఎలాగంటే?

చైనా పరిశోధకులు కొత్త ట్రీట్మెంట్ తో డయాబెటిస్‌ను నయం చేశారు. తొలిసారి సెల్ థెరపీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

Diabetes Cure With Cell Therapy: మధుమేహంతో బాధపడుతున్న చైనా ప్రజలకు అక్కడి పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. డయాబెటిస్ కు కొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టారు. ఈ మేరకు చైనా షాంఘైలోని షాంఘై చాంగ్‌జెంగ్ హాస్పిటల్ పరిశోధకులు కీలక ప్రకటన చేశారు. సెల్ థెరపీ అనే కొత్త చికిత్సా విధానం ద్వారా మధుమేహాన్ని నయం చేసినట్లు తెలిపారు. చైనా మార్నింగ్ మ్యాగజైన్ ఈ మేరకు కీలక పరిశోధన కథనాన్ని ప్రచురించింది.

సెల్ థెరపీతో డయాబెటిస్ క్యూర్

గడిచిన 25 ఏళ్లుగా సెల్ థెరపీ పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు చైనా వైద్యులు. డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ 59 ఏళ్ల బాధితుడిపై ఈ ప్రయోగం మొదలు పెట్టారు. ఇదే వ్యక్తికి 2017లో షుగర్ కారణంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఈ పరిశోధన విస్తృతం చేశారు. సెల్ థెరపీ ద్వారా అతడికి చికిత్స కొనసాగించారు. ఈ ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత సుమారు 10 నుంచి 11 వారాల తర్వాత ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదు. షుగర్ కంట్రోల్ కోసం టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. సెల్ థెరపీ మొదలు పెట్టిన తర్వాత డయాబెటిక్ పేషెంట్ లో ప్యాంక్రియాటిక్ ఐలెట్ పని తీరు మెరుగు పడినట్లు గుర్తించారు. ఆ తర్వాత సదరు రోగి పూర్తిగా మధుమేహం నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు.

వైద్య పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం

డయాబెటిస్ నిర్మూలన కోసం రూపొందించిన సెల్ థెరపీ ఆధునిక వైద్య విధానంలో కొత్త ట్రీట్మెంట్ అవుతుందని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ సెల్ థెరపీ ఎంతో మంది రోగులకు మేలు చేయబోతుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం సెల్యులార్, ఫిజియోలాజికల్ సైన్సెస్ విభాగం అధినేత తిమోతీ కీఫెర్ వెల్లడించారు. దశాబ్దం పాటు కొనసాగిన ఈ పరిశోధనలో కీలక ఫలితాలు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

టాబ్లెట్లు, ఇంజెక్షన్లకు ఇకపై చెక్!

వాస్తవానికి మధుమేహంతో చాలా కాలం బాధపడే వారికి చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుంది. డయాబెటిస్ ముదిరితే గుండె, కిడ్నీతో పాటు కంటి సమస్యలు ఏర్పడుతాయి. దీంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునేందుకు బాధితులు టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సెల్ థెరపీతో టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పే అవకాశం ఉంది. సెల్ థెరపీ ద్వారా డయాబెటిక్ పేషెంట్లలోని పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్‌ ను సీడ్ సెల్స్ గా మారుస్తారు. ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్ రీ క్రియేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ చేశారు. ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ కొత్త విధానానికి సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇంకా కొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవి కూడా సక్సెస్ అయితే, ఈ విధానం అమల్లోకి రానుంది.  
  

అత్యధిక డయాబెటిక్ పేషెంట్లు ఉన్న దేశం చైనా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డయాబెటిక్ పేషెంట్లలో ఎక్కువ మంది చైనాలోనే ఉన్నారు. డ్రాగన్ కంట్రీలో ఏకంగా 140 మిలియన్ల మంది డయాబెటిస్ పేషెంట్లు ఉన్నట్లు అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ వెల్లడించింది. సెల్ థెరపీ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తే వారందరికీ మేలు కలిగే అవకాశం ఉంది.    

Also Read : లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారట.. డివోర్స్ కేసులలో వీరిదే పై చేయి

టాప్ హెడ్ లైన్స్

Magnesium Deficiency : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
Monsoon Diet Tips : వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
Kidney Disease : కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించే టెస్ట్ ఇదే.. కేవలం 300 రూపాయలతో తెలుసుకోవచ్చు అంటోన్న వైద్యులు
కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించే టెస్ట్ ఇదే.. కేవలం 300 రూపాయలతో తెలుసుకోవచ్చు
30 Days Of Eating Bananas : రోజూ ఒక అరటిపండు తింటే 30 రోజుల్లో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
రోజూ ఒక అరటిపండు తింటే 30 రోజుల్లో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Embed widget