అన్వేషించండి

Trinayani Serial Today December 22nd Episode - 'త్రినయని' సీరియల్: ఫలించిన కోరలమ్మ పూజలు, గాయత్రీ పాప వల్ల తిలోత్తమకు గండం తప్పదా!

Trinayani Today Episode కోరలమ్మకు పూజచేసి ఇంట్లో ఎవరికి అపమృత్యు గండం ఉందో తెలుసుకోవాలని నయని కుటుంబం ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Telugu Serial Today Episode : నయని, హాసినిలు హాల్‌లో పూజకు సిద్ధం చేస్తుంటే ఎద్దులయ్య వచ్చి యమపాశం పెట్టేవరకు ఆగండి అని చెప్పి తాడు పెడతాడు. ఇంతలో ఇంట్లో వాళ్లు అందరూ అక్కడికి వస్తారు. ఇక పావనా మూర్తి మట్టి కుండలు తీసుకొస్తారు. వాటిని తాడు చుట్టూ పెడతారు. 

విశాల్: ఈ రోజు చాలా స్పెషల్ డే.. దత్తాత్రేయ స్వామి వారి జయంతి జరుపుతారు. 
ఎద్దులయ్య: లలితా దేవి జయంతి కూడా ఈరోజే మాతా. 
హాసిని: చాలా విషయాలు చెప్పారు కానీ అపమృత్యుభయం ఎవరికి ఉందో చెప్పలేదు అక్క. 
నయని: అలాంటి భయాలు రాకుండా ఉండాలి అనే కోరుకుందాం చెల్లి.
తిలోత్తమ: కోరుకుంటే సరిపోదు నయని.. ఫలితం ఉండాలి.
ఎద్దులయ్య: తప్పక ఉంటుంది మాతా. మీరు కోరలమ్మకు హారతి ఇవ్వగానే అర్థమవుతుంది. అపమృత్యు ఆభరణాన్ని వేసుకుంది ఎవరో తేలిపోవాలి అంటే కోరలమ్మ నైవేద్యం పెట్టే ముందు కుండలలో కొబ్బరి పీసు పెట్టండి. 
నయని: ఎద్దులయ్య అపమృత్యువుని ఆభరణంతో పోల్చావు కానీ దాన్ని ధరించే సాహసం ఎవరు చేస్తారు. 
సుమన: చావుని మెడలో వేసుకునేది ఎవరు.
విశాల్: మనమే.. ఎంత ఆరోగ్యం ఉన్నా మృత్యువు మన వెంటే ఉన్నప్పుడు చావు మ వెంటే వస్తుంది.
సుమన: నేను తిలోత్తమ అత్తయ్య అయితే గట్టెక్కినట్లే. ఎందుకంటే నా మీద పూలకుండి పడింది. అత్తయ్య చేతికి బులెట్ తగిలింది. అందుకే మా ఇద్దరి గండాలు తొలగిపోయినట్లే. ఇక మిగిలిన మీలో ఒకరికే ఈ మృత్యువు వస్తుంది. 
తిలోత్తమ: ముందు హారతి ఇవ్వండి. టెన్షన్ పెట్టి చంపేస్తున్నారు. 
ఎద్దులయ్య: ముందు హారతి వెలగించండి. తర్వాతి గాయత్రీ పాప చేత హారతి కర్పూరం ఈ కుండల్లో వేయించండి.
సుమన: ఆ పిల్లే ఎందుకు వేయాలి. 
ఎద్దులయ్య: దోష భూయిస్టమైన జాతకం కదా.. గాయత్రీ పాప చేత కుండల్లో అగ్నిని రగిలింపజేయాలి. 
విశాల్: గాయత్రీకి దోషమా..
నయని: ఏం దోషం ఎద్దులయ్య.
ఎద్దులయ్య: నీకే తెలియాలి మాతా..

ఇక నయని హారతి ఇస్తుంది. విశాల్ గాయత్రీ పాపతో కుండల్లో కర్పూరం వేయిస్తాడు. ఇక నయని కోరలమ్మను మొక్కుకుంటుంది. మరోవైపు కుండల్లో అగ్గి దానంతట అదే వెలుగుతుంది. అందరూ షాక్ అవుతారు. మంట ఎవరూ పెట్టకుంటా ఎలా అగ్గి వచ్చిందని అందరూ ఎద్దులయ్యకి అడుగుతారు. ఇక తిలోత్తమ నీరు వేసి మంటలు ఆర్పేయమంటే సూర్యాస్తమయం అయి పున్నమి చంద్రుడు వచ్చే వరకు అగ్గి మండుతూనే ఉంటుందని ఆగదని ఎద్దులయ్య చెప్తాడు. ఇక ఆ మంట యమపాశానికి కూడా తాకుంతుంది. ఆ యమపాశం ఇళ్లంతా తిరుగుతూ.. మెట్లపై నుంచి పైకి వెళ్తుంది. పైన పిల్లలు ఉన్నారు దీంతో అందరూ షాక్ అయి పరుగున పైకి వచ్చి తాడు ఎక్కడికి వెళ్లిందని ఆశ్చర్యం అవుతారు. 

నయని: ఎద్దులయ్య ఎక్కడ ఉంది యమపాశం.
ఎద్దులయ్య: చుట్టే ఉంది మాతా..
విశాల్: చుట్టూ ఉందా.. 
ఎద్దులయ్య: కాదు చుట్టే ఉంది. 
సుమన: అర్థమయ్యేలా చెప్తావా లేదా..

ఇక ఎద్దులయ్య అటు చూడండి అంటే ఆ తాడు టీవినీ చుట్టి ఉంటుంది. ఇక హాసిని ఎద్దులయ్యకి ఆ తాడు తీసేమని చెప్తుంది. తాడు తీయగానే టీవీలో గాయత్రీ పాప ఫొటో కనిపిస్తుంది. అందరూ పాప అంటూ షాకైపోతారు. ఇక సుమన తనకు అర్థమైందని అంటుంది. అందరూ ఏంటో చెప్పమని అడిగితే.. ఆ అపమృత్యు గండం ఏదో గాయత్రీ పాపకే రావొచ్చని చెప్తుంది. అలా జరగదు అని విశాల్ గట్టిగా చెప్తాడు. అయితే నయని గాయత్రీ పాపని మాత్రమే చూశారు మీరు అక్కడ ఇంకెవరో ఉన్నారు అని నయని అంటుంది. అది చూస్తే తప్ప స్పష్టం రాదని నయని చెప్తుంది. వాళ్లు ఎవరో తాను తెలుసుకోవాలని నయని అంటుంది. ఇక విక్రాంత్ ఎద్దులయ్యే అది ఎవరో చెప్పగలడు అంటాడు. దీంతో ఎద్దులయ్య ఆరు కుండల్లో మంటలు ఆర్పితేనే స్పష్టత వస్తుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: రైతుబిడ్డ అరెస్ట్ కరెక్టే, హీరోలను కూడా అలా చెయ్యాలి - తమ్మారెడ్డి భరద్వాజ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget