అన్వేషించండి

Sudheer and Rashmi Gautham : 'బుజ్జితల్లి' అంటూ సుధీర్ - రష్మి ఈజ్ బ్యాక్... ఎ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ స్టార్ట్

Sudheer and Rashmi Gautham : 'ఈ సంక్రాంతికి వస్తున్నాము' అనే షో ద్వారా మరోసారి రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారు.

ETV Sankranthi Event 2025 : కొన్ని ఆన్ స్క్రీన్ జంటలను ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారంటే, వాళ్లు రియల్ లైఫ్ లో కూడా కపుల్ అయిపోవాలని కోరుకుంటారు. బిగ్ స్క్రీన్ పై అనుష్క - ప్రభాస్ జంట ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే స్మాల్ స్క్రీన్ పై తెలుగు ప్రేక్షకులు అమితంగా అభిమానించే జంటలలో సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ ల జోడి కూడా ఒకటి. చాలాకాలంగా ఈ జంటను ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమా, గిమా లేదు. మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఎన్నిసార్లు చెప్పినా, వీరిద్దరినీ జంటగా చూడడానికే ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు. తాజాగా మరోసారి ఈ జంట బుల్లితెరపై సందడి చేయబోతోంది. 

కొన్నాళ్ళ నుంచి షోలకు దూరం  

ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న హిట్ పెయిర్ లో వీళ్ళిద్దరూ మొదటి స్థానంలో ఉంటారు. జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ బయటకు వెళ్ళిన తర్వాత, ఇద్దరి కాంబోలో షోలు రాకపోవడంతో ప్రేక్షకులు వీళ్ళ రొమాన్స్ ను చాలా మిస్ అవుతున్నారు. ఈ సూపర్ హిట్ జోడి ఇటీవల కాలంలో కలిసి షోలు చేయడం లేదు. అయినప్పటికీ ఈ జంటకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే తాజాగా ప్రేక్షకులకు ఉన్న ఆ లోటు ఈ సంక్రాంతికి తీరబోతోంది. తాజాగా 'ఈ సంక్రాంతికి వస్తున్నాం' అని బుల్లితెర షోకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అందులో రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ ని గతంలో లాగే చూపించి ఆసక్తిని పెంచేశారు. ఈ షోలో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ సుధీర్ రష్మీ హైలెట్ అవుతున్నారు. 

'ఈ సంక్రాంతికి వస్తున్నాం'తో రీఎంట్రీ 

సంక్రాంతి కోడిపందాలు, ఆటలు పాటలతో 'ఈ సంక్రాంతికి వస్తున్నాం' టీజర్ అదిరిపోయింది. అయితే టీజర్ చివర్లో "ఎ నెవర్ ఎండింగ్" లవ్ స్టోరీ అంటూ మళ్ళీ సుధీర్, రష్మీల ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ ని తెరపైకి తీసుకువచ్చారు. వీరిద్దరూ కలిసి 'బుజ్జి తల్లి' పాటకి డాన్స్ చేయడం అదిరిపోయింది. కాగా 'ఈ సంక్రాంతికి వస్తున్నాం' అనే ఈ బుల్లితెర షో సంక్రాంతి పండుగ రోజు ఉదయం 10 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది. 

ఇక కొన్ని రోజుల క్రితమే ఈ జంట 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షో కారణంగా వార్తల్లో నిలిచింది. ఆ షోలో భాగంగా ఓ టాస్క్ ఇచ్చి, ఉన్నఫలంగా ఫోన్ చేసి ఎవరికైనా అర్జెంట్ గా రూ.10,000 పంపమని అడగాల్సి ఉంటుంది. అందులో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ కి ఫోన్ చేసి ఆ రూ. 10,000 అడగమని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే రష్మీ ఫోన్ చేయగా, సుధీర్ చాలా స్నేహంగా "రష్మీ బేబ్ చెప్పరా" అంటూ మాట్లాడాడు. అంతేకాకుండా ఆమె ఫోన్ కట్ చేసే లోపే అమౌంట్ ను పంపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఎప్పటిలాగే బుల్లితెరపై వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ మరోసారి సంక్రాంతికి స్పెషల్ ఫీస్ట్ కాబోతోంది ప్రేక్షకులకు.

Read Also : Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
SLBC టన్నెల్ పై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ Match Highlights | Champions Trophy 2025 లో కివీస్ ను కొట్టేసిన భారత్ | ABP DesamTrump vs Zelensky | రష్యాను రెచ్చగొట్టారు..ఉక్రెయిన్ చేయి వదిలేశారు..పాపంరా రేయ్ | ABP DesamKoganti Sathyam Sensational Comments | రాహుల్ హత్య కేసులో పెద్దిరెడ్డి.? | ABP DesamIndian Stock Market Crash | భారత్ లో కుప్పకూలిపోతున్న స్టాక్ మార్కెట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
SLBC టన్నెల్ పై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Raksha Khadse: కేంద్ర మంత్రి కూతురుకు ఈవ్ టీజింగ్. మంత్రి కూతురు అని తెలిసినా వదలని పోకిరీలు.. పోస్కో కేసు పెట్టిన పోలీసులు
కేంద్ర మంత్రి కూతురుకు ఈవ్ టీజింగ్. మంత్రి కూతురు అని తెలిసినా వదలని పోకిరీలు.. పోస్కో కేసు పెట్టిన పోలీసులు
I’m Not a Robot OTT Platform : 'అనూజ' ఆస్కార్ కలను చెదరగొట్టిన 'ఐయామ్ నాట్ ఏ రోబో' స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందంటే ?
'అనూజ' ఆస్కార్ కలను చెదరగొట్టిన 'ఐయామ్ నాట్ ఏ రోబో' స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందంటే ?
Ind Vs Aus Semis: సెమీస్ లో అలా చేయండి.. భార‌త్ కు సూచించిన గావ‌స్క‌ర్.. తుదిజ‌ట్టుపై కీల‌క వ్యాఖ్య‌లు
సెమీస్ లో అలా చేయండి.. భార‌త్ కు సూచించిన గావ‌స్క‌ర్.. తుదిజ‌ట్టుపై కీల‌క వ్యాఖ్య‌లు
NTR Dragon Update: ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్' మూవీ ఇంటర్నేషనల్ - నిర్మాత ఇచ్చిన అప్ డేట్ అదిరిందిగా!
ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్' మూవీ ఇంటర్నేషనల్ - నిర్మాత ఇచ్చిన అప్ డేట్ అదిరిందిగా!
Embed widget