News
News
వీడియోలు ఆటలు
X

Gruhalakshmi April 8th: అర్థరాత్రి దివ్య గదికి విక్రమ్- మళ్ళీ ప్రేమ్ జంట ఎంట్రీ, తులసి తల్లి కాళ్ళ మీద పడ్డ నందు

దివ్య, విక్రమ్ పెళ్లి పనులు మొదలవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

దివ్య జీవితం నీ కళ్ళ ముందే నాశనం అవుతుంటే ఎలా ఉంటుందో చూస్తూ ఉండమని రాజ్యలక్ష్మి ప్రియతో చెప్తుంది. నన్ను హింస పెడుతున్నారు కదా దివ్యని వదిలేయండని ప్రియ బతిమలాడుతుంది. అయితే నువ్వు సంజయ్ కి నువ్వు విడాకులు ఇచ్చేయ్ దివ్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని అంటుంది. అప్పుడు నా జీవితం నాశనమవుతుంది కదా అంటే విక్రమ్ నా కొంగులో ఉన్నాడు ఎలాగైనా తనని వదిలేది లేదని మనసులో కుట్ర బయట పెడుతుంది. దివ్యకి నగలు వేసి అందంగా ముస్తాబు చేస్తుంది. అప్పుడే విక్రమ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే కట్ చేస్తుంది. దీంతో విక్రమ్ దివ్య ఇంటికి వెళ్తే డైరెక్ట్ గా మర్యాదలు చేసి మాట్లాడుకోమని అంటారని వెళ్లాలని అనుకుంటాడు.

Also Read: కావ్యకి పూలు కొనిచ్చిన రాజ్- ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న అపర్ణ

నందు తులసి గదికి వచ్చి రావచ్చా అని అడుగుతాడు. నన్ను కాదు అడగాల్సింది లాస్యని, అయినా ఈ మధ్య తనలో మార్పు వచ్చింది అసూయ పడటం కనిపించలేదని అంటే నందు భార్యాని పాముతో పోల్చి తిడతాడు. నందు చీర తులసికి ఇచ్చి ఇడి నీకోసమే తీసుకున్నానని చెప్తాడు. ఎందుకు తీసుకున్నారని అంటే తీసుకోవాలని అనిపించింది అందుకే తీసుకున్నానని అంటాడు. కట్టుకున్న భార్యకి కాకుండా వేరే వాళ్ళకి చీర కొనివ్వడం మీకు అలవాటే కదా సెటైర్ వేస్తుంది. అందరి ముందు ఇవ్వకుండా ఇలా చాటుగా తీసుకొచ్చారెంటని ప్రశ్నిస్తుంది. నువ్వే ఇవ్వొద్దని చెప్పావ్ కదా అంటాడు. అది మన భార్యాభర్తలు ఉన్నప్పుడు చెప్పిన మాట.. కానీ ఇప్పుడు మనం జస్ట్ ఫ్రెండ్స్ అందరి ముందు ఏదైనా ఇవ్వండి ఇలా దొంగచాటుగా ఇవ్వొద్దని చెప్తుంది. తెలియకుండానే నాకు ఇష్టమైన కలర్ తెచ్చారని థాంక్స్ చెప్తుంది. తెలియకుండా కాదు తెలిసే తెచ్చానని నందు వెళ్ళిపోతాడు.

విక్రమ్ దివ్య ఇంటి గోడ దూకి మెల్లగా లోపలికి వెళతాడు. ఎవరూ చూడకుండా విక్రమ్ దివ్య గదికి వస్తాడు. అందరూ మంచి నిద్రలో ఉన్నారు దివ్యతో రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండవచ్చని అనుకుంటాడు. దివ్య నిద్రలేచి విక్రమ్ అని చూసుకోకుండా దొంగ దొంగ అని గట్టిగా అరిచేసారికి అందరూ వస్తారు. దివ్య అరుపుల దెబ్బకి విక్రమ్ మంచం కింద దూరిపోతాడు. విక్రమ్ మెల్లగా దివ్య కాలు గీరి వచ్చింది తనేనని సైగ చేస్తాడు. నిద్రలో పీడకల వచ్చినట్టు ఉంది ఎవరూ రాలేదని దివ్య కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది. తులసి తోడుగా పడుకుంటానని చెప్తే వద్దని చెప్పి అందరినీ పంపించేస్తుంది. ఇంత రాత్రిపూట రావడం ఏంటి వాళ్ళు ఎవరైనా చూస్తే ఏంటని అంటుంది. తనని బలవంతంగా బయటకి తోసేయబోతుంటే ఏమైందని నందు వాళ్ళు తలుపు తీసుకుని లోపలికి వచ్చేస్తారు. విక్రమ్ మళ్ళీ అందరి ముందు దొరికిపోతాడు.

Also Read: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర

నీళ్ళు నములుతూ చూడాలని అనిపించిందని సిగ్గు పడుతూ చెప్తాడు. చాలా రోజుల తర్వాత ప్రేమ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. చిన్నన్నయ్య వాళ్ళు వచ్చారని వెళ్ళి సంతోషంగా వాళ్ళని కౌగలించుకుంటుంది. కాసేపటికి మాధవి వాళ్ళు కూడా వస్తారు. 

Published at : 08 Apr 2023 09:45 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial April 8th Update

సంబంధిత కథనాలు

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి

Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Minister Peddireddy: ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు - స్పష్టత ఇచ్చిన మంత్రి

Minister Peddireddy: ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు - స్పష్టత ఇచ్చిన మంత్రి