అన్వేషించండి

ఆస్ట్రియాలో ‘బ్రో’ టీమ్ - అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్

పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో' మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సాయి తేజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'బ్రో'(BRO). మెగా మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.  తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది తెలుగు రీమేగా తెరకెక్కుతోంది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ పై, డైలాగ్స్ అందిస్తున్నారు. జి స్టూడియోస్ సంస్థతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందనను కనబరిచింది.

జూలై 28న విడుదల కాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. అయితే సాయి తేజ్ కి సంబంధించి కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా తాజాగా మూవీ టీం దాన్ని పూర్తి చేసింది. ఈ విషయాన్ని హీరో సాయి తేజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రీసెంట్ గా మూవీ టీమ్ ఓ సాంగ్ షూటింగ్ కోసం ఆస్ట్రియా కి వెళ్లగా.. తాజాగా సాంగ్ షూట్ ని మూవీ టీమ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. అంతేకాకుండా ఈ షూట్ తోనే మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు సాయి తేజ్ తెలిపారు. ఈ మేరకు సెట్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ పలు ఆసక్తికర పోస్టులు చేశారు.

"ఆస్ట్రియాలోని అత్యంత సుందరమైన ఇన్స్ బ్రక్ నగరంలో 'బ్రో' చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇలాంటి ఒక సుందరమైన ప్రాంతంలో షూటింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి థాంక్స్ అనే మాట ఒక చిన్న పదం మాత్రమే. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన షూటింగ్ అనుభవాన్ని అందించినందుకు మా యూనిట్ మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ సాయి తేజ రాసుకొచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ నుంచి సాయి తేజ షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ నెల చివర్లోనే బ్రో మూవీ రిలీజ్ ఉండగా మూవీ టీం ఇప్పుడు సినిమాకు సంబంధించి సాంగ్స్ విడుదల చేయనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే 'బ్రో' మూవీకి ఓవరాల్ బిజినెస్ రూ.100 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. కేవలం ఒక ఆంధ్ర ఏరియాలోనే ఈ సినిమాకి రూ.40 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ లోనూ రూ.13 కోట్ల రేంజ్ లో డీల్ క్లోజ్ అయిందని అంటున్నారు. ఒక రీమేక్ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. దీనికి పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణం అని స్పష్టంగా అర్థం అవుతుంది. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న 'బ్రో' మూవీ రేపు రిలీజ్ తర్వాత ఇంకెలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read : ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిఖిల్ - కారణం అదేనా?

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Dharam Tej (@jetpanja)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget