అన్వేషించండి

Sravanthi Ravi Kishore: త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్‌తో సినిమా చేయాలని ఉంది - నిర్మాత స్రవంతి రవి కిషోర్

ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మించిన 'దీపావళి' చిత్రం ఈనెల 11న విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా స్రవంతి రవి కిషోర్ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

టాలీవుడ్‌లో ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ స్రవంతి మూవీస్ అధినేత 'స్రవంతి'' రవి కిషోర్ తాజాగా 'దీపావళి' అనే సినిమాను నిర్మించారు. రవి కిషోర్ తొలితమిళ సినిమా 'కిడా' కి ఇది తెలుగు అనువాదం. ఈనెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ మీడియాతో ముచ్చటించారు. 'మీ సినీ ప్రయాణంలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటి?'అని అడగ్గా..

" డైరెక్టర్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏం తీయబోతున్నాడో నాకు ముందే తెలియలని కోరుకుంటా. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత సెట్స్ మీ ఇంటికి వెళ్తాం. ఐదారు నెలల నుంచి ఒక స్క్రిప్ట్ వరకు జరుగుతుంది. మరో మూడు నెలలు పట్టొచ్చు. ఒక స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు మరో స్క్రిప్ట్ గురించి ఆలోచించను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే" అని చెప్పారు. 'కిడా' కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు బదులిస్తూ.."నేను చెన్నైలో కథలు వింటున్న. నా ఫ్రెండ్ ఒకరు ఓ కథ విన్నాను. మీరు వినండి అని పది నిమిషాలు చెప్పాడు. నాకు కథ నచ్చి వెంటనే డైరెక్టర్ ఆర్ ఏ వెంకట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశా. వేరే నిర్మాతతో చేద్దామని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఒకవేళ మార్పులు ఏమైనా ఉంటే చెప్పమని అడిగితే 15 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు. అప్పుడు స్క్రిప్ట్ అంతా రికార్డ్ చేసి పంపించమని అడిగాను. బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ చేసి పంపడంతో అది విని ఓకే చేశాను" అని చెప్పారు.

'రిలీజ్ కి ముందే 'దీపావళి'కి అవార్డులు వచ్చాయి. దీనిపై మీ ఫీలింగ్ ఏంటి?' అని అడిగితే.. "నేను కథ నమ్మి సినిమా నిర్మించా. నాకు లాభం ఎంత వస్తుంది అని ఆలోచించకుండా మంచి సినిమా అవుతుందని నమ్మాను. సినిమా చూసిన కొందరు ఫ్రెండ్స్ ఫిలిం ఫెస్టివల్స్ లేదా అవార్డులకు ఎందుకు పంపించకూడదని అడిగారు. స్నేహితుల మాటలతో ఇండియా మనోరమకు పంపించా. ఒకరోజు సినిమా సెలెక్ట్ అయిందని ఫోన్ వచ్చింది. అది ఒక గొప్ప అనుభూతి. అందరి మనసుని హద్దుకునే చిత్రమిది" అని అన్నారు. ప్రీమియర్స్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. "తెలుగులో దిల్ రాజుతో పాటూ మీడియా కూడా ఈ సినిమా చూసింది. బాగుందని అందరూ ప్రశంసించారు. చెన్నైలో సుమారు 200 మంది మీడియా మిత్రులకు ఓ షో వేశాం. సినిమా చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంతకుముందు గోవాలో కూడా అలాంటి స్పందనే వచ్చింది" అని అన్నారు.

దీపావళికి పెద్ద సినిమాలు విడుదల మధ్య మీ తమ సినిమా విడుదల చేయడంపై మాట్లాడుతూ.. "దీపావళి పండక్కి బాణా సంచాలు, వెలుగులు ఎంత ముఖ్యమో పిండి వంటలు, కొత్త దుస్తులు కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా కూడా అంతే. ఇప్పుడు ఆడియన్స్ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా దీపావళిని కూడా చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను" అని అన్నారు. 'మీ ఇంట్లో స్టార్ హీరో ఉన్నారు. మీరు అడిగితే పెద్ద హీరోలు కూడా సినిమాలు చేస్తారు. కానీ మీరు చిన్న సినిమా చేయడానికి కారణం ఏంటి?' అని అడిగితే.. "రామ్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది" అని అన్నారు.

"నేను చేసిన సినిమాలు కంటే చేయకుండా ఆపేసిన స్క్రిప్ట్స్ ఎక్కువ. రామ్ వరకు వెళ్లకుండా చాలా కథలు పక్కన పెట్టేసాం. కథపై నాకు సంతృప్తి కలిగినప్పుడు రామ్ తో సినిమా చేస్తా" అని చెప్పుకొచ్చారు. మీరు త్రివిక్రమ్ మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు? రామ్ హీరోగా సినిమా చేస్తారా? అనే ప్రశ్నలకు బదులిస్తూ.. "త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా చేయాలని నాకు కూడా ఉంది. ముందు తన కమిట్మెంట్స్ ఏమున్నాయో త్రివిక్రమ్ చూసుకోవాలి. రామ్ హీరోగా చేస్తే ఈ స్క్రిప్ట్ బాగుంటుందని అతను అనుకోవాలి" అని అన్నారు.

Also Read : ఓటీటీలో వరుణ్, లావణ్య పెళ్లి వీడియో - అసలు విషయాన్ని బయటపెట్టిన వరుణ్ తేజ్ టీమ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
IPL 2024: రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP DesamVizag Police About Sensational Attack | వైజాగ్‌లో కుటుంబంపై జరిగిన దాడి గురించి స్పందించిన పోలీసులు | ABP DesamPavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP DesamWhat if RCB Vs CSK Match Cancelled | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
IPL 2024: రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Rains: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Embed widget