అన్వేషించండి

Sravanthi Ravi Kishore: త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్‌తో సినిమా చేయాలని ఉంది - నిర్మాత స్రవంతి రవి కిషోర్

ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మించిన 'దీపావళి' చిత్రం ఈనెల 11న విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా స్రవంతి రవి కిషోర్ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

టాలీవుడ్‌లో ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ స్రవంతి మూవీస్ అధినేత 'స్రవంతి'' రవి కిషోర్ తాజాగా 'దీపావళి' అనే సినిమాను నిర్మించారు. రవి కిషోర్ తొలితమిళ సినిమా 'కిడా' కి ఇది తెలుగు అనువాదం. ఈనెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ మీడియాతో ముచ్చటించారు. 'మీ సినీ ప్రయాణంలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటి?'అని అడగ్గా..

" డైరెక్టర్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏం తీయబోతున్నాడో నాకు ముందే తెలియలని కోరుకుంటా. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత సెట్స్ మీ ఇంటికి వెళ్తాం. ఐదారు నెలల నుంచి ఒక స్క్రిప్ట్ వరకు జరుగుతుంది. మరో మూడు నెలలు పట్టొచ్చు. ఒక స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు మరో స్క్రిప్ట్ గురించి ఆలోచించను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే" అని చెప్పారు. 'కిడా' కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు బదులిస్తూ.."నేను చెన్నైలో కథలు వింటున్న. నా ఫ్రెండ్ ఒకరు ఓ కథ విన్నాను. మీరు వినండి అని పది నిమిషాలు చెప్పాడు. నాకు కథ నచ్చి వెంటనే డైరెక్టర్ ఆర్ ఏ వెంకట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశా. వేరే నిర్మాతతో చేద్దామని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఒకవేళ మార్పులు ఏమైనా ఉంటే చెప్పమని అడిగితే 15 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు. అప్పుడు స్క్రిప్ట్ అంతా రికార్డ్ చేసి పంపించమని అడిగాను. బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ చేసి పంపడంతో అది విని ఓకే చేశాను" అని చెప్పారు.

'రిలీజ్ కి ముందే 'దీపావళి'కి అవార్డులు వచ్చాయి. దీనిపై మీ ఫీలింగ్ ఏంటి?' అని అడిగితే.. "నేను కథ నమ్మి సినిమా నిర్మించా. నాకు లాభం ఎంత వస్తుంది అని ఆలోచించకుండా మంచి సినిమా అవుతుందని నమ్మాను. సినిమా చూసిన కొందరు ఫ్రెండ్స్ ఫిలిం ఫెస్టివల్స్ లేదా అవార్డులకు ఎందుకు పంపించకూడదని అడిగారు. స్నేహితుల మాటలతో ఇండియా మనోరమకు పంపించా. ఒకరోజు సినిమా సెలెక్ట్ అయిందని ఫోన్ వచ్చింది. అది ఒక గొప్ప అనుభూతి. అందరి మనసుని హద్దుకునే చిత్రమిది" అని అన్నారు. ప్రీమియర్స్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. "తెలుగులో దిల్ రాజుతో పాటూ మీడియా కూడా ఈ సినిమా చూసింది. బాగుందని అందరూ ప్రశంసించారు. చెన్నైలో సుమారు 200 మంది మీడియా మిత్రులకు ఓ షో వేశాం. సినిమా చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంతకుముందు గోవాలో కూడా అలాంటి స్పందనే వచ్చింది" అని అన్నారు.

దీపావళికి పెద్ద సినిమాలు విడుదల మధ్య మీ తమ సినిమా విడుదల చేయడంపై మాట్లాడుతూ.. "దీపావళి పండక్కి బాణా సంచాలు, వెలుగులు ఎంత ముఖ్యమో పిండి వంటలు, కొత్త దుస్తులు కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా కూడా అంతే. ఇప్పుడు ఆడియన్స్ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా దీపావళిని కూడా చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను" అని అన్నారు. 'మీ ఇంట్లో స్టార్ హీరో ఉన్నారు. మీరు అడిగితే పెద్ద హీరోలు కూడా సినిమాలు చేస్తారు. కానీ మీరు చిన్న సినిమా చేయడానికి కారణం ఏంటి?' అని అడిగితే.. "రామ్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది" అని అన్నారు.

"నేను చేసిన సినిమాలు కంటే చేయకుండా ఆపేసిన స్క్రిప్ట్స్ ఎక్కువ. రామ్ వరకు వెళ్లకుండా చాలా కథలు పక్కన పెట్టేసాం. కథపై నాకు సంతృప్తి కలిగినప్పుడు రామ్ తో సినిమా చేస్తా" అని చెప్పుకొచ్చారు. మీరు త్రివిక్రమ్ మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు? రామ్ హీరోగా సినిమా చేస్తారా? అనే ప్రశ్నలకు బదులిస్తూ.. "త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా చేయాలని నాకు కూడా ఉంది. ముందు తన కమిట్మెంట్స్ ఏమున్నాయో త్రివిక్రమ్ చూసుకోవాలి. రామ్ హీరోగా చేస్తే ఈ స్క్రిప్ట్ బాగుంటుందని అతను అనుకోవాలి" అని అన్నారు.

Also Read : ఓటీటీలో వరుణ్, లావణ్య పెళ్లి వీడియో - అసలు విషయాన్ని బయటపెట్టిన వరుణ్ తేజ్ టీమ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget